బాక్సాఫీస్ నీరసంగా ఉంది. వారాంతం కాకుండా మాములు రోజుల్లో థియేటర్ రెంట్లు కూడా గిట్టుబాటు కానంత వీక్ గా వసూళ్లు నమోదవుతున్నాయి. సంక్రాంతికి విడుదలైన వాటిలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలు ఫైనల్ రన్ కు చేరుకోగా కేవలం వీకెండ్ కలెక్షన్ల కోసం వేరే ఆప్షన్ లేక నెట్టుకొస్తున్న కేంద్రాలు చాలా ఉన్నాయి. వీటి ఓటిటి రిలీజ్ డేట్లు కూడా అఫీషియల్ గా వచ్చేసిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ అమిగోస్ కు వచ్చిన టాక్ ప్రభావం సోమవారం డ్రాప్ లోనే స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని మెయిన్ సెంటర్స్ లో టైటానిక్ రీ రిలీజ్ కొంత ఆశాజనకంగా ఉండగా బీసీల్లో మాత్రం సోసోనే.
ఇక పఠాన్ సైతం చాలా కష్టపడుతోంది. మొదటి వారం దూకుడు బాగా తగ్గిపోయింది. హైదరాబాద్ లాంటి నగరాలు మినహాయించి సెలవు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. మొన్న శుక్రవారం వచ్చిన చిన్న సినిమాలు ఐపిఎల్, దేశం కోసం లాంటి వాటిని అడిగే నాథుడు లేడు. ఇప్పుడీ స్లంప్ నుంచి బయటికి తీసుకురావాల్సింది శివరాత్రి చిత్రాలే. ధనుష్ సార్ 17న రాబోతోంది. ట్రైలర్ బాగానే ఉంది కానీ ప్రస్తుతానికి ఆడియన్స్ లో దీని మీద విపరీతమైన ఆసక్తినేం పెంచలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యాక ఏదైనా మార్పు వస్తుందో చూడాలి. హీరో ఇమేజ్ ఆశించిన బజ్ తేలేకపోతోంది.
దీని కోసమే ఒక రోజు ఆలస్యంగా వస్తున్న కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ కేవలం కంటెంట్ ని నమ్ముకుని వస్తోంది. హీరోనే పబ్లిసిటీ భారాన్ని మోస్తూ నెలరోజులుగా తిరుగుతూనే ఉన్నాడు. బాగుందనే టాక్ వస్తేనే సాయంత్రం ఆటనుంచి పికప్ ఆశించవచ్చు. అనూహ్యంగా హాలీవుడ్ మూవీ యాంట్ మ్యాన్ క్వంటమేనియా మీద హైప్ ఎక్కువ కనిపిస్తోంది. బ్లాక్ పాంథర్, అవతార్ తర్వాత ఆ స్థాయి రెస్పాన్స్ దీనికి వస్తుందని నిర్మాణ సంస్థ ధీమాగా ఉంది. ఎలాగూ పండగ తర్వాత వచ్చే వారంలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు కాబట్టి బయ్యర్ల భారాన్ని తగ్గించే బాధ్యత ధనుష్, కిరణ్ ల మీదే ఉంది.
గత కొన్ని వారాలుగా రీ రిలీజుల ప్రహసనం మరీ ఎక్కువైపోయింది. హిట్టు ఫ్లాపు సంబంధం లేకుండా వరసబెట్టి దించేస్తున్నారు. అవి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానుల విషయంలో ఏ రీతిన స్పందిస్తారన్న విషయాన్ని ఇప్పుడు…
రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 3 స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లలో మిస్…
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…
మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…
విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…