ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం హనుమాన్ జంక్షన్ తో టాలీవుడ్ దర్శకుడిగా అడుగు పెట్టిన మోహన్ రాజా ఆ తర్వాత పూర్తిగా తమిళంకే అంకితమైపోయాడు. ఎక్కువ రీమేకులతోనే హిట్లు కొట్టి బాగా సెటిలయ్యాడు. రెండు దశాబ్దాల తర్వాత చిరంజీవి పిలుపుతో లూసిఫర్ తెలుగు రూపకం కోసం వచ్చి ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశాడు. టేకింగ్ పరంగా మంచి మార్కులతో భారీ ఓపెనింగ్ దక్కినప్పటికీ గాడ్ ఫాదర్ చివరికి బ్లాక్ బస్టర్ అనిపించుకోలేకపోయింది. నిర్మాత ఓన్ రిలీజ్ వల్ల భారీ లాభాలు వచ్చాయని పబ్లిక్ గా చెప్పేసినా బయ్యర్లు మాత్రం కాదంటున్నారు.
దీని సంగతలా ఉంచితే మోహన్ రాజా నాగార్జున కోసం ఎప్పుడో ఒక స్క్రిప్ట్ ని రెడీ చేసుకుని వినిపించి ఆ మేరకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇప్పించుకున్నారు. ఇందులో అఖిల్ కాంబినేషన్ ఉంటుందని లీక్ కూడా వచ్చింది. కింగ్ వందవ ల్యాండ్ మార్క్ మూవీగా దీన్ని ప్లాన్ చేసుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు దీని గురించి ఎలాంటి ఉలుకు పలుకు లేదు. నాగార్జున త్వరలో రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ ని దర్శకుడిగా పరిచయం చేయబోయే సినిమాను మొదలుపెట్టబోతున్నారు. ఇది గత రెండు నెలల్లో జరిగిన డెవెలప్ మెంట్. అంటే మోహన్ రాజాని వద్దనుకున్నట్టేగా.
ఆయనేమో తని ఒరువన్(రామ్ చరణ్ ధృవ ఒరిజినల్ వెర్షన్) సీక్వెల్ పనుల్లో పడిపోయాడు. గాడ్ ఫాదర్ వల్ల అవకాశాలు క్యూ కడతాయనుకుంటే అది జరగకపోవడంతో తిరిగి బ్యాక్ టు పెవిలియన్ తప్పేలా లేదు. ఒకవేళ నాగ్ భవిష్యత్తులో చూద్దామని చెప్పారో లేదో తెలియాలన్నా ఇంకొంత కాలం వేచి చూడక తప్పదు. గాడ్ ఫాదర్ టైంలో ఎక్కడ చూసినా ఏ ఛానల్ లో విన్నా తన పేరే మారుమ్రోగిపోయేలా చేసుకున్న మోహన్ రాజాకు ఇలాంటి పరిస్థితి తలెత్తడం విచిత్రమే. ఇప్పటికిప్పుడైతే తెలుగులో పెద్ద హీరోలతో ఆఫర్లు లేనట్టే.
This post was last modified on February 13, 2023 11:03 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…