ఈ మధ్య కాలంలో బాగా ఫ్రస్టేషన్లో ఉన్న టాలీవుడ్ ఫ్యాన్స్ అంటే తారక్ అభిమానులే. తమ హీరో ఏడాదిన్నర నుంచి ఏ సినిమా షూటింగ్లో పాల్గొనకుండా ఖాళీగా ఉండడం.. కొరటాల శివతో అనుకున్న సినిమా ఎంతకీ మొదలు కాకపోవడంతో వారి ఆవేదన మామూలుగా లేదు. చివరికి వారి గొడవ బాగా ఎక్కువైపోయి అమిగోస్ ప్రి రిలీజ్ ఈవెంట్లో తారక్ కాస్త అసహనం వ్యక్తం చేశాడు.
అప్డేట్ కోసం అంత గొడవ చేస్తే ఎలా అంటూనే.. కొరటాల సినిమాకు నెలలోనే ముహూర్తం ఉంటుందని, వచ్చే నెలలో షూటింగ్ మొదలవుతుందని ప్రకటించాడు. అన్న ప్రకారమే ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ఈ నెలలోనే డేట్ ఫిక్సయింది. ఫిబ్రవరి 23న గురువారం మంచి ముహూర్తం ఉండడంతో ఆ రోజే ఈ సినిమా ప్రారంభోత్సవం జరపాలని నిర్ణయించారట. వచ్చే నెల మూడో వారంలో షూటింగ్ మొదలవుతుందని సమాచారం.
ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్తో కలిసి కొరటాల శివ మిత్రుడు మిక్కిలినేని సుధాకర్ నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఇందులో తారక్ సరసన బాలీవుడ్ భామ జాన్వి కపూర్ కథానాయికగా నటించనున్నట్లు సమాచారం.
హైదరాబాద్తో పాటు వైజాగ్, గోవాల్లో మెజారిటీ చిత్రీకరణ జరపనున్నారు. హైదరాబాద్ శివార్లలో ఓ భారీ సెట్ నిర్మాణం జరుపుకుంటుండగా.. అందులోనే తొలి షెడ్యూల్ షూట్ చేయనున్నారు. ఈ చిత్రం పోర్టు నేపథ్యంలో సాగుతుందని సంకేతాలు వస్తున్న సంగతి తెలిసిందే.
కాగా ముహూర్తం వేడుక గురించి సమాచారం బయటికి రావడం, అదే సమయంలో తారక్ కెరీర్లో స్పెషల్ మూవీ అయిన అదుర్స్కు స్పెషల్ షోలు ఫిక్స్ కావడంతో అభిమానుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. మార్చి 4న అదుర్స్ స్పెషల్ షోలు పడనున్నాయి. దీంతో పాటు మే 20న తారక్ పుట్టిన రోజును పురస్కరించుకుని సింహాద్రి స్పెషల్ షోలకు కూడా ప్లానింగ్ జరుగుతోంది.
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…