ఎవరు ఔనన్నా కాదన్నా ఈ రోజుల్లో సినిమాల ఫలితాలను రివ్యూలు నిర్దేశిస్తున్నాయన్నది వాస్తవం. చాలా కొన్ని సినిమాలు మాత్రమే సమీక్షలతో సంబంధం లేకుండా ఫలితాలు అందుకుంటూ ఉంటాయి. మిగతా చిత్రాలన్నీ కూడా రివ్యూలకు అనుగుణంగానే ఆడుతుంటాయి.
ఐతే తమ సినిమాలకు నెగెటివ్ రివ్యూలు వస్తే ఫిలిం సెలబ్రెటీలు తట్టుకోలేరు. ఎవరి పని వాళ్లది అని అర్థం చేసుకోకుండా రివ్యూయర్ల మీద మండిపడుతుంటారు.
ఐతే రివ్యూల్లో కొన్ని పక్షపాతంతో, సరైన అవగాహన లేకుండా, దురుద్దేశాలతో రాసేవి కూడా ఉంటాయన్నది కూడా వాస్తవమే కానీ.. రివ్యూయర్లందరినీ కలిపి విమర్శించడం.. అసంబంద్ధమైన విమర్శలు చేయడం కూడా తప్పే. ప్రస్తుతం తమిళ కథానాయిక వరలక్ష్మి శరత్ కుమార్ అలాగే సమీక్షకులపై విరుచుకుపడింది. తాను లీడ్ రోల్ చేసిన ‘కొండ్రల్ పావమ్’ అనే సినిమాకు నెగెటివ్ రివ్యూలు రావడంతో సమీక్షకులపై ఆమె మండిపడింది.
కన్నడ చిత్రం ‘ఆ కరాళ రాత్రి’కి రీమేక్గా తెలుగులో పాయల్ రాజ్పుత్, కృష్ణచైతన్య జంటగా ‘అనగనగా ఓ అతిథి’ అనే సినిమా వచ్చింది గుర్తుందా? ఇప్పుడు ‘ఆ కరాళ రాత్రి’ తమిళంలో ‘కొండ్రల్ పావమ్’ పేరుతో రీమేక్ అయింది.
ఐతే తెలుగులో మాదిరే తమిళంలోనూ దీనికి నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. ఇది వరలక్ష్మికి రుచించలేదు. ‘‘కొత్త సినిమాలు రిలీజైన వెంటనే కొంతమంది సోషల్ మీడియాలో రివ్యూలు ఇచ్చేస్తున్నారు. సినిమాలో అది బాలేదు. ఇది బాలేదు. అసలు మెసేజే లేదు.. అని ఏదేదో చెప్పేస్తున్నారు.
అలాంటి వాళ్లందరినీ నేను అడిగేది ఒక్కటే.. మీరసలు సినిమా నుంచి ఏం ఆశిస్తున్నారు? గతంలో అందరూ సినిమాను వినోదం కోసం చూసేవారు. కానీ ఇప్పుడు ఎంజాయ్ చేయడం మరిచిపోయి ఏం లోపం వెతుకుదామా అని చూస్తున్నారు. నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.
ఒక సినిమా హిట్టా ఫ్లాపా అని చెప్పడానికి మీరెవరు? మీరు రివ్యూలు ఇవ్వాలనుకుంటే సినిమా రిలీజయ్యాక ఐదారు రోజులు ఆగండి. ప్రేక్షకులు సినిమా చూసి ఆనందించే అవకాశం ఇవ్వండి’’ అని వరలక్ష్మి పేర్కొంది.
This post was last modified on February 12, 2023 10:51 pm
రామాయణ టీజర్ మీద సోషల్ మీడియాలో ఎంత నెగటివిటీ నడుస్తుందో తెలిసిందే. విజువల్స్ బాగానే ఉన్నప్పటికీ వాటి ప్రెజెంటేషన్, క్వాలిటీ…
మొన్న విడుదలైన రాకాస, బైకర్ రెండూ స్టడీగా ఉన్నాయి. అయితే వాటికొచ్చిన టాక్స్ తో పోల్చుకుంటే వసూళ్లు అంత వేగంగా…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ హాట్ హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ ఒకరు. చాలా వరకు సినిమా ప్రమోషన్లకు, ఈవెంట్లకు గ్లామర్…
టాలీవుడ్లో అడివి శేష్ది విచిత్రమైన ప్రయాణం. హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో కర్మ, కిస్ సినిమాలు తీసి బొక్క బోర్లా పడ్డ అతను..…
ఏపీలో కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల సంఖ్య దాదాపు 88 వరకు ఉంటుందన్న చర్చ నడుస్తోంది. రాష్ట్రాల వారిగా ఇటీవల కేంద్ర…
విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు దేవస్థానాల ప్రధాన గర్భాలయాల్లో పూజలు నిర్వహించటానికి వీల్లేదంటూ దేవాదాయ శాఖ (ధార్మిక పరిషత్).. శృంగేరి…