సమంత ప్రధాన పాత్రలో సీనియర్ దర్శకుడు గుణశేఖర్ రూపొందించిన భారీ చిత్రం ‘శాకుంతలం’ రిలీజ్ డేట్ మారుతూ వస్తున్న సంగతి తెలిసిందే. పలుమార్లు డేట్ మార్చాక ఫిబ్రవరి 17కు ఫిక్స్ అన్నారు కానీ.. చివరికి ఆ డేట్ కూడా మారింది. కొన్ని కారణాల వల్ల ముందు ప్రకటించినట్లు ఈ నెల 17న సినిమాను రిలీజ్ చేయలేకపోతున్నామని.. కొత్త విడుదల తేదీని తర్వాత ప్రకటిస్తామని కొన్ని రోజుల కిందటే అధికారిక ప్రకటన ఇచ్చింది చిత్ర బృందం.
ఇక మళ్లీ కొత్త డేట్ కోసం ఎన్ని రోజులు ఎదురు చూడాలో అనుకున్నారు సమంత ఫ్యాన్స్. కానీ వారిని ఎక్కువ సమయం నిరీక్షించనివ్వకుండా త్వరగానే కొత్త విడుదల తేదీని ప్రకటించేశారు. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే వేసవి కానుకగా ఏప్రిల్ 14న శాకుంతలంను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.
శాకుంతలం వాయిదాకు కారణాలు ఏవైతేనేం ఫిబ్రవరితో పోలిస్తే వేసవిలో రావడం మంచిదే. ఏప్రిల్ 14 అంటే ఆకర్షణీయమైన డేట్ అనే చెప్పాలి. ఈ నెల 17కు హిందీలో సినిమాకు చాలినన్ని థియేటర్లు దక్కవన్న కారణంతోనే సినిమాను వాయిదా వేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆలస్యం అయితే అయింది కానీ.. ఈసారైనా చెప్పిన డేట్కు సినిమా వస్తే చాలని సమంత అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగానే పూర్తి చేసిన గుణశేఖర్ పోస్ట్ ప్రొడక్షన్ కోసం చాలా సమయమే తీసుకున్నాడు. విజువల్ ఎఫెక్ట్స్ కోసం దాదాపు ఏడాది సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని గుణశేఖర్తో కలిసి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించాడు. సమంతకు జోడీగా ఈ చిత్రంలో దేవ్ అనే మలయాళ నటుడు నటించాడు. మోహన్ బాబు, కృష్ణంరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు.
This post was last modified on February 11, 2023 10:03 am
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై…
చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు తమ సోషల్ మీడియా అకౌంట్లను సబ్స్క్రిప్షన్ మోడ్లోకి మార్చి, వాటి ద్వారా హాట్…
టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…
రాకా.. ప్రస్తుతం ఇండియాలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటి. పుష్ప-2 లాంటి సెన్సేషనల్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్…