సమంత ప్రధాన పాత్రలో సీనియర్ దర్శకుడు గుణశేఖర్ రూపొందించిన భారీ చిత్రం ‘శాకుంతలం’ రిలీజ్ డేట్ మారుతూ వస్తున్న సంగతి తెలిసిందే. పలుమార్లు డేట్ మార్చాక ఫిబ్రవరి 17కు ఫిక్స్ అన్నారు కానీ.. చివరికి ఆ డేట్ కూడా మారింది. కొన్ని కారణాల వల్ల ముందు ప్రకటించినట్లు ఈ నెల 17న సినిమాను రిలీజ్ చేయలేకపోతున్నామని.. కొత్త విడుదల తేదీని తర్వాత ప్రకటిస్తామని కొన్ని రోజుల కిందటే అధికారిక ప్రకటన ఇచ్చింది చిత్ర బృందం.
ఇక మళ్లీ కొత్త డేట్ కోసం ఎన్ని రోజులు ఎదురు చూడాలో అనుకున్నారు సమంత ఫ్యాన్స్. కానీ వారిని ఎక్కువ సమయం నిరీక్షించనివ్వకుండా త్వరగానే కొత్త విడుదల తేదీని ప్రకటించేశారు. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే వేసవి కానుకగా ఏప్రిల్ 14న శాకుంతలంను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.
శాకుంతలం వాయిదాకు కారణాలు ఏవైతేనేం ఫిబ్రవరితో పోలిస్తే వేసవిలో రావడం మంచిదే. ఏప్రిల్ 14 అంటే ఆకర్షణీయమైన డేట్ అనే చెప్పాలి. ఈ నెల 17కు హిందీలో సినిమాకు చాలినన్ని థియేటర్లు దక్కవన్న కారణంతోనే సినిమాను వాయిదా వేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆలస్యం అయితే అయింది కానీ.. ఈసారైనా చెప్పిన డేట్కు సినిమా వస్తే చాలని సమంత అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగానే పూర్తి చేసిన గుణశేఖర్ పోస్ట్ ప్రొడక్షన్ కోసం చాలా సమయమే తీసుకున్నాడు. విజువల్ ఎఫెక్ట్స్ కోసం దాదాపు ఏడాది సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని గుణశేఖర్తో కలిసి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించాడు. సమంతకు జోడీగా ఈ చిత్రంలో దేవ్ అనే మలయాళ నటుడు నటించాడు. మోహన్ బాబు, కృష్ణంరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు.
మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…