సమంత ప్రధాన పాత్రలో సీనియర్ దర్శకుడు గుణశేఖర్ రూపొందించిన భారీ చిత్రం ‘శాకుంతలం’ రిలీజ్ డేట్ మారుతూ వస్తున్న సంగతి తెలిసిందే. పలుమార్లు డేట్ మార్చాక ఫిబ్రవరి 17కు ఫిక్స్ అన్నారు కానీ.. చివరికి ఆ డేట్ కూడా మారింది. కొన్ని కారణాల వల్ల ముందు ప్రకటించినట్లు ఈ నెల 17న సినిమాను రిలీజ్ చేయలేకపోతున్నామని.. కొత్త విడుదల తేదీని తర్వాత ప్రకటిస్తామని కొన్ని రోజుల కిందటే అధికారిక ప్రకటన ఇచ్చింది చిత్ర బృందం.
ఇక మళ్లీ కొత్త డేట్ కోసం ఎన్ని రోజులు ఎదురు చూడాలో అనుకున్నారు సమంత ఫ్యాన్స్. కానీ వారిని ఎక్కువ సమయం నిరీక్షించనివ్వకుండా త్వరగానే కొత్త విడుదల తేదీని ప్రకటించేశారు. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే వేసవి కానుకగా ఏప్రిల్ 14న శాకుంతలంను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.
శాకుంతలం వాయిదాకు కారణాలు ఏవైతేనేం ఫిబ్రవరితో పోలిస్తే వేసవిలో రావడం మంచిదే. ఏప్రిల్ 14 అంటే ఆకర్షణీయమైన డేట్ అనే చెప్పాలి. ఈ నెల 17కు హిందీలో సినిమాకు చాలినన్ని థియేటర్లు దక్కవన్న కారణంతోనే సినిమాను వాయిదా వేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆలస్యం అయితే అయింది కానీ.. ఈసారైనా చెప్పిన డేట్కు సినిమా వస్తే చాలని సమంత అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగానే పూర్తి చేసిన గుణశేఖర్ పోస్ట్ ప్రొడక్షన్ కోసం చాలా సమయమే తీసుకున్నాడు. విజువల్ ఎఫెక్ట్స్ కోసం దాదాపు ఏడాది సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని గుణశేఖర్తో కలిసి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించాడు. సమంతకు జోడీగా ఈ చిత్రంలో దేవ్ అనే మలయాళ నటుడు నటించాడు. మోహన్ బాబు, కృష్ణంరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు.
This post was last modified on February 11, 2023 10:03 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…