సమంత ప్రధాన పాత్రలో సీనియర్ దర్శకుడు గుణశేఖర్ రూపొందించిన భారీ చిత్రం ‘శాకుంతలం’ రిలీజ్ డేట్ మారుతూ వస్తున్న సంగతి తెలిసిందే. పలుమార్లు డేట్ మార్చాక ఫిబ్రవరి 17కు ఫిక్స్ అన్నారు కానీ.. చివరికి ఆ డేట్ కూడా మారింది. కొన్ని కారణాల వల్ల ముందు ప్రకటించినట్లు ఈ నెల 17న సినిమాను రిలీజ్ చేయలేకపోతున్నామని.. కొత్త విడుదల తేదీని తర్వాత ప్రకటిస్తామని కొన్ని రోజుల కిందటే అధికారిక ప్రకటన ఇచ్చింది చిత్ర బృందం.
ఇక మళ్లీ కొత్త డేట్ కోసం ఎన్ని రోజులు ఎదురు చూడాలో అనుకున్నారు సమంత ఫ్యాన్స్. కానీ వారిని ఎక్కువ సమయం నిరీక్షించనివ్వకుండా త్వరగానే కొత్త విడుదల తేదీని ప్రకటించేశారు. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే వేసవి కానుకగా ఏప్రిల్ 14న శాకుంతలంను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.
శాకుంతలం వాయిదాకు కారణాలు ఏవైతేనేం ఫిబ్రవరితో పోలిస్తే వేసవిలో రావడం మంచిదే. ఏప్రిల్ 14 అంటే ఆకర్షణీయమైన డేట్ అనే చెప్పాలి. ఈ నెల 17కు హిందీలో సినిమాకు చాలినన్ని థియేటర్లు దక్కవన్న కారణంతోనే సినిమాను వాయిదా వేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆలస్యం అయితే అయింది కానీ.. ఈసారైనా చెప్పిన డేట్కు సినిమా వస్తే చాలని సమంత అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగానే పూర్తి చేసిన గుణశేఖర్ పోస్ట్ ప్రొడక్షన్ కోసం చాలా సమయమే తీసుకున్నాడు. విజువల్ ఎఫెక్ట్స్ కోసం దాదాపు ఏడాది సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని గుణశేఖర్తో కలిసి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించాడు. సమంతకు జోడీగా ఈ చిత్రంలో దేవ్ అనే మలయాళ నటుడు నటించాడు. మోహన్ బాబు, కృష్ణంరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు.
This post was last modified on February 11, 2023 10:03 am
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…