ఏదైనా ఎగ్జైటింగ్ గా అనిపించే లీక్ వస్తే చాలు సోషల్ మీడియా ఊగిపోతోంది. అది నిజమో కాదో ఎలాంటి ఆధారాలు లేకపోయినా విపరీతమైన ట్రెండింగ్ జరిగిపోతోంది. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకున్న విజయ్ కొత్త సినిమా లియో దీపావళి విడుదలను టార్గెట్ గా చేసుకున్న సంగతి తెలిసిందే. విక్రమ్ తర్వాత దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన మాస్టర్ హీరో కాంబోతో చేస్తున్న మూవీ కావడంతో అంచనాలు మాములుగా లేవు. పైగా షూట్ స్టార్ట్ అయ్యిందన్న దానికి సూచికగా రెండు నిమిషాల సుదీర్ఘ టీజర్ ని ప్రత్యేకంగా షూట్ చేసి రిలీజ్ చేయడం హైప్ ని పెంచేసింది.
ఇదిలా ఉండగా ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ చిన్న క్యామియో చేశాడన్న ట్విస్టు కొత్తగా చక్కర్లు కొడుతోంది. క్లైమాక్స్ లో పేరు మోసిన గ్యాంగ్ స్టర్లు లియో దగ్గరకు వచ్చే క్రమంలో వాళ్ళలో ఒకడుగా చరణ్ ఉంటాడని చెన్నై టాక్. వీలైతే సూర్య, కమల్ హాసన్ లను కూడా ఇదే ఫ్రేమ్ లోకి తీసుకొచ్చేందుకు లోకేష్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడట. మొన్న టీజర్ చివరి షాట్ లో ఓ ఖరీదైన కారు తెలంగాణ రిజిస్ట్రేషన్ తో ఉండటం, అందులోనే చరణ్ ఎంట్రీ ఉంటుందన్న వార్తకు బలం చేకూరుస్తోంది. ఇది వాస్తవమో కాదో యూనిట్ ఇప్పటికిప్పుడు చెప్పలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం మురిసిపోతున్నారు.
వినడానికి బాగానే ఉంది కానీ చరణ్ ఇటీవలి కాలంలో స్పెషల్ రోల్స్ ఎక్కువ చేస్తున్నాడు. ఆచార్యలో పొడిగించిన అతిధి పాత్ర తేడా కొట్టింది. సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ లో నటించిన కృతజ్ఞతలో కిసీకా భాయ్ కిసీకా జాన్ లో ఆల్రెడీ చిన్న క్యారెక్టర్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు లియో అంటే మూడోది అవుతుంది. అయితే దీన్ని పూర్తిగా కొట్టిపారేయలేం. ఎందుకంటే లియో, విక్రమ్ 2, ఖైదీ 2, రోలెక్స్ ల తర్వాత లోకేష్ లిస్టులో రామ్ చరణ్ ఉన్నాడు. సో ప్రత్యేక రిక్వెస్ట్ మీద ఎస్ అన్నా ఆశ్చర్యం లేదు. లియోలో త్రిష, ప్రియా ఆనంద్ హీరోయిన్లు కాగా అర్జున్, సంజయ్ దత్ ఇతర కీలక తారాగణం.
This post was last modified on February 9, 2023 10:16 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…