పునీత్ రాజ్ కుమార్ ఎంత గొప్పవాడో అతను చనిపోయాకే ప్రపంచానికి తెలిసిందే. బతికున్నంత వరకు అతను కన్నడనాట ఒక పెద్ద హీరో. అంత వరకే. కానీ ఏడాదిన్నర కిందట పునీత్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించాక.. అతనెంత గొప్ప వ్యక్తో, ప్రచారానికి దూరంగా ఎంత పెద్ద స్థాయిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడో వెల్లడైంది. అప్పుడు భాష, ప్రాంతం అనే భేదం లేకుండా అతడి గురించి అందరూ బాధ పడ్డారు.
తండ్రి రాజ్ కుమార్ పేరు నిలబెడుతూ గొప్ప నడవడికతో మెలిగిన పునీత్కు తన సోదరులతో ఎంత గొప్ప అనుబంధం ఉందనేది కూడా అతను చనిపోయాకే తెలిసిందే. పునీత్ అన్నయ్య శివరాజ్ కుమార్ బయట ఏ కార్యక్రమంలో పాల్గొన్నా సరే.. తమ్ముడు పేరు ఎత్తినా, అతడి బొమ్మ కనిపించినా తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతం అవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో చాలా చూశాం.
ఐతే పునీత్ మరణించి ఏడాదిన్నర కావస్తున్నా.. శివరాజ్ ఇంకా తమ్ముడి లేని లోటు నుంచి బయట పడ్డట్లుగా లేడు. తాజాగా తన కొత్త చిత్రం ‘వేద’ ప్రి రిలీజ్ ఈవెంట్ కోసమని శివరాజ్ హైదరాబాద్కు వచ్చాడు. ఈ వేడుకకు శివరాజ్ సన్నిహితుడైన నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా మధ్యలో పునీత్ గురించి ప్రస్తావిస్తూ ఒక ఏవీ ప్లే చేశారు ఈవెంట్ ఆర్గనైజర్స్. అంతే.. శివరాజ్ తట్టుకోలేకపోయాడు. ఎప్పట్లాగే బోరున విలపించాడు. పక్కనే ఉన్న బాలయ్య శివన్నను పట్టుకుని ఓదార్చే ప్రయత్నం చేశారు.
అనంతరం వేదిక ఎక్కాక బాలయ్య.. పునీత్ గురించి చాలా బాగా మాట్లాడాడు. మనందరం మేం అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెబుతుంటామని.. కానీ పునీత్ ఎలాంటి ఆర్భాటం లేకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడని.. పునీత్ మన మధ్య లేకపోయినా ఆయన స్థానం ఆయనదే, ఆయన స్థాయి ఆయనదే అని బాలయ్య పేర్కొన్నాడు.
This post was last modified on February 8, 2023 11:05 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…