Movie News

మహిళలకు పద్మభూషణ్ బంపర్ ఆఫర్

సినిమా ప్రమోషన్ అంటే కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇంటర్వ్యూలు కాదు. ఇవి చేసినంత మాత్రాన జనానికి మన సినిమా చేరుతుందన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే కంటెంట్ ఎంత బాగున్నా ఫ్యామిలీ ఆడియన్స్ అందులోనూ ముఖ్యంగా మహిళలు థియేటర్ల దాకా రావాలంటే టికెట్ ఖర్చుతో మొదలుపెట్టి ఇంత బిజీగా రెండున్నర గంటలు వినోదం కోసం ఖర్చు పెట్టడం అవసరమా అనే ఆలోచన దాకా వెళతారు. అందుకే స్టార్ హీరోలు లేనివాటికి పబ్లిసిటీ చాలా కీలకంగా మారింది. కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా పెట్టుకుని వచ్చిన రైటర్ పద్మభూషణ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.

కేవలం నాలుగు రోజులకే అయిదు కోట్ల గ్రాస్ దాటేసి భేష్ అనిపించింది. తాజాగా దీని ప్రమోషన్ ని రైటర్ టీమ్ నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. తెలుగు రాష్ట్రాల్లో మహిళలు రేపొక్క రోజు అంటే ఫిబ్రవరి 8న పద్మభూషణ్ ఆడుతున్న థియేటర్లలో ఈ మూవీని ఉచితంగా చూసేయొచ్చు. ఎలాంటి ప్రవేశ రుసుము ఉండదు. కాకపోతే టైంకి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటే చాలు. హౌస్ ఫుల్ అయ్యాక తిరిగి వచ్చే అవసరం బాధ రెండూ తప్పుతాయి. నిన్నటి నుంచి టీమ్ ఫస్ట్ టైం ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని ప్రచారం చేసింది దీని గురించే. అయితే ఇది మొదటిసారి కాదు.

గతంలోనూ కొన్ని చిన్న సినిమాలు ఉదయం ఆటలు ఫ్రీగా స్క్రీన్ చేసిన దాఖలాలు ఉన్నాయి కానీ హిట్ అయిన నోటెడ్ రిలీజ్ ని అది కూడా రెండో వారంలోకి అడుగు పెట్టకుండానే ఇలా ఉచిత ప్రదర్శనలు పెట్టడం ఇదే మొదలు. అయినా పదే పదే ఈవెంట్ల మీద అవుట్ డోర్ పబ్లిసిటీ మీద ఖర్చు పెట్టడం కన్నా ఈ షోలకయ్యే ఖర్చు తక్కువ కాబట్టి ఒకరకంగా చెప్పాలంటే ఇది మంచి ఆలోచన. అసలే లేడీ ఎమోషన్ బాగా పండింది. ముఖ్యంగా తల్లి పాత్ర కంటితడి పెట్టించింది. ఇప్పుడు ఎక్కువ శాతం చూసేస్తారు కాబట్టి వాళ్ళ నుంచి వచ్చే టాక్ ని ఎన్ని కోట్లు పెట్టినా కొనలేమన్నది వాస్తవం.

This post was last modified on February 7, 2023 3:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

1 hour ago

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…

2 hours ago

ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…

3 hours ago

వెంకీ మాట విన‌క‌పోవ‌డంతోనే ఆ ఫ్లాప్

తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత హైప్ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు లాంటి…

5 hours ago

మూకుమ్మడిగా మహేష్ సినిమాలను పిండుతున్నారు

రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…

7 hours ago

సోషల్ మీడియా వేరే ప్రపంచం కాదే

ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…

12 hours ago