ఒక భాషలో విజయవంతం అయిన ప్రతి సినిమా ఇంకో భాషలో ఆడేస్తుందన్న గ్యారెంటీ లేదు. ఉన్నదున్నట్లుగా తీసిన సినిమాలు కూడా చాలానే బోల్తా కొట్టాయి. ఒక భాషలో చాలా బాగా అనిపించే సినిమా.. యాజిటీజ్ అలాగే తీసినా ఇంకో భాషలో ఎఫెక్టివ్గా అనిపించకపోవచ్చు. ఇలా చాలా సినిమాల్లో జరిగింది. ఇప్పుడు మలయాళ హిట్ కప్పెలాకు రీమేక్గా వచ్చిన బుట్టబొమ్మ సినిమాదీ అదే పరిస్థితి.
మాతృకను అనుసరిస్తూ ఉన్నదున్నట్లుగానే ఈ సినిమా తీశాడు కొత్త దర్శకుడు శౌరీ చంద్రశేఖర్ రమేష్. కానీ మాతృకలో ఉన్న ఫీల్ ఇందులో కలగలేదు. ఒరిజినల్లో ఉన్న సహజత్వం ఇక్కడ మిస్సయింది. నేటివిటీ ప్యాక్టర్ కూడా తేడా కొట్టింది. అన్నింటికీ మించి ప్రధాన పాత్రలకు ఎంచుకున్న నటీనటుల విషయంలో తప్పు జరిగిందన్నది స్పష్టం.
మూడు ప్రధాన పాత్రలకూ ఒక్కరంటే ఒక్కరు కూడా పేరున్న తెలుగు ఆర్టిస్టును తీసుకోకపోవడం బుట్టబొమ్మ సినిమాలోని ప్రధాన లోపం. ముగ్గురిలో అర్జున్ దాస్ కొంచెం నయం. అతడికి తమిళంలో నటుడిగా మంచి పేరొచ్చింది. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా కొంచెం పరిచయం ఉన్నాడు.
అయినా సరే.. అతడితోనూ ఎమోషనల్ కనెక్షన్ రావడం కష్టమే. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ అయిన అనైక ఇంకా చిన్న పిల్లలాగే అనిపించింది. లీడ్ రోల్లో సినిమాను మోసేంత స్థాయి ఆమెకు లేకపోయింది. అలాంటి పెర్పామెన్స్ ఇవ్వలేకపోయింది. ఇక మరో లీడ్ రోల్ చేసిన కొత్త నటుడు సూర్య వశిష్ఠ ఒరిజినల్లో ఈ పాత్ర చేసిన రోషన్ మాథ్యూ ముందు తేలిపోయాడు.
ఈ పాత్రకు ముందు అనుకున్నది సిద్ధు జొన్నలగడ్డను. ఒకవేళ అతను ఈ రోల్ చేసి ఉంటే మాత్రం తన పెర్ఫామెన్స్తో దానికో ప్రత్యేకత తెచ్చేవాడు. సినిమాకు ఆకర్షణగా మారేవాడు. కానీ అతను తప్పుకోవడం సినిమాకు పెద్ద మైనస్సే అయింది.
This post was last modified on February 5, 2023 12:42 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…