అక్కినేని యువ కథానాయకుడు అఖిల్కు కెరీర్ పరంగా చాలా ముఖ్యమైన సినిమా ‘ఏజెంట్’. హీరోగా తొలి మూడు చిత్రాలు తీవ్ర నిరాశకు గురి చేయగా.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో ఓ మోస్తరు విజయాన్నందుకుని బతుకు జీవుడా అనుకున్నాడు అఖిల్. ఐతే క్లాస్ సినిమాతో తొలి సక్సెస్ రుచి చూశాక అఖిల్ రూటు మార్చేశాడు. పెద్ద మాస్ హీరో లాగా భారీ బడ్జెట్లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ చేయడానికి రెడీ అయిపోయాడు. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా చేస్తున్నాడు.
ఈ చిత్రం సుదీర్ఘ కాలంగా మేకింగ్ దశలో ఉంది. గత ఏడాది ఆగస్టులోనే రిలీజ్ కావాల్సిన సినిమా చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో వాయిదా పడుతూ వస్తోంది. చివరికి ఏప్రిల్ 28న సినిమాను విడుదల చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఒక చిన్న టీజర్ ద్వారా ప్రకటించారు.
ఐతే ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్.. ఇప్పుడొచ్చిన రిలీజ్ టీజర్ చూస్తుంటే అభిమానుల ఉత్సాహం ఎలా ఉన్నా.. సగటు ప్రేక్షకులకు ముందు యాక్షన్ పేరుతో సురేందర్ అండ్ టీం మరీ హద్దులు దాటుతోందా అనిపిస్తోంది. ఈ రోజు చూపించిన టీజర్ అయితే గత ఏడాది పెద్ద డిజాస్టర్ అయిన ‘లైగర్’ను గుర్తు తెచ్చింది. ఆ సినిమా ప్రోమోలు కూడా ఇలాగే అతిగా అనిపించాయి. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో నేల విడిచి సాము చేశాడు పూరి జగన్నాథ్. అది పూర్తిగా బెడిసి కొట్టేసింది.
ఇంకా మాస్ ఇమేజ్ రాని అఖిల్ను మరీ వైల్డ్గా ఇంత చూపించడం, ఓవర్ హీరోయిజం చూపించడం ప్రేక్షకులకు రుచిస్తుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఊరికే ఎలివేషన్లు, యాక్షన్ సన్నివేశాల మీద దృష్టిపెట్టడం కాకుండా కథాకథనాల్లో విషయం, కొంచెం కొత్తదనం ఉండేలా చూసుకోవడం కీలకం. లేదంటే ‘లైగర్’ లాగే చేదు అనుభవం తప్పదు.
This post was last modified on February 4, 2023 5:39 pm
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…