అక్కినేని యువ కథానాయకుడు అఖిల్కు కెరీర్ పరంగా చాలా ముఖ్యమైన సినిమా ‘ఏజెంట్’. హీరోగా తొలి మూడు చిత్రాలు తీవ్ర నిరాశకు గురి చేయగా.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో ఓ మోస్తరు విజయాన్నందుకుని బతుకు జీవుడా అనుకున్నాడు అఖిల్. ఐతే క్లాస్ సినిమాతో తొలి సక్సెస్ రుచి చూశాక అఖిల్ రూటు మార్చేశాడు. పెద్ద మాస్ హీరో లాగా భారీ బడ్జెట్లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ చేయడానికి రెడీ అయిపోయాడు. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా చేస్తున్నాడు.
ఈ చిత్రం సుదీర్ఘ కాలంగా మేకింగ్ దశలో ఉంది. గత ఏడాది ఆగస్టులోనే రిలీజ్ కావాల్సిన సినిమా చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో వాయిదా పడుతూ వస్తోంది. చివరికి ఏప్రిల్ 28న సినిమాను విడుదల చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఒక చిన్న టీజర్ ద్వారా ప్రకటించారు.
ఐతే ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్.. ఇప్పుడొచ్చిన రిలీజ్ టీజర్ చూస్తుంటే అభిమానుల ఉత్సాహం ఎలా ఉన్నా.. సగటు ప్రేక్షకులకు ముందు యాక్షన్ పేరుతో సురేందర్ అండ్ టీం మరీ హద్దులు దాటుతోందా అనిపిస్తోంది. ఈ రోజు చూపించిన టీజర్ అయితే గత ఏడాది పెద్ద డిజాస్టర్ అయిన ‘లైగర్’ను గుర్తు తెచ్చింది. ఆ సినిమా ప్రోమోలు కూడా ఇలాగే అతిగా అనిపించాయి. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో నేల విడిచి సాము చేశాడు పూరి జగన్నాథ్. అది పూర్తిగా బెడిసి కొట్టేసింది.
ఇంకా మాస్ ఇమేజ్ రాని అఖిల్ను మరీ వైల్డ్గా ఇంత చూపించడం, ఓవర్ హీరోయిజం చూపించడం ప్రేక్షకులకు రుచిస్తుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఊరికే ఎలివేషన్లు, యాక్షన్ సన్నివేశాల మీద దృష్టిపెట్టడం కాకుండా కథాకథనాల్లో విషయం, కొంచెం కొత్తదనం ఉండేలా చూసుకోవడం కీలకం. లేదంటే ‘లైగర్’ లాగే చేదు అనుభవం తప్పదు.
This post was last modified on February 4, 2023 5:39 pm
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…
ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…
వైసీపీ అధినేత జగన్కు సోదరుడి వరుసయ్యే కడప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…