హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చిన్నా పెద్ద లేకుండా ప్రతి ఒక్క కళాకారుడు బిజీగా గడిపేవారు. పేరుమోసిన సెలబ్రిటీలకు అయితే ఒక మేనేజరు ఉంటే గాని ఎపుడు ఎలా ఎక్కడికి వెళ్లాలో తెలియనంత బిజీ షెడ్యూల్. కానీ కోవిడ్ కారణంగా నిమిషం ఖాళీ లేని సెలబ్రిటీలకు ఊహించని విశ్రాంతి దొరికింది. బోర్ కొట్టేటంత ఖాళీ సమయం దొరికింది. కానీ ప్రపంచమంతటా ఒకటే సమస్య…ఎక్కడికి వెళ్లినా గృహస్తాశ్రమమే. దీంతో సెలబ్రిటీలకు పొలాలు, అడవులు, ప్రకృతి గుర్తొచ్చాయి.
మొన్న సల్మాన్ ఖాన్ నాట్లు వేస్తూ వరి పంటలో నిమగ్నమయ్యారు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి నగరానికి సుదూరంగా రూరల్ లో ఉన్న తన ఫాంహౌస్ కి వెళ్లి తాత్కాలికంగా కొత్త జీవనం మొదలుపెట్టారు. అవకాశం ఉన్న సెలబ్రిటీలందరూ ఫాంహౌస్ లకు తరలిపోయారు. చిన్నప్పటి నుంచి తాము చేయాలనుకుని చేయలేని పనులన్నీ చేయడం మొదలుపెట్టారు.
తాజాగా తమన్నా అదేబాటలో నడుస్తోంది. ఈ అందాల తార అడవి బాట పట్టింది. ప్రకృతి ఒడిలోకి రా… అది నీలోని అసలు మనిషిని నీకు వెతికిపెడుతుంది అంటూ కామెంట్ చేస్తూ ప్రకృతిలో దిగిన ఓ ఫొటో షేర్ చేసింది. బ్యాక్ ప్యాక్ లో సింపుల్ లగేజ్ లో ప్రకృతిలో విహరిస్తూ కనిపించింది. ఇది సెల్ఫీ కాదు, ఫొటో. అంటే ఆమెతో ఇంకెవరో ఉన్నారు. ఫొటో ఎక్కడ దిగిందీ ఆమె చెప్పలేదు. కానీ తమన్నా మాత్రం చాలా ఉల్లాసంగా విహరిస్తోంది.
This post was last modified on July 22, 2020 7:54 pm
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కష్టపడి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్…
తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ పదేళ్ల కెరీర్లో పెద్దగా ఎఫైర్ వార్తలేమీ వచ్చింది లేదు.…
ప్రభాస్ సినిమా అంటే చాలు.. హైప్కు ఏమీ లోటు ఉండదు. రిలీజ్ దగ్గర పడేకొద్దీ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లోనూ…
ఇదేమీ ఊహాజనిత వార్తకాదు. కొందరు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీలో గత…
ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. ఎప్పటి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్పడమే కాదు.. అంతర్జాతీయ వేదికలపైనా ఆయన తన వాణిని…
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 విడుదల కానుంది. వరస ఫ్లాపుల నుంచి బయటపడేసే సినిమాగా అభిమానులు దీని…