హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చిన్నా పెద్ద లేకుండా ప్రతి ఒక్క కళాకారుడు బిజీగా గడిపేవారు. పేరుమోసిన సెలబ్రిటీలకు అయితే ఒక మేనేజరు ఉంటే గాని ఎపుడు ఎలా ఎక్కడికి వెళ్లాలో తెలియనంత బిజీ షెడ్యూల్. కానీ కోవిడ్ కారణంగా నిమిషం ఖాళీ లేని సెలబ్రిటీలకు ఊహించని విశ్రాంతి దొరికింది. బోర్ కొట్టేటంత ఖాళీ సమయం దొరికింది. కానీ ప్రపంచమంతటా ఒకటే సమస్య…ఎక్కడికి వెళ్లినా గృహస్తాశ్రమమే. దీంతో సెలబ్రిటీలకు పొలాలు, అడవులు, ప్రకృతి గుర్తొచ్చాయి.
మొన్న సల్మాన్ ఖాన్ నాట్లు వేస్తూ వరి పంటలో నిమగ్నమయ్యారు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి నగరానికి సుదూరంగా రూరల్ లో ఉన్న తన ఫాంహౌస్ కి వెళ్లి తాత్కాలికంగా కొత్త జీవనం మొదలుపెట్టారు. అవకాశం ఉన్న సెలబ్రిటీలందరూ ఫాంహౌస్ లకు తరలిపోయారు. చిన్నప్పటి నుంచి తాము చేయాలనుకుని చేయలేని పనులన్నీ చేయడం మొదలుపెట్టారు.
తాజాగా తమన్నా అదేబాటలో నడుస్తోంది. ఈ అందాల తార అడవి బాట పట్టింది. ప్రకృతి ఒడిలోకి రా… అది నీలోని అసలు మనిషిని నీకు వెతికిపెడుతుంది అంటూ కామెంట్ చేస్తూ ప్రకృతిలో దిగిన ఓ ఫొటో షేర్ చేసింది. బ్యాక్ ప్యాక్ లో సింపుల్ లగేజ్ లో ప్రకృతిలో విహరిస్తూ కనిపించింది. ఇది సెల్ఫీ కాదు, ఫొటో. అంటే ఆమెతో ఇంకెవరో ఉన్నారు. ఫొటో ఎక్కడ దిగిందీ ఆమె చెప్పలేదు. కానీ తమన్నా మాత్రం చాలా ఉల్లాసంగా విహరిస్తోంది.
This post was last modified on July 22, 2020 7:54 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…