హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చిన్నా పెద్ద లేకుండా ప్రతి ఒక్క కళాకారుడు బిజీగా గడిపేవారు. పేరుమోసిన సెలబ్రిటీలకు అయితే ఒక మేనేజరు ఉంటే గాని ఎపుడు ఎలా ఎక్కడికి వెళ్లాలో తెలియనంత బిజీ షెడ్యూల్. కానీ కోవిడ్ కారణంగా నిమిషం ఖాళీ లేని సెలబ్రిటీలకు ఊహించని విశ్రాంతి దొరికింది. బోర్ కొట్టేటంత ఖాళీ సమయం దొరికింది. కానీ ప్రపంచమంతటా ఒకటే సమస్య…ఎక్కడికి వెళ్లినా గృహస్తాశ్రమమే. దీంతో సెలబ్రిటీలకు పొలాలు, అడవులు, ప్రకృతి గుర్తొచ్చాయి.
మొన్న సల్మాన్ ఖాన్ నాట్లు వేస్తూ వరి పంటలో నిమగ్నమయ్యారు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి నగరానికి సుదూరంగా రూరల్ లో ఉన్న తన ఫాంహౌస్ కి వెళ్లి తాత్కాలికంగా కొత్త జీవనం మొదలుపెట్టారు. అవకాశం ఉన్న సెలబ్రిటీలందరూ ఫాంహౌస్ లకు తరలిపోయారు. చిన్నప్పటి నుంచి తాము చేయాలనుకుని చేయలేని పనులన్నీ చేయడం మొదలుపెట్టారు.
తాజాగా తమన్నా అదేబాటలో నడుస్తోంది. ఈ అందాల తార అడవి బాట పట్టింది. ప్రకృతి ఒడిలోకి రా… అది నీలోని అసలు మనిషిని నీకు వెతికిపెడుతుంది అంటూ కామెంట్ చేస్తూ ప్రకృతిలో దిగిన ఓ ఫొటో షేర్ చేసింది. బ్యాక్ ప్యాక్ లో సింపుల్ లగేజ్ లో ప్రకృతిలో విహరిస్తూ కనిపించింది. ఇది సెల్ఫీ కాదు, ఫొటో. అంటే ఆమెతో ఇంకెవరో ఉన్నారు. ఫొటో ఎక్కడ దిగిందీ ఆమె చెప్పలేదు. కానీ తమన్నా మాత్రం చాలా ఉల్లాసంగా విహరిస్తోంది.
This post was last modified on July 22, 2020 7:54 pm
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…