హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చిన్నా పెద్ద లేకుండా ప్రతి ఒక్క కళాకారుడు బిజీగా గడిపేవారు. పేరుమోసిన సెలబ్రిటీలకు అయితే ఒక మేనేజరు ఉంటే గాని ఎపుడు ఎలా ఎక్కడికి వెళ్లాలో తెలియనంత బిజీ షెడ్యూల్. కానీ కోవిడ్ కారణంగా నిమిషం ఖాళీ లేని సెలబ్రిటీలకు ఊహించని విశ్రాంతి దొరికింది. బోర్ కొట్టేటంత ఖాళీ సమయం దొరికింది. కానీ ప్రపంచమంతటా ఒకటే సమస్య…ఎక్కడికి వెళ్లినా గృహస్తాశ్రమమే. దీంతో సెలబ్రిటీలకు పొలాలు, అడవులు, ప్రకృతి గుర్తొచ్చాయి.
మొన్న సల్మాన్ ఖాన్ నాట్లు వేస్తూ వరి పంటలో నిమగ్నమయ్యారు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి నగరానికి సుదూరంగా రూరల్ లో ఉన్న తన ఫాంహౌస్ కి వెళ్లి తాత్కాలికంగా కొత్త జీవనం మొదలుపెట్టారు. అవకాశం ఉన్న సెలబ్రిటీలందరూ ఫాంహౌస్ లకు తరలిపోయారు. చిన్నప్పటి నుంచి తాము చేయాలనుకుని చేయలేని పనులన్నీ చేయడం మొదలుపెట్టారు.
తాజాగా తమన్నా అదేబాటలో నడుస్తోంది. ఈ అందాల తార అడవి బాట పట్టింది. ప్రకృతి ఒడిలోకి రా… అది నీలోని అసలు మనిషిని నీకు వెతికిపెడుతుంది అంటూ కామెంట్ చేస్తూ ప్రకృతిలో దిగిన ఓ ఫొటో షేర్ చేసింది. బ్యాక్ ప్యాక్ లో సింపుల్ లగేజ్ లో ప్రకృతిలో విహరిస్తూ కనిపించింది. ఇది సెల్ఫీ కాదు, ఫొటో. అంటే ఆమెతో ఇంకెవరో ఉన్నారు. ఫొటో ఎక్కడ దిగిందీ ఆమె చెప్పలేదు. కానీ తమన్నా మాత్రం చాలా ఉల్లాసంగా విహరిస్తోంది.
This post was last modified on July 22, 2020 7:54 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…