ఆశాశైని అలియాస్ ఫ్లోరా సైని.. కొంచెం ముందుతరం తెలుగు ప్రేక్షకులకు ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘ప్రేమకోసం’ అనే లవ్ స్టోరీతో కథానాయికగా పరిచయం అయిన ఆమె.. ఆ తర్వాత చాలా వరకు చిన్నస్థాయి, స్పెషల్ రోల్సే చేసింది. చాలాబాగుంది, నరసింహనాయుడు, నువ్వునాకు నచ్చావ్, ప్రేమతో రా.. ఇలా పలు తెలుగు చిత్రాల్లో మెరిసింది. ఆ తర్వాత వేర్వేరు భాషల్లోనూ నటించింది.
ప్రస్తుతం హిందీలో కొన్ని వెబ్ సిరీస్ల్లో నటిస్తున్న ఆశాశైని.. తాను కొత్త రిలేషన్షిప్లోకి వెళ్లినట్లు వెల్లడించింది. ఈ బంధానికి అందరి ఆశీస్సులు కావాలని కోరుతూ.. గతంలో తాను ఒక నిర్మాతతో ప్రేమలో పడడం వల్ల ఎదుర్కొన్న హింస గురించి వెల్లడించింది. ఆ రిలేషన్షిప్ వల్ల 14 నెలల పాటు నరకం చూశానని.. ఆ నిర్మాత తనను తీవ్రంగా హింసించాడని తెలిపింది. ఈ మేరకు ఆమె ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. అందులో ఆమె ఏమందంటే..
‘‘20 ఏళ్ల వయసులో కెరీర్ పరంగా నేను మంచి స్థితిలో ఉన్నాను. అప్పటికే పది సినిమాల్లో నటించాను. ఎన్నో డిజైనర్ బ్రాండ్ల కోసం మోడల్గా పని చేశాను. ఐతే అదే సమయంలో ఒక నిర్మాతతో ప్రేమలో పడ్డాను. కొన్ని రోజులకే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అతను నన్ను తీవ్ర వేధింపులకు గురి చేశాడు. నా ముఖం, ప్రైవేట్ పార్ట్స్ మీద కొట్టడం మొదలుపెట్టాడు. నా ఫోన్ లాక్కున్నాడు. సినిమాల్లో నటించొద్దని షరతులు పెట్టాడు. 14 నెలల పాటు ఎవ్వరితోనూ మాట్లాడనివ్వలేదు. ఒక రోజు నా పొట్టపై తన్నాడు. ఆ బాధ భరించలేక అక్కడి నుంచి పారిపోయాను. అమ్మానాన్నలను కలిసి వారితోనే ఉన్నాను.
ఆ నిర్మాత వల్ల నేను ఎదుర్కొన్న శారీరక, మానసిక వేదన నుంచి బయటపడ్డానికి కొన్ని నెలల సమయం పట్టింది. తర్వాత మళ్లీ సినీ రంగంలోకి వచ్చాను. పరిస్థితులు చక్కబడడానికి సమయం పట్టినప్పటికీ ఇప్పుడు సంతోషంగానే ఉన్నా. కొత్తగా మళ్లీ ప్రేమ బంధంలోకి వచ్చాను. నాకు అందరి ఆశీస్సులు కావాలి’’ అని ఆశాసైని పేర్కొంది.
This post was last modified on February 1, 2023 12:54 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…