సంక్రాంతి సినిమాల సందడి దాదాపుగా చల్లారిపోయింది. వీకెండ్స్ ని క్యాష్ చేసుకోవడం తప్ప విజేతగా నిలిచిన వాల్తేరు వీరయ్య సైతం బాగా నెమ్మదించేసింది. ఇప్పుడు ఫిబ్రవరి వంతు.ఈసారి మొదటి వారం పోటీ వెరైటీగా ఉంది. పెద్ద స్టార్లు లేకపోయినా దేనికవే వైవిధ్యమైన కాన్సెప్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. రిలీజ్ డేట్ 3 అయితే గత నాలుగైదు రోజుల నుంచే రైటర్ పద్మభూషణ్ కు వేస్తన్న ప్రీమియర్లకు సానుకూల స్పందన వస్తోంది. అయితే ఈ స్పెషల్ షోల టాక్ ని ఖచ్చితంగా నిర్ధారించలేం కానీ శుక్రవారం వస్తే కానీ సుహాస్ హిట్టు కొట్టాడా లేదానేది తేలిపోతుంది.
ఇక సందీప్ కిషన్ మైఖేల్ లో కాన్సెప్ట్ ఆసక్తికరంగా అనిపిస్తున్నా అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. గొప్ప టాలెంట్ ప్రదర్శించే బలమైన క్యాస్టింగ్ ఉన్నప్పటికీ ఓపెనింగ్స్ తెచ్చే క్రౌడ్ పుల్లర్స్ లేకపోవడంతో పూర్తిగా టాక్ మీదే ఆధారపడాల్సి ఉంటుంది. ట్రైలరే అంతో ఇంతో అంచనాలు పెంచిన మాట వాస్తవం. వీటి కోసం ఒక రోజు ఆలస్యంగా 4న రాబోతున్న బుట్టబొమ్మ హైప్ బాగా చాలా తక్కువ స్థాయిలో ఉంది. మలయాళం కప్పేలా రీమేక్ గా రూపొందిన ఈ లవ్ థ్రిల్లర్ లో హీరో హీరోయిన్ లతో సహా ఎవరూ మనకు పరిచయమున్న మొహాలు కాదు.
పబ్లిసిటీని లైట్ తీసుకున్న సితార సంస్థ కాన్ఫిడెన్స్ ఏంటో అవుట్ ఫుట్ చూశాకే తెలుస్తుంది. ఇక జనాలను ఆకట్టుకోవడం కోసం ఈ మూడు సినిమాల ప్రచారంలో టికెట్ రేట్లను బాగా హై లైట్ చేసుకుంటున్నారు. అన్నీ ఒకటే ధరతో వెళ్లుంటే బాగుండేది కానీ సింగల్ స్క్రీన్లలో రైటర్, బుట్టబొమ్మ 110 నుంచి 150, మైఖేల్ కు 150 నుంచి 200 రూపాయల మధ్యలో సెట్ చేయడంతో కొంత అయోమయం నెలకొనే ప్రమాదం లేకపోలేదు. పఠాన్ జోరు స్లో అవుతున్న టైంలో ఈ గ్యాప్ ని ముగ్గురిలో ఎవరు వాడుకుంటారో చూడాలి. అసలే ఫిబ్రవరికి కొంత డ్రై సీజనని పేరు. మ్యాటర్ బలంగా ఉంటేనే హిట్టు పడుతుంది.
This post was last modified on February 1, 2023 1:16 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…