బాలీవుడ్లో ప్రేక్షకులకు భయం పుట్టేలా రఫ్ విలన్ పాత్రలు చేయాలంటే సంజయ్ దత్ తర్వాతే ఎవరైనా అన్నట్లుంది పరిస్థితి. ‘అగ్నిపథ్’ సహా కొన్ని చిత్రాల్లో ఆయన పండించిన విలనిజం గురించి ఎంత చెప్పినా తక్కువే. గత ఏడాది ఆయన దక్షిణాదిన కూడా ఓ భారీ చిత్రంలో విలన్ పాత్రతో అలరించారు. ఆ చిత్రమే.. కేజీఎఫ్-2. అందులో ఆయన చేసిన అధీరా పాత్రకు ఎంత గొప్ప రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ పాత్రకు ఓకే అవగానే హైప్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఆయన లుక్ అదీ చూసి జనాలు షాకైపోయారు.
నిజానికి సినిమాలో సంజయ్ పాత్ర అనుకున్నంత బలంగా లేకపోయినా సరే.. అది బాగానే ఎలివేట్ అయింది. సినిమాకు ఎసెట్ అయింది. ‘కేజీఎఫ్-2’ తర్వాత ఇప్పుడు సంజూ మరో దక్షిణాది చిత్రంలో విలన్ పాత్రకు రెడీ అయ్యాడు. ‘కేజీఎఫ్-2’ లాగే అది కూడా ఒక క్రేజీ ప్రాజెక్టే.
విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ రూపొందించనున్న చిత్రంలో సంజయ్ దత్యే విలన్ పాత్ర చేయనున్నాడు. ఈ సినిమా గురించి సోమవారమే అనౌన్స్మెంట్ రాగా.. తర్వాతి రోజు సంజయ్ దత్ ఇందులో విలన్ క్యారెక్టర్ చేయనున్నట్లు ప్రకటించారు. స్వయంగా ఈ సినిమా గురించి సంజయ్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఈ కథకు సంబంధించి లైన్ వినగానే తాను ఈ ప్రాజెక్టులో భాగం అవ్వాలని నిర్ణయించుకున్నానని.. ఈ సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నానని సంజయ్ తెలిపాడు.
విజయ్, లోకేష్ కలయికలో వచ్చిన ‘మాస్టర్’ బ్లాక్ బస్టర్ కాగా.. దాని తర్వాత లోకేష్ రూపొందించిన ‘విక్రమ్’ ఇంకా పెద్ద విజయం సాధించి అతడి మీద అంచనాలను బాగా పెంచేసింది. ఇప్పుడు విజయ్తో ఇంకో సినిమా అనేసరికి హైప్ పతాక స్థాయికి చేరుకుంది. ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులో సంజయ్ దత్ విలన్ అంటే అంచనాలు మరింత పెరిగిపోవడం ఖాయం.
This post was last modified on January 31, 2023 4:56 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…