బాలీవుడ్లో ప్రేక్షకులకు భయం పుట్టేలా రఫ్ విలన్ పాత్రలు చేయాలంటే సంజయ్ దత్ తర్వాతే ఎవరైనా అన్నట్లుంది పరిస్థితి. ‘అగ్నిపథ్’ సహా కొన్ని చిత్రాల్లో ఆయన పండించిన విలనిజం గురించి ఎంత చెప్పినా తక్కువే. గత ఏడాది ఆయన దక్షిణాదిన కూడా ఓ భారీ చిత్రంలో విలన్ పాత్రతో అలరించారు. ఆ చిత్రమే.. కేజీఎఫ్-2. అందులో ఆయన చేసిన అధీరా పాత్రకు ఎంత గొప్ప రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ పాత్రకు ఓకే అవగానే హైప్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఆయన లుక్ అదీ చూసి జనాలు షాకైపోయారు.
నిజానికి సినిమాలో సంజయ్ పాత్ర అనుకున్నంత బలంగా లేకపోయినా సరే.. అది బాగానే ఎలివేట్ అయింది. సినిమాకు ఎసెట్ అయింది. ‘కేజీఎఫ్-2’ తర్వాత ఇప్పుడు సంజూ మరో దక్షిణాది చిత్రంలో విలన్ పాత్రకు రెడీ అయ్యాడు. ‘కేజీఎఫ్-2’ లాగే అది కూడా ఒక క్రేజీ ప్రాజెక్టే.
విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ రూపొందించనున్న చిత్రంలో సంజయ్ దత్యే విలన్ పాత్ర చేయనున్నాడు. ఈ సినిమా గురించి సోమవారమే అనౌన్స్మెంట్ రాగా.. తర్వాతి రోజు సంజయ్ దత్ ఇందులో విలన్ క్యారెక్టర్ చేయనున్నట్లు ప్రకటించారు. స్వయంగా ఈ సినిమా గురించి సంజయ్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఈ కథకు సంబంధించి లైన్ వినగానే తాను ఈ ప్రాజెక్టులో భాగం అవ్వాలని నిర్ణయించుకున్నానని.. ఈ సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నానని సంజయ్ తెలిపాడు.
విజయ్, లోకేష్ కలయికలో వచ్చిన ‘మాస్టర్’ బ్లాక్ బస్టర్ కాగా.. దాని తర్వాత లోకేష్ రూపొందించిన ‘విక్రమ్’ ఇంకా పెద్ద విజయం సాధించి అతడి మీద అంచనాలను బాగా పెంచేసింది. ఇప్పుడు విజయ్తో ఇంకో సినిమా అనేసరికి హైప్ పతాక స్థాయికి చేరుకుంది. ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులో సంజయ్ దత్ విలన్ అంటే అంచనాలు మరింత పెరిగిపోవడం ఖాయం.
This post was last modified on January 31, 2023 4:56 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…