బాలీవుడ్లో ప్రేక్షకులకు భయం పుట్టేలా రఫ్ విలన్ పాత్రలు చేయాలంటే సంజయ్ దత్ తర్వాతే ఎవరైనా అన్నట్లుంది పరిస్థితి. ‘అగ్నిపథ్’ సహా కొన్ని చిత్రాల్లో ఆయన పండించిన విలనిజం గురించి ఎంత చెప్పినా తక్కువే. గత ఏడాది ఆయన దక్షిణాదిన కూడా ఓ భారీ చిత్రంలో విలన్ పాత్రతో అలరించారు. ఆ చిత్రమే.. కేజీఎఫ్-2. అందులో ఆయన చేసిన అధీరా పాత్రకు ఎంత గొప్ప రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ పాత్రకు ఓకే అవగానే హైప్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఆయన లుక్ అదీ చూసి జనాలు షాకైపోయారు.
నిజానికి సినిమాలో సంజయ్ పాత్ర అనుకున్నంత బలంగా లేకపోయినా సరే.. అది బాగానే ఎలివేట్ అయింది. సినిమాకు ఎసెట్ అయింది. ‘కేజీఎఫ్-2’ తర్వాత ఇప్పుడు సంజూ మరో దక్షిణాది చిత్రంలో విలన్ పాత్రకు రెడీ అయ్యాడు. ‘కేజీఎఫ్-2’ లాగే అది కూడా ఒక క్రేజీ ప్రాజెక్టే.
విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ రూపొందించనున్న చిత్రంలో సంజయ్ దత్యే విలన్ పాత్ర చేయనున్నాడు. ఈ సినిమా గురించి సోమవారమే అనౌన్స్మెంట్ రాగా.. తర్వాతి రోజు సంజయ్ దత్ ఇందులో విలన్ క్యారెక్టర్ చేయనున్నట్లు ప్రకటించారు. స్వయంగా ఈ సినిమా గురించి సంజయ్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఈ కథకు సంబంధించి లైన్ వినగానే తాను ఈ ప్రాజెక్టులో భాగం అవ్వాలని నిర్ణయించుకున్నానని.. ఈ సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నానని సంజయ్ తెలిపాడు.
విజయ్, లోకేష్ కలయికలో వచ్చిన ‘మాస్టర్’ బ్లాక్ బస్టర్ కాగా.. దాని తర్వాత లోకేష్ రూపొందించిన ‘విక్రమ్’ ఇంకా పెద్ద విజయం సాధించి అతడి మీద అంచనాలను బాగా పెంచేసింది. ఇప్పుడు విజయ్తో ఇంకో సినిమా అనేసరికి హైప్ పతాక స్థాయికి చేరుకుంది. ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులో సంజయ్ దత్ విలన్ అంటే అంచనాలు మరింత పెరిగిపోవడం ఖాయం.
This post was last modified on January 31, 2023 4:56 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…