‘కలర్ ఫోటో’ తో నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాస్. అక్కడి నుండి ఈ కుర్ర నటుడి యాక్టింగ్ లైఫ్ టర్న్ తీసుకుంది. ‘ఫ్యామిలీ డ్రామా’ , ‘హిట్ 2’ ఇలా చకచకా అవకాశలొచ్చాయి. కలర్ ఫోటో ఇచ్చిన సక్సెస్ తో మరో వైపు హీరోగా కూడా కొన్ని సినిమాలు చేస్తున్నాడు. సుహాస్ లేటెస్ట్ మూవీ ‘రైటర్ పద్మభూషణ్’ ఈ సినిమా ఫిబ్రవరి 3న రిలీజ్ కానుంది. ముందే ప్రేక్షకులకు సినిమా చూపించే పనిలో ఉన్నారు మేకర్స్. ఇప్పటికే తక్కువ టికెట్ ధర పెట్టి ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు.
అయితే ఇదంతా బాగానే ఉంది. కానీ సుహాస్ ను చూసేందుకు ప్రేక్షలులు థియేటర్స్ కి వస్తారా ? అనేది డౌట్. అవును ‘కలర్ ఫోటో’ కోవిడ్ టైమ్ లో పాస్ అనిపించుకున్న మూవీ. పైగా ఓటీటీ కాబట్టి జనాలు బాగానే చూశారు. అదే 150 టికెట్టు పెట్టుకొని చూడమంటే ఆ సినిమా కూడా వర్కవుట్ అయ్యేది కాదు. ఎవరు కాదన్నా ఇదే నిజం.
‘రైటర్ పద్మభూషణ్’ మీద ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. పైగా సుహాస్ ‘హిట్ 2’ లో విలన్ గా నటించాడు ఆ ఇంపాక్ట్ కూడా ఈ సినిమాపై పడనుంది. మేకర్స్ మాత్రం సుహాస్ ను విజయ్ సేతుపతితో పోలుస్తూ తెలుగులో మంచి పోటెన్షల్ ఉన్న నటుడని చెప్పుకుంటున్నారు. నిజమే సుహాస్ మంచి నటుడే కదనలేం. కానీ విజయ్ సేతుపతి అంత సీనుందా ? విజయ్ సేతుపతి గొప్ప విలక్షణ నటుడు. రెండు మూడు సినిమాలు, రెండు నెగెటివ్ పాత్రలతో సుహాస్ ను అంత గొప్ప నటుడితో పోల్చడమేమిటో ? కాస్త ఆలోచించొద్దు. ఏదేమైనా సుహాస్ హీరోగా థియేటర్స్ లో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో ?
This post was last modified on January 31, 2023 1:41 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…