చిన్న సినిమాల కోసం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం మహా కష్టం. ముఖ్యంగా టికెట్ రేట్లు మధ్యతరగతికి భారంగా మారిన తరుణంలో టాక్ మరీ ఎక్స్ ట్రాడినరిగా ఉంటే తప్ప కదలడం లేదు. అందులోనూ ఓటిటిలో ఎలాగూ వస్తుందనే భావన అడ్డుగోడగా నిలుస్తోంది. దీనికి చెక్ పెట్టాలంటే ఎవరో ఒకరు నడుం బిగించాలి. మూడున రిలీజ్ కాబోతున్న రైటర్ పద్మభూషణ్ జనాన్ని ఆకట్టుకోవడం కోసం తెలివైన ఎత్తుగడలతో ముందుకు వెళ్తోంది. వారం ముందే పలు నగరాల్లో ప్రీమియర్లు వేయడం ఒక ఎత్తయితే ఇప్పుడు పబ్లిసిటీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే మరో ప్లాన్ ని సిద్ధం చేసుకున్నారు.
అందుబాటులో ఉండేలా టికెట్ ధరలను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి తగ్గింపు వచ్చేలా చేసుకున్నారు. దీని ప్రకారం ఏపీ తెలంగాణ సింగల్ స్క్రీన్లలో కేవలం 110 రూపాయలకే ఈ సినిమా చూడొచ్చన్న మాట. మాములు రోజుల్లో అయితే ఇది ప్రాంతాన్ని బట్టి 112 నుంచి 148 దాకా ఉంది. మల్టీప్లెక్సుల్లో మాత్రం ఏపీకి 177, తెలంగాణ 150 ఫిక్స్ చేశారు. ఇది ప్రభుత్వ జీవో ప్రకారం కనక అంతకు మించి తగ్గించే ఛాన్స్ లేదట. కాస్త పర్సు బరువు ఎక్కువున్నోడు వీటిలో చూస్తాడు. సగటు కామన్ ఆడియెన్ కి హ్యాపీగా సోలో థియేటర్లు మంచి ఛాయస్ అవుతాయి.
సుహాస్ లాంటి క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ లేని చిన్న హీరోకి ఇలాంటి మద్దతు అవసరం. సినిమా బాగుందంటే ఆటోమేటిక్ గా పబ్లిక్ వస్తారు కానీ అసలు ఓపెనింగ్స్ తెచ్చుకుని దాని ద్వారా పాజిటివ్ టాక్ రాబట్టుకోవడం చాలా కీలకం. ఇందులో సక్సెస్ అయితే మెల్లగా ఆక్యుపెన్సీలు పెరుగుతాయి. అసలే మైఖేల్ తో గట్టి పోటీ ఉంది. దానికీ భీభత్సమైన హైప్ లేదు కానీ ఉన్నంతలో క్యాస్టింగ్, యాక్షన్ బ్యాక్ డ్రాప్ యూత్, మాస్ ని ఆకట్టుకుంటున్నాయి. రైటర్ టార్గెట్ చేసింది ఎక్కువ శాతం ఫ్యామిలీస్ ని కాబట్టి తెలివిగా చేసుకోవాలి. కంటెంట్ కనక బాగుంటే ఈ రేట్లతో రైటర్ గెలవొచ్చు.
This post was last modified on January 31, 2023 10:29 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…