గత ఏడాది కేజీఎఫ్-2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో సాగించిన బాక్సాఫీస్ విధ్వంసం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐతే ఆ సినిమాను తక్కువ అంచనా వేసి, జెర్సీ హిందీ రీమేక్ను కేజీఎఫ్-2 రిలీజైన వారానికే ధైర్యంగా రిలీజ్ చేశారు. అది కేజీఎఫ్-2 సునామీలో పడి కొట్టుకుపోయింది. షాహిద్ కూడా పెద్ద స్టారే అని, జెర్సీ స్యూర్ షాట్ హిట్ అనే ధీమాతో మేకర్స్ ధైర్యం చేశారు కానీ.. వాళ్లెంత పెద్ద తప్పు చేశారో తర్వాత కానీ అర్థం కాలేదు.
సినిమాను తొలి రోజు నుంచే జనం అస్సలు పట్టించుకోలేదు. ఇలా ఓ సినిమా ప్రభంజనం సృష్టిస్తున్నపుడు ఇగోకు పోకుండా వాయిదా వేసుకోవడం ఉత్తమం అని అప్పుడు బాలీవుడ్ జనాలకు బాగానే అర్థమైనట్లుంది. ఇప్పుడు బాలీవుడ్ మూవీయే అయిన పఠాన్ వారం రోజులుగా బాక్సాఫీస్ దగ్గర సృష్టిస్తున్న సంచలనాల గురించి తెలిసిందే.
వీకెండ్లోనే 500 కోట్ల దాకా వసూళ్లు రాబట్టిన ఆ చిత్రం.. సోమవారం కూడా బలంగా నిలబడింది. ఈ ఊపు చూశాక వచ్చే నెల 10న రావాల్సిన కార్తీక్ ఆర్యన్ సినిమా షెజాదాను దాని మేకర్స్ వాయిదా వేసేశారు. ఇంకా విడుదలకు పది రోజులకు పైగానే సమయం ఉన్నప్పటికీ.. పఠాన్ జోరు ఇప్పట్లో తగ్గదేమో అని భయపడి తమ చిత్రాన్ని వారం ఆలస్యంగా రిలీజ్ చేయాలని నిర్ణయించారు.
ఇప్పుడా చిత్రం ఫిబ్రవరి 17న శివరాత్రి వీకెండ్లో రిలీజ్ కాబోతోంది. కార్తీక్ గత ఏడాది భూల్ భూలయియా-2తో పెద్ద హిట్టే కొట్టినప్పటికీ.. ఇప్పుడు షారుఖ్ సినిమా విధ్వంసం చూసి వెనక్కి తగ్గడానికి వెనుకంజ వేయలేదు. షెజాదా తెలుగు బ్లాక్బస్టర్ అల వైకుంఠపురములో రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇందులో కార్తీక్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి రోహిత్ ధావన్ దర్శకుడు.
This post was last modified on January 30, 2023 10:26 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…