యువ కథానాయకుడు నితిన్ కెరీర్ ఒక అడుగు ముందుకు పడితే నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంది. కెరీర్లో ఒక దశలో వరుసగా డజను ఫ్లాపుల దాకా ఎదుర్కొన్నాక ‘ఇష్క్’ దగ్గర్నుంచి జాగ్రత్తగా అడుగులు వేస్తూ వచ్చిన నితిన్.. కొన్నేళ్ల నుంచి మళ్లీ తడబడుతున్నాడు. ‘భీష్మ’ను మినహాయిస్తే చాన్నాళ్ల నుంచి అతడికి సరైన విజయం లేదు.
ఆ సినిమాతో గాడిన పడ్డట్లే కనిపించిన అతను.. ఆ తర్వాత చెక్, రంగ్ దె, మాచర్ల నియోజకవర్గం చిత్రాలతో పతనం చవిచూశాడు. ‘మాచర్ల..’ అయితే మరీ దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ప్రస్తుతం అతను వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక మాస్ ఎంటర్టైనర్ చేశాడు. దీని తర్వాతి సినిమా కూడా దాదాపు ఖరారైనట్లే. ‘భీష్మ’ దర్శకుడు వెంకీ కుడుములతో నితిన్ మళ్లీ జట్టు కడుతున్నేట్లు ఇంతకుముందే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
నిజానికి వెంకీ తన తర్వాతి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం హోల్డ్లో పడిపోయింది. అది ఒక వేళ తిరిగి పట్టాలెక్కే అవకాశమున్నా ఇప్పట్లో అయితే కాదు. కాబట్టి నితిన్తో ఓకే అయిన ప్రాజెక్టునే పట్టాలెక్కించాలని అనుకుంటున్నాడు వెంకీ. ఐతే ఈసారి నితిన్తో అతను ఒక ప్రయోగాత్మక కథను ప్రయత్నించనున్నట్లు సమాచారం.
ఒక అరుదైన వ్యాధి వల్ల నెల రోజుల్లో తాను చనిపోబోతున్నానని తెలిసిన కుర్రాడు… ఆ నెల రోజుల కాలాన్ని ఎలా గడిపాడు, రాబోయే తన మరణం గురించి తెలిసి జనాలు అతడితో ఎలా వ్యవహరించారు.. చివరికి అతడి జీవితానికి దక్కిన ముగింపేంటి అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందట. కథ లైన్ వింటే విషాదభరితంగా అనిపించినా.. ట్రీట్మెంట్ వెంకీ స్టయిల్లో సరదాగా ఉంటుందని.. నితిన్ కెరీర్లో ఇదొక వైవిధ్యమైన సినిమా అవుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు బయటికి రానున్నాయి.
This post was last modified on January 30, 2023 4:46 pm
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…
సక్సెస్ మాత్రమే మాట్లాడే ఇండస్ట్రీలో కొందరికి అవకాశాలు ఒక సినిమాతో సృష్టించుకున్న బ్రాండ్ వల్ల వస్తాయి. జాతిరత్నాలు దర్శకుడు కెవి…
తమిళనాడు రాజకీయాల్లో చిత్రమైన వైఖరి కనిపిస్తోంది. ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ దక్కలేదు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో…