పవన్ కళ్యాణ్ కల్ట్ బ్లాక్ బస్టర్ ‘ఖుషి’ని గుర్తుకు తెస్తూ ఆ సినిమా టైటిల్తో విజయ్ దేవరకొండ, సమంత కలయికలో ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా మొదలైనపుడు కావాల్సినంత హైప్ కనిపించింది. ‘ఖుషి’ అనే టైటిల్ వాడడంపై కొన్ని రోజులు పవన్ అభిమానులు గొడవ గొడవ చేస్తూ ఈ సినిమాను వార్తల్లో నిలబెట్టారు.
ఇక విడాకులు తీసుకున్నాక పూర్తి స్థాయి రొమాంటిక్ సినిమాకు సమంత అంగీకరించడం.. విజయ్ లాంటి సెన్సేషనల్ హీరో అందులో లీడ్ రోల్ చేయడం.. సినిమా సెట్స్ మీదికి వెళ్లగానే చకచకా కొన్ని షెడ్యూళ్ల చిత్రీకరణ పూర్తి చేసి టీం అంతా మంచి జోరు మీద కనిపించడంతో సినిమా మీద ప్రత్యేక ఆసక్తి కనిపించింది. ఐతే ఆ ఊపు కొనసాగి ఉంటే ఇప్పటికే వెండితెరలపై ‘ఖుషి’ దర్శనం పూర్తయ్యేది. కానీ ఈ చిత్రానికి అనుకోని అవాంతరాలు మొదలయ్యాయి.
‘లైగర్’ పనిలో పడి కొన్నాళ్లు విజయ్ ఈ సినిమా చిత్రీకరణకు హాజరు కాలేదు. ఇంతలో సమంత అనారోగ్యం పాలవడంతో షూటింగ్ నిరవధికంగా వాయిదా పడుతూ వచ్చింది. కాగా సమంత కోసం ఎదురు చూసి చూసి విసిగిపోయిన శివ నిర్వాణ.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి వేరే ప్రాజెక్టు మీదికి వెళ్లనున్నట్లుగా తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.
ఈ ప్రచారం ఊపందుకుంటుండడంతో శివ అభిమానులకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘ఖుషి’కి సంబంధించి ఏ సమస్యా లేదని.. అతి త్వరలో షూటింగ్ మొదలు కానుందని.. ఆల్ హ్యాపీస్ అని ట్విట్టర్ వేదికగా అతను స్పష్టం చేశాడు. దీంతో ఈ సినిమా మీద ముసురుకున్న సందేహాలన్నీ పటాపంచలైనట్లే.
ప్రస్తుతం ఓ బాలీవుడ్ వెబ్ సిరీస్ కోసం ముంబయిలో ఉన్న సామ్.. మరి కొన్ని రోజుల్లోనే ‘మజిలీ’ సెట్స్ మీదికి రానున్నట్లు తెలుస్తోంది. ఆమె అందుబాటులోకి రాగానే నిరవధికంగా చిత్రీకరణ జరిపి సినిమాను పూర్తి చేయాలని టీం బావిస్తోంది.
This post was last modified on January 30, 2023 4:42 pm
అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…
ఐపీఎల్ 2025 సీజన్లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్లో అడుగుపెడుతున్న…
సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…
సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో జనంతో పెద్దగా కలిసిందే లేదు.…