పవన్ కళ్యాణ్ కల్ట్ బ్లాక్ బస్టర్ ‘ఖుషి’ని గుర్తుకు తెస్తూ ఆ సినిమా టైటిల్తో విజయ్ దేవరకొండ, సమంత కలయికలో ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా మొదలైనపుడు కావాల్సినంత హైప్ కనిపించింది. ‘ఖుషి’ అనే టైటిల్ వాడడంపై కొన్ని రోజులు పవన్ అభిమానులు గొడవ గొడవ చేస్తూ ఈ సినిమాను వార్తల్లో నిలబెట్టారు.
ఇక విడాకులు తీసుకున్నాక పూర్తి స్థాయి రొమాంటిక్ సినిమాకు సమంత అంగీకరించడం.. విజయ్ లాంటి సెన్సేషనల్ హీరో అందులో లీడ్ రోల్ చేయడం.. సినిమా సెట్స్ మీదికి వెళ్లగానే చకచకా కొన్ని షెడ్యూళ్ల చిత్రీకరణ పూర్తి చేసి టీం అంతా మంచి జోరు మీద కనిపించడంతో సినిమా మీద ప్రత్యేక ఆసక్తి కనిపించింది. ఐతే ఆ ఊపు కొనసాగి ఉంటే ఇప్పటికే వెండితెరలపై ‘ఖుషి’ దర్శనం పూర్తయ్యేది. కానీ ఈ చిత్రానికి అనుకోని అవాంతరాలు మొదలయ్యాయి.
‘లైగర్’ పనిలో పడి కొన్నాళ్లు విజయ్ ఈ సినిమా చిత్రీకరణకు హాజరు కాలేదు. ఇంతలో సమంత అనారోగ్యం పాలవడంతో షూటింగ్ నిరవధికంగా వాయిదా పడుతూ వచ్చింది. కాగా సమంత కోసం ఎదురు చూసి చూసి విసిగిపోయిన శివ నిర్వాణ.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి వేరే ప్రాజెక్టు మీదికి వెళ్లనున్నట్లుగా తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.
ఈ ప్రచారం ఊపందుకుంటుండడంతో శివ అభిమానులకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘ఖుషి’కి సంబంధించి ఏ సమస్యా లేదని.. అతి త్వరలో షూటింగ్ మొదలు కానుందని.. ఆల్ హ్యాపీస్ అని ట్విట్టర్ వేదికగా అతను స్పష్టం చేశాడు. దీంతో ఈ సినిమా మీద ముసురుకున్న సందేహాలన్నీ పటాపంచలైనట్లే.
ప్రస్తుతం ఓ బాలీవుడ్ వెబ్ సిరీస్ కోసం ముంబయిలో ఉన్న సామ్.. మరి కొన్ని రోజుల్లోనే ‘మజిలీ’ సెట్స్ మీదికి రానున్నట్లు తెలుస్తోంది. ఆమె అందుబాటులోకి రాగానే నిరవధికంగా చిత్రీకరణ జరిపి సినిమాను పూర్తి చేయాలని టీం బావిస్తోంది.
This post was last modified on January 30, 2023 4:42 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…