పవన్ కళ్యాణ్ కల్ట్ బ్లాక్ బస్టర్ ‘ఖుషి’ని గుర్తుకు తెస్తూ ఆ సినిమా టైటిల్తో విజయ్ దేవరకొండ, సమంత కలయికలో ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా మొదలైనపుడు కావాల్సినంత హైప్ కనిపించింది. ‘ఖుషి’ అనే టైటిల్ వాడడంపై కొన్ని రోజులు పవన్ అభిమానులు గొడవ గొడవ చేస్తూ ఈ సినిమాను వార్తల్లో నిలబెట్టారు.
ఇక విడాకులు తీసుకున్నాక పూర్తి స్థాయి రొమాంటిక్ సినిమాకు సమంత అంగీకరించడం.. విజయ్ లాంటి సెన్సేషనల్ హీరో అందులో లీడ్ రోల్ చేయడం.. సినిమా సెట్స్ మీదికి వెళ్లగానే చకచకా కొన్ని షెడ్యూళ్ల చిత్రీకరణ పూర్తి చేసి టీం అంతా మంచి జోరు మీద కనిపించడంతో సినిమా మీద ప్రత్యేక ఆసక్తి కనిపించింది. ఐతే ఆ ఊపు కొనసాగి ఉంటే ఇప్పటికే వెండితెరలపై ‘ఖుషి’ దర్శనం పూర్తయ్యేది. కానీ ఈ చిత్రానికి అనుకోని అవాంతరాలు మొదలయ్యాయి.
‘లైగర్’ పనిలో పడి కొన్నాళ్లు విజయ్ ఈ సినిమా చిత్రీకరణకు హాజరు కాలేదు. ఇంతలో సమంత అనారోగ్యం పాలవడంతో షూటింగ్ నిరవధికంగా వాయిదా పడుతూ వచ్చింది. కాగా సమంత కోసం ఎదురు చూసి చూసి విసిగిపోయిన శివ నిర్వాణ.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి వేరే ప్రాజెక్టు మీదికి వెళ్లనున్నట్లుగా తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.
ఈ ప్రచారం ఊపందుకుంటుండడంతో శివ అభిమానులకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘ఖుషి’కి సంబంధించి ఏ సమస్యా లేదని.. అతి త్వరలో షూటింగ్ మొదలు కానుందని.. ఆల్ హ్యాపీస్ అని ట్విట్టర్ వేదికగా అతను స్పష్టం చేశాడు. దీంతో ఈ సినిమా మీద ముసురుకున్న సందేహాలన్నీ పటాపంచలైనట్లే.
ప్రస్తుతం ఓ బాలీవుడ్ వెబ్ సిరీస్ కోసం ముంబయిలో ఉన్న సామ్.. మరి కొన్ని రోజుల్లోనే ‘మజిలీ’ సెట్స్ మీదికి రానున్నట్లు తెలుస్తోంది. ఆమె అందుబాటులోకి రాగానే నిరవధికంగా చిత్రీకరణ జరిపి సినిమాను పూర్తి చేయాలని టీం బావిస్తోంది.
This post was last modified on January 30, 2023 4:42 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…