Movie News

‘ఖుషి’కి సమస్యలేం లేవట

పవన్ కళ్యాణ్ కల్ట్ బ్లాక్ బస్టర్ ‘ఖుషి’ని గుర్తుకు తెస్తూ ఆ సినిమా టైటిల్‌తో విజయ్ దేవరకొండ, సమంత కలయికలో ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా మొదలైనపుడు కావాల్సినంత హైప్ కనిపించింది. ‘ఖుషి’ అనే టైటిల్ వాడడంపై కొన్ని రోజులు పవన్ అభిమానులు గొడవ గొడవ చేస్తూ ఈ సినిమాను వార్తల్లో నిలబెట్టారు.

ఇక విడాకులు తీసుకున్నాక పూర్తి స్థాయి రొమాంటిక్ సినిమాకు సమంత అంగీకరించడం.. విజయ్ లాంటి సెన్సేషనల్ హీరో అందులో లీడ్ రోల్ చేయడం.. సినిమా సెట్స్ మీదికి వెళ్లగానే చకచకా కొన్ని షెడ్యూళ్ల చిత్రీకరణ పూర్తి చేసి టీం అంతా మంచి జోరు మీద కనిపించడంతో సినిమా మీద ప్రత్యేక ఆసక్తి కనిపించింది. ఐతే ఆ ఊపు కొనసాగి ఉంటే ఇప్పటికే వెండితెరలపై ‘ఖుషి’ దర్శనం పూర్తయ్యేది. కానీ ఈ చిత్రానికి అనుకోని అవాంతరాలు మొదలయ్యాయి.

‘లైగర్’ పనిలో పడి కొన్నాళ్లు విజయ్ ఈ సినిమా చిత్రీకరణకు హాజరు కాలేదు. ఇంతలో సమంత అనారోగ్యం పాలవడంతో షూటింగ్ నిరవధికంగా వాయిదా పడుతూ వచ్చింది. కాగా సమంత కోసం ఎదురు చూసి చూసి విసిగిపోయిన శివ నిర్వాణ.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి వేరే ప్రాజెక్టు మీదికి వెళ్లనున్నట్లుగా తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.

ఈ ప్రచారం ఊపందుకుంటుండడంతో శివ అభిమానులకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘ఖుషి’కి సంబంధించి ఏ సమస్యా లేదని.. అతి త్వరలో షూటింగ్ మొదలు కానుందని.. ఆల్ హ్యాపీస్ అని ట్విట్టర్ వేదికగా అతను స్పష్టం చేశాడు. దీంతో ఈ సినిమా మీద ముసురుకున్న సందేహాలన్నీ పటాపంచలైనట్లే.

ప్రస్తుతం ఓ బాలీవుడ్ వెబ్ సిరీస్ కోసం ముంబయిలో ఉన్న సామ్.. మరి కొన్ని రోజుల్లోనే ‘మజిలీ’ సెట్స్ మీదికి రానున్నట్లు తెలుస్తోంది. ఆమె అందుబాటులోకి రాగానే నిరవధికంగా చిత్రీకరణ జరిపి సినిమాను పూర్తి చేయాలని టీం బావిస్తోంది.

This post was last modified on January 30, 2023 4:42 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

3 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

4 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

5 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

5 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

5 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

7 hours ago