ఓ రెండు ఫ్లాపులు వరసగా వస్తే చాలు హీరోల మార్కెట్ తో పాటు భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతున్న పరిస్థితుల్లో అరవై దాటిన సీనియర్ స్టార్లను ఇప్పటి జెనరేషన్ ఎంతమేరకు చూస్తారనే అనుమానాలు నిన్నా మొన్నటి దాకా బలంగానే ఉండేవి. కానీ ఇప్పుడా లెక్కలు మారిపోయాయి. సరైన కథ దర్శకుడు పడితే ఆకాశమే హద్దుగా వయసుతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ ని ఎలా దున్నేయొచ్చో కలెక్షన్ల సాక్షిగా నిరూపిస్తున్నారు. 57వ పడిలో ఉన్న షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సునామిలా విరుచుకుపడుతోంది. వారం దాటకుండానే 500 కోట్లను క్రాస్ చేయడం చూసి ఎవరికి నోట మాట రావడం లేదు. ఎక్కడ ఆగుతుందో అంతు చిక్కడం లేదు.
హిట్టు కొట్టి పది సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటికీ చెక్కుచెదరని అభిమానం, స్టార్ డం కింగ్ ఖాన్ కు రక్షణ కవచంలా నిలబడింది. బాలీవుడ్ బెస్ట్ మూవీస్ లో ఒకటిగా చెప్పలేకపోయినా సరైన కమర్షియల్ కంటెంట్ తో వచ్చిన షారుఖ్ కి హిందీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. కొన్ని నెలల క్రితం సరిగ్గా ఇదే ట్రాక్ రికార్డుతో పోరాడుతున్న 68 ఏళ్ళ కమల్ హాసన్ కు విక్రమ్ ఇచ్చిన బూస్ట్ అంతా ఇంతా కాదు. ఫైనల్ రన్ అయ్యేలోపు ఏకంగా 400 కోట్లకు పైగా రాబట్టి తమిళనాట సరికొత్త బెంచ్ మార్కుని సెట్ చేశారు. ఖైదీ నెంబర్ 150 తర్వాత తన స్థాయి హిట్టు లేక సతమతమవుతున్న చిరంజీవికి వాల్తేరు వీరయ్య ఆక్సిజన్ అయ్యింది.
మూడు వారాలలోపే 200 కోట్ల గ్రాస్ ని దాటేయడమే కాక అల వైకుంఠపురములోని టార్గెట్ చేస్తూ దూసుకుపోతోంది. 67 వయసులో ఇంతకన్నా కిక్ మెగాస్టార్ కు ఏముంటుంది. ఆయన ఆనందం తారసపడిన ప్రతిసారి మొహంలో కనిపిస్తూనే ఉంది. రిటైర్మెంట్ స్టేజి దాటిపోయి విశ్రాంతి స్టేజికి వచ్చిన వీళ్ళ విజయాన్ని ఎంత స్ఫూర్తిగా తీసుకున్నా తక్కువే. వీళ్ళనే కాదు బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, నాగార్జున, రజినీకాంత్ తదితరులు అసలు రెస్ట్ అనే మాటకు తావివ్వకుండా ఇంతగా కష్టపడటం చూస్తే ఇప్పటి జనరేషన్ స్టార్లు ఈ ఏజ్ కు వచ్చేటప్పటికి ఎలాంటి పాత్రలు చేస్తుంటారో ఊహించుకోవడం కష్టమే.
This post was last modified on January 30, 2023 11:33 am
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…