పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ సినిమా ఒప్పుకుంటాడో.. ఏ చిత్రానికి ఎప్పుడు ఓపెనింగ్ చేయిస్తాడో.. దేన్ని ఎప్పుడు సెట్స్ మీదికి తీసుకెళ్తాడో తెలియక అయోమయంలో పడిపోతున్నారు అభిమానులు. బాగా ఆలస్యం అవుతున్న ‘హరిహర వీరమల్లు’ సంగతి తేల్చకుండానే రెండు నెలల కిందట హరీష్ శంకర్ దర్శకత్వంలో కొత్త సినిమా ఓపెనింగ్కి హాజరయ్యాడు పవన్. ఆ తర్వాత ఆ సినిమా గురించి హడావుడే లేదు.
ఈలోపు ‘వినోదియ సిత్తం’ రీమేక్ సెట్స్ మీదికి వెళ్లనున్నట్లుగా వార్తలొచ్చాయి. దాని కోసం అభిమానులు ఎదురు చూస్తుండగానే.. ఇంకో సినిమా ఓపెనింగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పవన్. హరీష్ సినిమా ఓపెనింగ్ కంటే ముందు అనౌన్స్మెంట్తో రచ్చ లేపిన సుజీత్ సినిమాకు ప్రారంభోత్సవం చేయించబోతున్నారట. అందుకు డేట్ కూడా ఫిక్సయినట్లు సమాచారం.
ఈ నెల 30న సుజీత్ సినిమా ప్రారంభోత్సవంలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నాడన్నది తాజా కబురు. ఈ చిత్రాన్ని ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న సంగతి తెలిసిందే. ‘సాహో’ తర్వాత సుజీత్ తెరకెక్కించబోయే సినిమా ఇదే. పవర్ స్టార్కు వీరాభిమాని అయిన సుజీత్ తీయబోయే ఈ సినిమా విషయంలో అభిమానులు కూడా చాలా ఎగ్జైటెట్గా ఉన్నారు. ఈ సినిమా ప్రి లుక్ పోస్టర్ ఆసక్తి రేకెత్తించింది. ఇదొక గ్యాంగ్స్టర్ మూవీ అని.. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగుతుందని ఆ పోస్టర్లో చెప్పకనే చెప్పేశాడు సుజీత్.
ఈ చిత్రాన్ని పవన్ ఎప్పుడు మొదలుపెడతాడు.. ఎలా డేట్లు సర్దుబాటు చేస్తాడు.. ఎప్పుడు పూర్తి చేస్తాడు.. రిలీజ్ ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ లేదు. కానీ మంచి ముహూర్తం ఉందని ముందు ఆ వేడుక పూర్తి చేయబోతున్నారు. పవన్కు ఇప్పుడున్న కమిట్మెంట్ల ప్రకారం చూస్తే వచ్చే ఎన్నికల్లోపు అయితే ఈ సినిమా పూర్తయ్యే అవకాశం లేనట్లే.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…