పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ సినిమా ఒప్పుకుంటాడో.. ఏ చిత్రానికి ఎప్పుడు ఓపెనింగ్ చేయిస్తాడో.. దేన్ని ఎప్పుడు సెట్స్ మీదికి తీసుకెళ్తాడో తెలియక అయోమయంలో పడిపోతున్నారు అభిమానులు. బాగా ఆలస్యం అవుతున్న ‘హరిహర వీరమల్లు’ సంగతి తేల్చకుండానే రెండు నెలల కిందట హరీష్ శంకర్ దర్శకత్వంలో కొత్త సినిమా ఓపెనింగ్కి హాజరయ్యాడు పవన్. ఆ తర్వాత ఆ సినిమా గురించి హడావుడే లేదు.
ఈలోపు ‘వినోదియ సిత్తం’ రీమేక్ సెట్స్ మీదికి వెళ్లనున్నట్లుగా వార్తలొచ్చాయి. దాని కోసం అభిమానులు ఎదురు చూస్తుండగానే.. ఇంకో సినిమా ఓపెనింగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పవన్. హరీష్ సినిమా ఓపెనింగ్ కంటే ముందు అనౌన్స్మెంట్తో రచ్చ లేపిన సుజీత్ సినిమాకు ప్రారంభోత్సవం చేయించబోతున్నారట. అందుకు డేట్ కూడా ఫిక్సయినట్లు సమాచారం.
ఈ నెల 30న సుజీత్ సినిమా ప్రారంభోత్సవంలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నాడన్నది తాజా కబురు. ఈ చిత్రాన్ని ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న సంగతి తెలిసిందే. ‘సాహో’ తర్వాత సుజీత్ తెరకెక్కించబోయే సినిమా ఇదే. పవర్ స్టార్కు వీరాభిమాని అయిన సుజీత్ తీయబోయే ఈ సినిమా విషయంలో అభిమానులు కూడా చాలా ఎగ్జైటెట్గా ఉన్నారు. ఈ సినిమా ప్రి లుక్ పోస్టర్ ఆసక్తి రేకెత్తించింది. ఇదొక గ్యాంగ్స్టర్ మూవీ అని.. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగుతుందని ఆ పోస్టర్లో చెప్పకనే చెప్పేశాడు సుజీత్.
ఈ చిత్రాన్ని పవన్ ఎప్పుడు మొదలుపెడతాడు.. ఎలా డేట్లు సర్దుబాటు చేస్తాడు.. ఎప్పుడు పూర్తి చేస్తాడు.. రిలీజ్ ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ లేదు. కానీ మంచి ముహూర్తం ఉందని ముందు ఆ వేడుక పూర్తి చేయబోతున్నారు. పవన్కు ఇప్పుడున్న కమిట్మెంట్ల ప్రకారం చూస్తే వచ్చే ఎన్నికల్లోపు అయితే ఈ సినిమా పూర్తయ్యే అవకాశం లేనట్లే.
This post was last modified on January 27, 2023 4:58 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…