చిన్న సినిమాలను జనం దాకా తీసుకెళ్లడం నిర్మాతలకు పెద్ద సవాల్ గా మారింది. కరోనా తర్వాత భారీతనం ఉంటే తప్ప ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు కదలడం లేదు. 2020 తర్వాత వచ్చిన ఫలితాలను చూస్తే అర్థం చేసుకోవచ్చు. అలా అని కంటెంట్ ఉన్న వాటిని ఆదరించకుండా పోరు. కాకపోతే ప్రమోషన్ల విషయంలో దర్శక నిర్మాతలు మంచి ప్లానింగ్ తో జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా హిట్టు కొట్టే అవకాశాలు పెరుగుతాయి. వచ్చే నెల 3న విడుదల కాబోతున్న రైటర్ పద్మభూషణ్ టీమ్ అదే పనిలో ఉంది. రిలీజ్ కు ఇంకా వారం ఉండగానే ప్రధాన నగరాల్లో స్పెషల్ స్క్రీనింగ్స్ ప్లాన్ చేస్తోంది.
విజయవాడ, గుంటూరు, భీమవరం, కాకినాడ, విశాఖపట్నం, హైదరాబాద్ లలో ఈ రోజుతో మొదలుపెట్టి ఫిబ్రవరి 1 దాకా కాలనీలను సందర్శించడంతో పాటు వాళ్లకు సినిమాను ప్రదర్శించబోతున్నారు. గతంలో మేజర్ కు ఇదే తరహా స్పెషల్ ప్రీమియర్స్ దేశవ్యాప్తంగా వేస్తే అద్భుతమైన స్పందన దక్కింది. వాటికొచ్చిన సోషల్ మీడియా ఫీడ్ బ్యాక్ ఓపెనింగ్స్ కి చాలా సహాయపడింది. సినిమాలో ఎంత బలమైన ,మ్యాటర్ ఉన్నా రీచ్ విషయంలో ఇలాంటి కేర్ అవసరం. 777 చార్లీకి సైతం ఇదే స్ట్రాటజీని వాడితే అదీ గొప్ప ఫలితాన్ని అందుకుంది. ఒకటి రెండు తప్ప ఇలా చేసినవన్నీ హిట్లే.
ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ వంతు వచ్చింది. ఆర్టిస్టుగా సుహాస్ కు మంచి పేరుంది కానీ థియేటర్ కు జనాన్ని ఫుల్ చేసే స్థాయికి ఇంకా చేరుకోలేదు. కలర్ ఫోటోకి జాతీయ అవార్డు వచ్చినా మిలియన్ల వ్యూస్ దక్కించుకున్నా ఓటిటి రిలీజ్ కావడంతో దాని బిజినెస్ రేంజ్ అర్థం కాలేదు. పూర్తిగా తన మీదే మార్కెట్ అవుతున్న మొదటి సినిమా ఈ పద్మభూషణ్. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో దాన్ని క్యాష్ చేసుకునే పనిలో ఉంది నిర్మాణ సంస్థ. మేజర్ కు ఎవరైతే సారథ్యం వహించారో వాళ్ళే దీనికీ బాధ్యత తీసుకోవడంతో మెల్లగా హైప్ పెరుగుతోంది. మైఖేల్ బుట్టబొమ్మ పోటీని తట్టుకోవడానికి ఇవి చేయడం అవసరమే.
This post was last modified on January 27, 2023 1:55 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…