Movie News

అప్పుడు మేజర్ ఇప్పుడు రైటర్

చిన్న సినిమాలను జనం దాకా తీసుకెళ్లడం నిర్మాతలకు పెద్ద సవాల్ గా మారింది. కరోనా తర్వాత భారీతనం ఉంటే తప్ప ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు కదలడం లేదు. 2020 తర్వాత వచ్చిన ఫలితాలను చూస్తే అర్థం చేసుకోవచ్చు. అలా అని కంటెంట్ ఉన్న వాటిని ఆదరించకుండా పోరు. కాకపోతే ప్రమోషన్ల విషయంలో దర్శక నిర్మాతలు మంచి ప్లానింగ్ తో జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా హిట్టు కొట్టే అవకాశాలు పెరుగుతాయి. వచ్చే నెల 3న విడుదల కాబోతున్న రైటర్ పద్మభూషణ్ టీమ్ అదే పనిలో ఉంది. రిలీజ్ కు ఇంకా వారం ఉండగానే ప్రధాన నగరాల్లో స్పెషల్ స్క్రీనింగ్స్ ప్లాన్ చేస్తోంది.

విజయవాడ, గుంటూరు, భీమవరం, కాకినాడ, విశాఖపట్నం, హైదరాబాద్ లలో ఈ రోజుతో మొదలుపెట్టి ఫిబ్రవరి 1 దాకా కాలనీలను సందర్శించడంతో పాటు వాళ్లకు సినిమాను ప్రదర్శించబోతున్నారు. గతంలో మేజర్ కు ఇదే తరహా స్పెషల్ ప్రీమియర్స్ దేశవ్యాప్తంగా వేస్తే అద్భుతమైన స్పందన దక్కింది. వాటికొచ్చిన సోషల్ మీడియా ఫీడ్ బ్యాక్ ఓపెనింగ్స్ కి చాలా సహాయపడింది. సినిమాలో ఎంత బలమైన ,మ్యాటర్ ఉన్నా రీచ్ విషయంలో ఇలాంటి కేర్ అవసరం. 777 చార్లీకి సైతం ఇదే స్ట్రాటజీని వాడితే అదీ గొప్ప ఫలితాన్ని అందుకుంది. ఒకటి రెండు తప్ప ఇలా చేసినవన్నీ హిట్లే.

ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ వంతు వచ్చింది. ఆర్టిస్టుగా సుహాస్ కు మంచి పేరుంది కానీ థియేటర్ కు జనాన్ని ఫుల్ చేసే స్థాయికి ఇంకా చేరుకోలేదు. కలర్ ఫోటోకి జాతీయ అవార్డు వచ్చినా మిలియన్ల వ్యూస్ దక్కించుకున్నా ఓటిటి రిలీజ్ కావడంతో దాని బిజినెస్ రేంజ్ అర్థం కాలేదు. పూర్తిగా తన మీదే మార్కెట్ అవుతున్న మొదటి సినిమా ఈ పద్మభూషణ్. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో దాన్ని క్యాష్ చేసుకునే పనిలో ఉంది నిర్మాణ సంస్థ. మేజర్ కు ఎవరైతే సారథ్యం వహించారో వాళ్ళే దీనికీ బాధ్యత తీసుకోవడంతో మెల్లగా హైప్ పెరుగుతోంది. మైఖేల్ బుట్టబొమ్మ పోటీని తట్టుకోవడానికి ఇవి చేయడం అవసరమే.

This post was last modified on January 27, 2023 1:55 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

8 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

9 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

10 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

11 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

11 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

13 hours ago