Movie News

అప్పుడు మేజర్ ఇప్పుడు రైటర్

చిన్న సినిమాలను జనం దాకా తీసుకెళ్లడం నిర్మాతలకు పెద్ద సవాల్ గా మారింది. కరోనా తర్వాత భారీతనం ఉంటే తప్ప ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు కదలడం లేదు. 2020 తర్వాత వచ్చిన ఫలితాలను చూస్తే అర్థం చేసుకోవచ్చు. అలా అని కంటెంట్ ఉన్న వాటిని ఆదరించకుండా పోరు. కాకపోతే ప్రమోషన్ల విషయంలో దర్శక నిర్మాతలు మంచి ప్లానింగ్ తో జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా హిట్టు కొట్టే అవకాశాలు పెరుగుతాయి. వచ్చే నెల 3న విడుదల కాబోతున్న రైటర్ పద్మభూషణ్ టీమ్ అదే పనిలో ఉంది. రిలీజ్ కు ఇంకా వారం ఉండగానే ప్రధాన నగరాల్లో స్పెషల్ స్క్రీనింగ్స్ ప్లాన్ చేస్తోంది.

విజయవాడ, గుంటూరు, భీమవరం, కాకినాడ, విశాఖపట్నం, హైదరాబాద్ లలో ఈ రోజుతో మొదలుపెట్టి ఫిబ్రవరి 1 దాకా కాలనీలను సందర్శించడంతో పాటు వాళ్లకు సినిమాను ప్రదర్శించబోతున్నారు. గతంలో మేజర్ కు ఇదే తరహా స్పెషల్ ప్రీమియర్స్ దేశవ్యాప్తంగా వేస్తే అద్భుతమైన స్పందన దక్కింది. వాటికొచ్చిన సోషల్ మీడియా ఫీడ్ బ్యాక్ ఓపెనింగ్స్ కి చాలా సహాయపడింది. సినిమాలో ఎంత బలమైన ,మ్యాటర్ ఉన్నా రీచ్ విషయంలో ఇలాంటి కేర్ అవసరం. 777 చార్లీకి సైతం ఇదే స్ట్రాటజీని వాడితే అదీ గొప్ప ఫలితాన్ని అందుకుంది. ఒకటి రెండు తప్ప ఇలా చేసినవన్నీ హిట్లే.

ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ వంతు వచ్చింది. ఆర్టిస్టుగా సుహాస్ కు మంచి పేరుంది కానీ థియేటర్ కు జనాన్ని ఫుల్ చేసే స్థాయికి ఇంకా చేరుకోలేదు. కలర్ ఫోటోకి జాతీయ అవార్డు వచ్చినా మిలియన్ల వ్యూస్ దక్కించుకున్నా ఓటిటి రిలీజ్ కావడంతో దాని బిజినెస్ రేంజ్ అర్థం కాలేదు. పూర్తిగా తన మీదే మార్కెట్ అవుతున్న మొదటి సినిమా ఈ పద్మభూషణ్. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో దాన్ని క్యాష్ చేసుకునే పనిలో ఉంది నిర్మాణ సంస్థ. మేజర్ కు ఎవరైతే సారథ్యం వహించారో వాళ్ళే దీనికీ బాధ్యత తీసుకోవడంతో మెల్లగా హైప్ పెరుగుతోంది. మైఖేల్ బుట్టబొమ్మ పోటీని తట్టుకోవడానికి ఇవి చేయడం అవసరమే.

This post was last modified on January 27, 2023 1:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

36 minutes ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

1 hour ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

1 hour ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

3 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

4 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

5 hours ago