ఆచార్య సినిమాలో ఒక ముఖ్య పాత్ర చరణ్ చేస్తే బాగుంటుందని చిరంజీవి, కొరటాల శివ భావించారు. అందుకు రామ్ చరణ్ కూడా సిద్ధంగానే ఉండడంతో… అతిథి పాత్రలా కాకుండా కనీసం అరగంట నిడివి ఉండేలా తీర్చి దిద్దాలని భావించారు. లాక్ డౌన్ ముందు వరకు చరణ్ పాత్ర లెంగ్త్ అంతే అనుకున్నారు. కానీ లాక్ డౌన్ వల్ల ఆర్.ఆర్.ఆర్. వెనక్కి వెళ్లడంతో ఆచార్య ముందుగా విడుదల కావడం ఖాయమైంది.
అయితే తన సినిమా వచ్చేలోగా చరణ్ ఒక పూర్తి స్థాయి పాత్రలో కనిపించడం రాజమౌళికి ఇష్టం లేదు. అందుకని ఆ పాత్రను ముందుగా అనుకున్నట్టు అతిథి పాత్రగా మార్చేశారని టాక్ వినిపిస్తోంది. అయితే దీని గురించి కానీ, ఆచార్య తదుపరి ప్రణాళిక గురించి కానీ చిరు, కొరటాల లేదా నిర్మాత చరణ్ ఎవరూ క్లారిటీ ఇవ్వడం లేదు. షూటింగ్స్ మొదలైన తర్వాత ఆర్.ఆర్.ఆర్. కి సంబంధించి తారక్ సీన్స్ ముందు పూర్తి చేస్తారంటున్నారు. బహుశా ఆ టైములో చరణ్ ఆచార్య పని కానిచ్చేస్తాడేమో.
This post was last modified on July 22, 2020 12:50 am
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…