Movie News

రాజమౌళీ సెక్యూరిటీ పెంచుకో.. చంపేస్తాం

రామ్ గోపాల్ వర్మ ట్వీట్లను జనాలు సీరియస్‌గా తీసుకోవడం ఎప్పుడో మానేశారు. రాత్రి సిట్టింగ్‌లో కూర్చుని ఎవరో ఒకరి మీద రాయి వేయడం.. లేదా ఎవరినో ఒకరిని ఇష్టానుసారం పొగడ్డం వర్మకు అలవాటు. ఇంతకుముందులా జనాలు తన ట్వీట్లను పట్టించుకోకపోయినా.. వాటి మీద పెద్దగా డిస్కషన్లు లేకపోయినా వర్మ మాత్రం ఆగట్లేదు. ఎలాగైనా జనాల దృష్టిని ఆకర్షించాలని కొంచెం సెన్సేషనల్ స్టయిల్లో ట్వీట్లు వేస్తూనే ఉంటాడు. తాజాగా రాజమౌళిని ఉద్దేశించి అలాగే ట్వీట్లు వేశాడు వర్మ.

‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసి హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ చాలా ఎగ్జైట్ అవుతూ.. రాజమౌళిని ప్రశంసల్లో ముంచెత్తిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోపై వర్మ స్పందిస్తూ.. రాజమౌళిని తనదైన శైలిలో కొనియాడాడు. ఈ క్రమంలోనే రాజమౌళి సెక్యూరిటీ పెంచుకోవాలని, లేదంటే చంపేస్తామని వర్మ హెచ్చరించడం గమనార్హం.

“దాదా సాహెబ్ ఫాల్కే దగ్గర్నుంచి ఇప్పటి వరకు భారతీయ సినీ చరిత్రలో ఎస్.ఎస్.రాజమౌళిని కలుపుకుని ఎవ్వరూ కూడా ఒక భారతీయ దర్శకుడికి ఇలాంటి అవకాశం వస్తుందని ఊహించి ఉండరు. రాజమౌళీ.. మొఘల్-ఎ-అజామ్ తీసిన కాసిఫ్ నుంచి షోలే తీసిన రమేష్ సిప్పీ నుంచి ఆదిత్య చోప్రా, కరణ్ జోహార్, భన్సాలీ లాంటి ఎంతోమంది దర్శకులను మీరు దాటేశారు. అందుకే మీ కాలి బొటన వేలిని నేను చప్పరించాలనుకుంటున్నా. రాజమౌళి సార్.. దయచేసి మీ సెక్యూరిటీని పెంచుకోండి. ఎందుకంటే ఇండియాలో చాలామంది ఫిలిం మేకర్స్ మీ మీద అసూయతో రగిలిపోతున్నారు. అందుకే మిమ్మల్ని చంపడానికి ఒక గ్రూప్ కూడా ఏర్పాటు చేశారు. అందులో నేను కూడా బాగమే. నేను నాలుగు పెగ్గులు వేశాను. కాబట్టే ఈ రహస్యాన్ని బయటపెట్టేస్తున్నా” అంటూ వర్మ వరుసబెట్టి ట్వీట్లు గుప్పించాడు.

This post was last modified on January 24, 2023 4:32 pm

Share

Recent Posts

జాన్విని మ‌ళ్లీ చూస్తామా?

బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయ‌డం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేట‌స్ సంపాదించాక‌, తెలుగులో…

5 hours ago

చివరి సినిమా చేదు జ్ఞాపకమే అయ్యింది

గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…

6 hours ago

వైసీపీ నాయకులకు సరైన భరోసా లేదా?

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌పై కేసులు కొన‌సాగుతున్నాయి. అనేక మంది నాయ‌కుల‌పై కేసులు న‌మోదై... ప్ర‌స్తుతం విచార‌ణ ద‌శ‌లో ఉన్నాయి.…

6 hours ago

‘జగన్ వస్తున్నారా.. అయితే మూతే’

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…

6 hours ago

వైసీపీకి చెక్‌: మండలి వైస్ చైర్మన్‌పై కూటమి కీలక నిర్ణయం!

ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…

6 hours ago

గంజాయి బ్యాచ్ హద్దులు మీరుతుంది

హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…

6 hours ago