ఒక దశాబ్దం ముందు వరకు దక్షిణాదిన ప్రతి కథానాయికా కచ్చితంగా పని చేయాలనుకునే కథానాయకుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ కచ్చితంగా ఉండేవాళ్లు. ఆ అవకాశం కొద్దిమందికే దక్కింది.
ఇప్పుడు వయసు వాళ్లకు ఎక్కువైంది కాబట్టి కథానాయికగానే చేయాలన్న రూల్ కూడా ఏమీ ఉండదు. కానీ ఒకసారి వాళ్లతో నటిస్తే చాలనుకుంటారు. ఆ అవకాశం దక్కించుకున్న ఈ తరం కథానాయిక కీర్తి సురేష్ ఒక్కరే అన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం.
ఆమె ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్తో ‘అన్నాత్తె’ సినిమాలో నటిస్తోంది. అందులో ఆమెది రజనీకి జోడీగా కనిపించే పాత్రా.. ఇంకోటా అన్నది తెలియదు. ఎలాగైతేనేం రజనీతో నటించాలన్న కోరిక తీరుతోంది.
ఈ ఊపులోనే కీర్తి.. కమల్ హాసన్తో నటించే అవకాశాన్ని కూడా పట్టేసిందన్నది తాజా సమాచారం. ప్రస్తుతం కమల్ ‘ఇండియన్-2’లో నటిస్తున్నారు. సెట్లో యాక్సిడెంట్, ఆ తర్వాత కరోనా వల్ల ఆ చిత్రం ఆలస్యమవుతోంది. ఈలోపు కమల్.. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘వేట్టయాడు విలయాడు’ (తెలుగులో రాఘవన్) సీక్వెల్లో నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
దీనికి నిర్మాత కూడా ఖరారయ్యాడు. ఈ చిత్రంలో కీర్తిని కథానాయికగా ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఇదే నిజమైతే.. ఈ తరంలో రజనీ, కమల్లతో కలిసి నటించిన ఏకైక తారగా కీర్తి రికార్డు సృష్టిస్తుంది. చివరగా ఈ ఘనత సాధించిన హీరోయిన్ త్రిషనే. ‘మన్మథబాణం’ చిత్రంలో కమల్తో నటించిన ఆమె.. గత ఏడాది వచ్చిన ‘పేట’లో తొలిసారిగా రజనీకి జోడీగా కనిపించింది.
This post was last modified on July 24, 2020 7:57 pm
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…
పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…
https://www.youtube.com/watch?v=CAR8XtEpwhE గత ఏడాది దాస్ కా ధమ్కీ ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాన్ని ఇవ్వకపోయినా ఈ సంవత్సరం గామి విశ్వక్…
విశ్వాసం ఉండడం తప్పుకాదు.. కానీ, అతి విశ్వాసం ఎప్పుడూ.. కొంప ముంచేస్తుంది. ఇప్పుడు ఈ మాట ఎవరో అనడం లేదు.…
చరిత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెరకెక్కించేటప్పుడు రీసెర్చ్ చాలా అవసరం. కానీ కొందరు దర్శకులు కేవలం మీడియాలో వచ్చిన…