ఒక దశాబ్దం ముందు వరకు దక్షిణాదిన ప్రతి కథానాయికా కచ్చితంగా పని చేయాలనుకునే కథానాయకుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ కచ్చితంగా ఉండేవాళ్లు. ఆ అవకాశం కొద్దిమందికే దక్కింది.
ఇప్పుడు వయసు వాళ్లకు ఎక్కువైంది కాబట్టి కథానాయికగానే చేయాలన్న రూల్ కూడా ఏమీ ఉండదు. కానీ ఒకసారి వాళ్లతో నటిస్తే చాలనుకుంటారు. ఆ అవకాశం దక్కించుకున్న ఈ తరం కథానాయిక కీర్తి సురేష్ ఒక్కరే అన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం.
ఆమె ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్తో ‘అన్నాత్తె’ సినిమాలో నటిస్తోంది. అందులో ఆమెది రజనీకి జోడీగా కనిపించే పాత్రా.. ఇంకోటా అన్నది తెలియదు. ఎలాగైతేనేం రజనీతో నటించాలన్న కోరిక తీరుతోంది.
ఈ ఊపులోనే కీర్తి.. కమల్ హాసన్తో నటించే అవకాశాన్ని కూడా పట్టేసిందన్నది తాజా సమాచారం. ప్రస్తుతం కమల్ ‘ఇండియన్-2’లో నటిస్తున్నారు. సెట్లో యాక్సిడెంట్, ఆ తర్వాత కరోనా వల్ల ఆ చిత్రం ఆలస్యమవుతోంది. ఈలోపు కమల్.. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘వేట్టయాడు విలయాడు’ (తెలుగులో రాఘవన్) సీక్వెల్లో నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
దీనికి నిర్మాత కూడా ఖరారయ్యాడు. ఈ చిత్రంలో కీర్తిని కథానాయికగా ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఇదే నిజమైతే.. ఈ తరంలో రజనీ, కమల్లతో కలిసి నటించిన ఏకైక తారగా కీర్తి రికార్డు సృష్టిస్తుంది. చివరగా ఈ ఘనత సాధించిన హీరోయిన్ త్రిషనే. ‘మన్మథబాణం’ చిత్రంలో కమల్తో నటించిన ఆమె.. గత ఏడాది వచ్చిన ‘పేట’లో తొలిసారిగా రజనీకి జోడీగా కనిపించింది.
This post was last modified on July 24, 2020 7:57 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురించి గురువారం నాటి పార్లమెంట్ సమావేశాల్లో ఓ కీలక అంశం…
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుక్రవారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా…
రుణాలఫై వడ్డీ రేట్లు గత కొంత కాలంగా పెరుగుతూనే ఉన్నాయి. గడచిన ఐదేళ్లుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దేశ ఆర్థిక…
ఏడాదిన్నరగా ఒకే సినిమా మీద దృష్టి పెట్టి ఒళ్ళు, మనసు రెండూ కష్టపెట్టి నాగచైతన్య చేసిన సినిమా తండేల్. గత…
ఏపీలోని కూటమి సర్కారు వాట్సాప్ గవర్నెన్స్ పేరిట నయా పాలనాజి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. టీడీపీ జాతీయ ప్రధాన…
అధినేతలకు ప్రజలు అధికారాన్ని ఇస్తుంటారు. ఒకసారి ఒకరికి ఇస్తే మరోసారి ఇంకొకరికి ఇవ్వటం రివాజు. కొన్నిసార్లు మాత్రం కంటిన్యూగా పాలనాధికారాన్ని…