గతంలో ఒక ఇంటర్వ్యూలో రష్మిక మందన్నా మాట్లాడుతూ.. నామమాత్రంగా అనిపించే గ్లామర్ రోల్స్ తాను చేయనని.. తన పాత్రకు ప్రాధాన్యం లేకుంటే ఒప్పుకోనని పెద్ద స్టేట్మెంటే ఇచ్చింది. అప్పుడు ఆమె పక్కనే ఉన్న విజయ్ దేవరకొండ.. తొందరపడి స్టేట్మెంట్ ఇవ్వకు, తర్వాత ఏదైనా పాత్రలో కంటెంట్ లేకుంటే గట్టిగా ఏసుకుంటారు అని ఆమెను హెచ్చరించాడు కూడా. సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాల్లో రొటీన్ గ్లామర్ పాత్ర చేసినపుడు ఆమెకు గట్టి పంచులే పడ్డాయి.
తాజాగా తమిళ చిత్రం వారిసులోనూ ఆమెది చాలా నామినల్గా అనిపించే క్యారెక్టరే. హీరోతో రెండు మూడు సరదా సీన్లు.. రెండు పాటల్లో డ్యాన్సులు తప్పితే ఈ చిత్రంలో రష్మిక గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఐతే ఈ విషయం తెలిసే తాను ఈ సినిమా చేశానని, ఇలాంటి పాత్రలు ఒప్పుకోవడం తన నిర్ణయం అని రష్మిక ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది.
అవును. ఈ కథను ఓకే చేయడం అన్నది పూర్తిగా నా సొంత నిర్ణయం. నా ఇష్టప్రకారమే దాన్ని ఓకే చేశాను. విజయ్ సార్ అంటే నాకెంతో ఇష్టం. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే ఒకే కారణంతో ఈ సినిమా చేశాను. నా పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం లేదని, కేవలం రెండు పాటలు మాత్రమే ఉన్నాయని నాకు తెలుసు. కానీ ఆ రెండు పాటల్లో అదరగొట్టేయాలని అనుకున్నాను.
ఇదే విషయాన్ని షూటింగ్ టైంలో విజయ్ సార్తో కూడా అనేదాన్ని. సినిమాలో నేను చేయడానికి పాటలు తప్ప ఏమీ లేదు సార్ అని జోక్ చేశాను కూడా. అన్నీ నాకు తెలిసే సెట్కు వెళ్లి పని చేయడం ద్వారా విజయ్ లాంటి వాళ్ల దగ్గర చిన్న చిన్న విషయాలను నేర్చుకున్నా అని రష్మిక వివరించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన వారిసు డివైడ్ టాక్ తెచ్చుకుఉన్నప్పటికీ అటు తమిళంలో, ఇటు తెలుగులో మంచి వసూళ్లే రాబట్టింది.
This post was last modified on January 21, 2023 10:21 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…