గతంలో ఒక ఇంటర్వ్యూలో రష్మిక మందన్నా మాట్లాడుతూ.. నామమాత్రంగా అనిపించే గ్లామర్ రోల్స్ తాను చేయనని.. తన పాత్రకు ప్రాధాన్యం లేకుంటే ఒప్పుకోనని పెద్ద స్టేట్మెంటే ఇచ్చింది. అప్పుడు ఆమె పక్కనే ఉన్న విజయ్ దేవరకొండ.. తొందరపడి స్టేట్మెంట్ ఇవ్వకు, తర్వాత ఏదైనా పాత్రలో కంటెంట్ లేకుంటే గట్టిగా ఏసుకుంటారు అని ఆమెను హెచ్చరించాడు కూడా. సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాల్లో రొటీన్ గ్లామర్ పాత్ర చేసినపుడు ఆమెకు గట్టి పంచులే పడ్డాయి.
తాజాగా తమిళ చిత్రం వారిసులోనూ ఆమెది చాలా నామినల్గా అనిపించే క్యారెక్టరే. హీరోతో రెండు మూడు సరదా సీన్లు.. రెండు పాటల్లో డ్యాన్సులు తప్పితే ఈ చిత్రంలో రష్మిక గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఐతే ఈ విషయం తెలిసే తాను ఈ సినిమా చేశానని, ఇలాంటి పాత్రలు ఒప్పుకోవడం తన నిర్ణయం అని రష్మిక ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది.
అవును. ఈ కథను ఓకే చేయడం అన్నది పూర్తిగా నా సొంత నిర్ణయం. నా ఇష్టప్రకారమే దాన్ని ఓకే చేశాను. విజయ్ సార్ అంటే నాకెంతో ఇష్టం. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే ఒకే కారణంతో ఈ సినిమా చేశాను. నా పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం లేదని, కేవలం రెండు పాటలు మాత్రమే ఉన్నాయని నాకు తెలుసు. కానీ ఆ రెండు పాటల్లో అదరగొట్టేయాలని అనుకున్నాను.
ఇదే విషయాన్ని షూటింగ్ టైంలో విజయ్ సార్తో కూడా అనేదాన్ని. సినిమాలో నేను చేయడానికి పాటలు తప్ప ఏమీ లేదు సార్ అని జోక్ చేశాను కూడా. అన్నీ నాకు తెలిసే సెట్కు వెళ్లి పని చేయడం ద్వారా విజయ్ లాంటి వాళ్ల దగ్గర చిన్న చిన్న విషయాలను నేర్చుకున్నా అని రష్మిక వివరించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన వారిసు డివైడ్ టాక్ తెచ్చుకుఉన్నప్పటికీ అటు తమిళంలో, ఇటు తెలుగులో మంచి వసూళ్లే రాబట్టింది.
This post was last modified on January 21, 2023 10:21 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…