గతంలో ఒక ఇంటర్వ్యూలో రష్మిక మందన్నా మాట్లాడుతూ.. నామమాత్రంగా అనిపించే గ్లామర్ రోల్స్ తాను చేయనని.. తన పాత్రకు ప్రాధాన్యం లేకుంటే ఒప్పుకోనని పెద్ద స్టేట్మెంటే ఇచ్చింది. అప్పుడు ఆమె పక్కనే ఉన్న విజయ్ దేవరకొండ.. తొందరపడి స్టేట్మెంట్ ఇవ్వకు, తర్వాత ఏదైనా పాత్రలో కంటెంట్ లేకుంటే గట్టిగా ఏసుకుంటారు అని ఆమెను హెచ్చరించాడు కూడా. సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాల్లో రొటీన్ గ్లామర్ పాత్ర చేసినపుడు ఆమెకు గట్టి పంచులే పడ్డాయి.
తాజాగా తమిళ చిత్రం వారిసులోనూ ఆమెది చాలా నామినల్గా అనిపించే క్యారెక్టరే. హీరోతో రెండు మూడు సరదా సీన్లు.. రెండు పాటల్లో డ్యాన్సులు తప్పితే ఈ చిత్రంలో రష్మిక గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఐతే ఈ విషయం తెలిసే తాను ఈ సినిమా చేశానని, ఇలాంటి పాత్రలు ఒప్పుకోవడం తన నిర్ణయం అని రష్మిక ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది.
అవును. ఈ కథను ఓకే చేయడం అన్నది పూర్తిగా నా సొంత నిర్ణయం. నా ఇష్టప్రకారమే దాన్ని ఓకే చేశాను. విజయ్ సార్ అంటే నాకెంతో ఇష్టం. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే ఒకే కారణంతో ఈ సినిమా చేశాను. నా పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం లేదని, కేవలం రెండు పాటలు మాత్రమే ఉన్నాయని నాకు తెలుసు. కానీ ఆ రెండు పాటల్లో అదరగొట్టేయాలని అనుకున్నాను.
ఇదే విషయాన్ని షూటింగ్ టైంలో విజయ్ సార్తో కూడా అనేదాన్ని. సినిమాలో నేను చేయడానికి పాటలు తప్ప ఏమీ లేదు సార్ అని జోక్ చేశాను కూడా. అన్నీ నాకు తెలిసే సెట్కు వెళ్లి పని చేయడం ద్వారా విజయ్ లాంటి వాళ్ల దగ్గర చిన్న చిన్న విషయాలను నేర్చుకున్నా అని రష్మిక వివరించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన వారిసు డివైడ్ టాక్ తెచ్చుకుఉన్నప్పటికీ అటు తమిళంలో, ఇటు తెలుగులో మంచి వసూళ్లే రాబట్టింది.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…