గతంలో ఒక ఇంటర్వ్యూలో రష్మిక మందన్నా మాట్లాడుతూ.. నామమాత్రంగా అనిపించే గ్లామర్ రోల్స్ తాను చేయనని.. తన పాత్రకు ప్రాధాన్యం లేకుంటే ఒప్పుకోనని పెద్ద స్టేట్మెంటే ఇచ్చింది. అప్పుడు ఆమె పక్కనే ఉన్న విజయ్ దేవరకొండ.. తొందరపడి స్టేట్మెంట్ ఇవ్వకు, తర్వాత ఏదైనా పాత్రలో కంటెంట్ లేకుంటే గట్టిగా ఏసుకుంటారు అని ఆమెను హెచ్చరించాడు కూడా. సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాల్లో రొటీన్ గ్లామర్ పాత్ర చేసినపుడు ఆమెకు గట్టి పంచులే పడ్డాయి.
తాజాగా తమిళ చిత్రం వారిసులోనూ ఆమెది చాలా నామినల్గా అనిపించే క్యారెక్టరే. హీరోతో రెండు మూడు సరదా సీన్లు.. రెండు పాటల్లో డ్యాన్సులు తప్పితే ఈ చిత్రంలో రష్మిక గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఐతే ఈ విషయం తెలిసే తాను ఈ సినిమా చేశానని, ఇలాంటి పాత్రలు ఒప్పుకోవడం తన నిర్ణయం అని రష్మిక ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది.
అవును. ఈ కథను ఓకే చేయడం అన్నది పూర్తిగా నా సొంత నిర్ణయం. నా ఇష్టప్రకారమే దాన్ని ఓకే చేశాను. విజయ్ సార్ అంటే నాకెంతో ఇష్టం. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే ఒకే కారణంతో ఈ సినిమా చేశాను. నా పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం లేదని, కేవలం రెండు పాటలు మాత్రమే ఉన్నాయని నాకు తెలుసు. కానీ ఆ రెండు పాటల్లో అదరగొట్టేయాలని అనుకున్నాను.
ఇదే విషయాన్ని షూటింగ్ టైంలో విజయ్ సార్తో కూడా అనేదాన్ని. సినిమాలో నేను చేయడానికి పాటలు తప్ప ఏమీ లేదు సార్ అని జోక్ చేశాను కూడా. అన్నీ నాకు తెలిసే సెట్కు వెళ్లి పని చేయడం ద్వారా విజయ్ లాంటి వాళ్ల దగ్గర చిన్న చిన్న విషయాలను నేర్చుకున్నా అని రష్మిక వివరించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన వారిసు డివైడ్ టాక్ తెచ్చుకుఉన్నప్పటికీ అటు తమిళంలో, ఇటు తెలుగులో మంచి వసూళ్లే రాబట్టింది.
This post was last modified on January 21, 2023 10:21 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…