Movie News

చరణ్ VS బన్నీ క్లాష్ తప్పదా

టాలీవుడ్ స్టార్లు నిర్మాతలు సంక్రాంతి కోసం ఎందుకంత తపించిపోతారో ఇటీవలే వచ్చిన చిరంజీవి బాలకృష్ణ సినిమాల కలెక్షన్లు ఈసారి మరింత బలంగా నిరూపించాయి. యావరేజ్ గా ఉన్నాయనే టాక్ వచ్చినా వాల్తేరు వీరయ్య వంద కోట్లు వీరసింహారెడ్డి డెబ్భై కోట్లకు పైగా వసూలు చేయడం ట్రేడ్ ని విస్మయపరిచింది. ఒకవేళ ఏదైనా డ్రై సీజన్ లో ఇవి వచ్చి ఉంటే ఇంత గొప్ప ఫలితం దక్కేది కాదన్న మాటలో అబద్దం లేదు. అందుకే ఇంకో ఏడాది సమయం ఉండగానే 2024 పొంగల్ మీద కర్చీఫ్ లు వేసేందుకు ప్రొడ్యూసర్లు రెడీ అవుతున్నారు. ముందే అనౌన్స్ చేస్తే గొడవ ఉండదు కదాని ఆలోచిస్తున్నారు.

వచ్చే సంవత్సరం క్లాష్ ముందుగా రామ్ చరణ్ అల్లు అర్జున్ మధ్య ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. పుష్ప 2 షూటింగ్ ఇటీవలే ప్రారంభమయ్యింది. ఎంతలేదన్నా పోస్ట్ ప్రొడక్షన్లు గట్రా పూర్తి చేసేనాటికి దసరానో దీపావళినో దాటిపోతుంది. ప్యాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ప్రమోషన్లకు కనీసం రెండు నెలలు అవసరం. సో డిసెంబర్ ని టార్గెట్ చేసుకుంటే లాభం లేదు. పైగా వసూళ్లు ఆ నెలలో అంత భీభత్సంగా ఉండవు. అందుకే ఇవన్నీ కాదు కానీ అల వైకుంఠపురములో సెంటిమెంట్ ని రిపీట్ చేస్తూ సంక్రాంతికి వెళ్లే ఆలోచనలో మైత్రి మూవీ మేకర్స్ ప్రాధమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు టాక్

మరోవైపు ఆగుతూ సాగుతున్న రామ్ చరణ్ శంకర్ ల కాంబోలో దిల్ రాజు నిర్మిస్తున్న క్రేజీ మూవీ 2023లో వచ్చే సూచనలు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఇది జనవరి అయితేనే వర్కౌట్ అవుతుందని భావించి ఆ మేరకు తన టీమ్ తో రాజుగారు చర్చిస్తున్నట్టు తెలిసింది. అదే నిజమైతే అప్పుడు మళ్ళీ మైత్రి VS ఎస్విసి క్లాష్ తప్పదు. ఇప్పుడంటే వారసుడు డబ్బింగని నిలదీశారు కానీ చరణ్ ది తెచ్చినప్పుడు ఆ పాయింట్ చెల్లదు. ఎందుకంటే ఇది స్ట్రెయిట్ మూవీ అవుతుంది. ఇప్పటికి ఈ రెండే వచ్చేలా కనిపిస్తోంది కానీ అనూహ్యంగా ఒకటో రెండో పెద్ద సినిమాలు రేస్ లో చేరినా ఆశ్చర్యం లేదు 

This post was last modified on January 21, 2023 6:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

2 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

4 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

4 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

4 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

4 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

5 hours ago