అభిమానుల కోణంలో.. అలాగే వసూళ్ల పరంగా చూస్తే రీఎంట్రీలో చిరంజీవికి బెస్ట్ ఫిలిం ‘వాల్తేరు వీరయ్య’ అనే చెప్పాలి. ఈ సినిమా చూసి క్రిటిక్స్ పెదవి విరిచేశారు కానీ.. అభిమానులకు, మాస్ ప్రేక్షకులకు మాత్రం సినిమా తెగ నచ్చేసింది. తనదైన హావభావాలు, కామెడీ టైమింగ్తో చెలరేగిపోయిన వింటేజ్ చిరంజీవిని చూసి అభిమానులు మురిసిపోయారు.
బేసిగ్గానే ప్రేక్షకులు సంక్రాంతికి థియేటర్లలో ఏ సినిమా ఉంటే అది చూసేస్తారు. కొంచెం పెద్ద సినిమా అయి ఉండి, సినిమా ఓ మోస్తరుగా ఉన్నా చాలు. పాసైపోతుంది. అందులోనూ ఈసారి పండక్కి వచ్చిన సినిమాల్లో పూర్తి సంతృప్తినిచ్చిన సినిమా ఏదీ లేకపోవడం, ఉన్నంతలో అన్నింట్లోకి ‘వాల్తేరు వీరయ్య’నే మెరుగ్గా ఉండడం కూడా దీనికి కలిసొచ్చింది. మొత్తంగా ‘వాల్తేరు వీరయ్య’ అంచనాలను మించి విజయం సాధించిందనే చెప్పాలి. నిజానికి తొలి రోజు రివ్యూలు, మౌత్ టాక్ చూసి అభిమానులు కొంచెం కంగారు పడ్డారు. ఈ సినిమా తేడా కొడితే చిరంజీవి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండేది.
ఆల్రెడీ గత ఏడాది ‘ఆచార్య’తో చిరు చేదు అనుభవం ఎదుర్కొన్నారు. దాని తర్వాత వచ్చిన ‘గాడ్ ఫాదర్’ బ్లాక్బస్టర్ అని మేకర్స్ ప్రచారం చేసుకున్నారు కానీ.. నిజానికి అది కూడా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. అభిమానులకు పూర్తి సంతృప్తిని అందించలేదు. మిగతా ప్రేక్షుకులైతే సినిమా చూసి పెదవి విరిచేశారు. ఇలాంటి స్థితిలో చిరుతో పాటు అభిమానులు ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్న ‘వాల్తేరు వీరయ్య’ తేడా కొడితే జరిగే డ్యామేజ్ మామూలుగా ఉండేది కాదు.
వింటేజ్ చిరును గుర్తు చేద్దామని చేసిన ప్రయత్నం బెడిసికొడితే చిరు ఇక ఏం చేయాలో తెలియని అయోమయం నెలకొనేది. ముందు జనరేషన్ ఆడియన్స్ కనెక్ట్ కాక.. ఇప్పటికీ ప్రేక్షకులూ ఆదరించక చిరు ఔట్ డేటెడ్ అయిపోయాడేమో అన్న చర్చ నడిచేది. అందులోనూ చిరు నుంచి తర్వాత రాబోయేది ‘భోళా శంకర్’ అనే పెద్దగా ఆశలు, అంచనాలు లేని సినిమా. ‘వాల్తేరు వీరయ్య’ ఆడకపోయి ఉంటే ఆ సినిమాకు కనీసం బజ్ క్రియేటయ్యేది కాదు. అసలా సినిమా పట్ల ముందు నుంచి వ్యతిరేకతతో ఉన్న ఫ్యాన్స్.. ఇక దాన్ని ఆపేయాలని డిమాండ్ చేసేవాళ్లేమో.
This post was last modified on January 19, 2023 8:18 pm
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై…
చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు తమ సోషల్ మీడియా అకౌంట్లను సబ్స్క్రిప్షన్ మోడ్లోకి మార్చి, వాటి ద్వారా హాట్…