ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగానే ఆ దర్శకుడితో స్టార్ హీరోలు , నిర్మాతలు సినిమా లాక్ చేసుకోవడం కామన్. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ తో సంక్రాంతి బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు బాబీ కూడా ఓ క్రేజీ కాంబో సెట్ చేసేసుకున్నాడని తెలుస్తుంది. అల్లు అర్జున్ తో బాబీ నెక్స్ట్ సినిమా ఉంటుందని విశ్వనీయ వర్గాల సమాచారం. అయితే చిరంజీవి సినిమా కంటే ముందే బన్నీ కి బాబీ ఓ కమర్షియల్ మాస్ కథ వినిపించాడట. కాకపోతే పుష్ప 2 తర్వాత చూద్దాం అన్నట్టుగా బాబీకి చెప్పాడట అల్లు అర్జున్. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ రిజల్ట్ చూసి బాబీతో బన్నీ ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడని టాక్ వినిపిస్తుంది.
ఇటీవలే బన్నీ థియేటర్ లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చూడటానికి రీజన్ కూడా అదే అని తెలుస్తుంది. బాబీ సీన్స్ కి ఫ్యాన్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ? బాబీ టేకింగ్ కి ఆడియన్స్ రియాక్షన్ తెలుసుకోవడం కోసమే ఉన్నట్టుండి ప్రసాద్స్ లో మెరిసాడట బన్నీ. నిజానికి ఎన్టీఆర్ తో తీసిన జై లవ కుశ దర్శకుడిగా బాబీ కి మంచి పేరు తెచ్చింది. రిజల్ట్ ఆశించినంత స్థాయిలో లేకపోయినా వరుస అవకాశాలు తెచ్చిపెట్టింది.
ఆ సినిమా చూసిన వెంటనే బాబీ ను పిలిచి తనకోసం కథ రెడీ చేయమని చెప్పేశాడట బన్నీ. ఆ ప్రాజెక్ట్ ఇన్నాళ్ళుగా ననూతూ వచ్చింది. ఇక బన్నీ నెక్స్ట్ లిస్టులో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నాడు. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ లైనప్ లో ఉన్నాయి. రెండు మూడు కథలు ఫైనల్ చేసుకున్నాడు బన్నీ. మరి వాటిని పక్కన పెట్టి పుష్ప2 తర్వాత బాబీ కే సినిమా చేస్తాడా ? తెలియాల్సి ఉంది.
This post was last modified on January 18, 2023 8:38 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…