ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగానే ఆ దర్శకుడితో స్టార్ హీరోలు , నిర్మాతలు సినిమా లాక్ చేసుకోవడం కామన్. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ తో సంక్రాంతి బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు బాబీ కూడా ఓ క్రేజీ కాంబో సెట్ చేసేసుకున్నాడని తెలుస్తుంది. అల్లు అర్జున్ తో బాబీ నెక్స్ట్ సినిమా ఉంటుందని విశ్వనీయ వర్గాల సమాచారం. అయితే చిరంజీవి సినిమా కంటే ముందే బన్నీ కి బాబీ ఓ కమర్షియల్ మాస్ కథ వినిపించాడట. కాకపోతే పుష్ప 2 తర్వాత చూద్దాం అన్నట్టుగా బాబీకి చెప్పాడట అల్లు అర్జున్. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ రిజల్ట్ చూసి బాబీతో బన్నీ ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడని టాక్ వినిపిస్తుంది.
ఇటీవలే బన్నీ థియేటర్ లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చూడటానికి రీజన్ కూడా అదే అని తెలుస్తుంది. బాబీ సీన్స్ కి ఫ్యాన్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ? బాబీ టేకింగ్ కి ఆడియన్స్ రియాక్షన్ తెలుసుకోవడం కోసమే ఉన్నట్టుండి ప్రసాద్స్ లో మెరిసాడట బన్నీ. నిజానికి ఎన్టీఆర్ తో తీసిన జై లవ కుశ దర్శకుడిగా బాబీ కి మంచి పేరు తెచ్చింది. రిజల్ట్ ఆశించినంత స్థాయిలో లేకపోయినా వరుస అవకాశాలు తెచ్చిపెట్టింది.
ఆ సినిమా చూసిన వెంటనే బాబీ ను పిలిచి తనకోసం కథ రెడీ చేయమని చెప్పేశాడట బన్నీ. ఆ ప్రాజెక్ట్ ఇన్నాళ్ళుగా ననూతూ వచ్చింది. ఇక బన్నీ నెక్స్ట్ లిస్టులో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నాడు. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ లైనప్ లో ఉన్నాయి. రెండు మూడు కథలు ఫైనల్ చేసుకున్నాడు బన్నీ. మరి వాటిని పక్కన పెట్టి పుష్ప2 తర్వాత బాబీ కే సినిమా చేస్తాడా ? తెలియాల్సి ఉంది.
This post was last modified on January 18, 2023 8:38 am
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఇమేజ్ ఉన్న హీరోలకు ఎదురయ్యే డైలమా ఒకటుంది. అదే వెబ్ సిరీస్ లకు ఎస్ చెప్పాలా వద్దాని. నాగ చైతన్య…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…