Movie News

‘అవతార్-2’పై పంచ్‌లు.. నిర్మాత క్లారిటీ

జేమ్స్ కామెరూన్ ‘అవతార్-2’ మీద విడుదలకు ముందు అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. ఐతే ఈ చిత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయిందన్నది వాస్తవం. కానీ కామెరూన్ అండ్ టీం దశాబ్దం పైగా కష్టపడి ప్రేక్షకులను ఒక అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్లి విజువల్ ట్రీట్ అందించిందని.. ఇలాంటి సినిమాను విమర్శించడం అంటే వాళ్ల కష్టాన్ని తక్కువ చేయడమే అని.. కథ పరంగా కొంచెం వీక్ అయినప్పటికీ.

మనం పెట్టిన టికెట్ డబ్బులను మించి విజువల్ ట్రీట్ అందించిందని చాలామంది అభిప్రాయపడ్డారు. సామాన్య ప్రేక్షకుల సంగతెలా ఉన్నా.. ఈ సినిమాను సినీ ప్రముఖులెవరూ విమర్శించే సాహసం చేయలేదు.

కానీ టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ మాత్రం ‘అవతార్-2’ మీద సెటైర్లు వేశాడు.అవతార్-2 ఒక డాక్యుమెంటరీ లాంటి సినిమా అని.. కామెరూన్ తీశాడు కాబట్టి ఈ సినిమాను విజువల్ ట్రీట్, మాస్టర్ పీస్ అనలాల్సిందే అని నాగవంశీ పెట్టిన ట్వీట్ చర్చనీయాంశం అయింది.

ఇలాంటి భారీ చిత్రాలు తీయడంలో ఉన్న కష్టం, తపన తెలిసి కూడా ఒక నిర్మాత అయి ఉండి ఇలాంటి పంచులు వేయడం ఏంటి అంటూ ఆయన మీద నెటిజన్లు కౌంటర్లు వేశారు. నాగవంశీ గతంలో వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలకు ముడిపెడితూ ఆయనకు యాటిట్యూడ్ ఎక్కువ అని విమర్శించారు.

ఐతే ‘అవతార్-2’ మీద తన ట్వీట్‌పై నాగవంశీ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. తనకు అవతార్-2 సినిమా నచ్చలేదని, తనకు ఏమనిపించిందో అది బయటికి చెప్పడం కూడా తప్పా అని నాగవంశీ ప్రశ్నించాడు.

త్రీడీలో అంతసేపు సినిమా చూస్తుంటే తనకు కళ్లు నొప్పి పుట్టాయని నాగవంశీ తన ప్రొడక్షన్లో తెరకెక్కిన ‘బుట్టబొమ్మ’ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. దీనికి ప్రతిగా యాంకర్ సుమ స్పందిస్తూ.. ఆ సినిమా చాలామందికి విజువల్ ట్రీట్ లాగా అనిపించిందని అంటే.. రెండు గంటలో మూడు గంటలో అయితే ఓకే కానీ.. మూడు గంటలకు పైగా విజువల్ ట్రీట్ అంటే ఎలా అని నాగవంశీ ప్రశ్నించాడు.

This post was last modified on January 17, 2023 8:55 pm

Share
Show comments
Published by
Satya
Tags: Naga Vamshi

Recent Posts

సునీతా 9 నెలల అంతరిక్ష ప్రయాణం… సంపాదన ఎంతో తెలుసా?

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్‌మోర్ ఎనిమిది రోజుల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, అనుకోని సమస్యల…

33 minutes ago

ఫ్యామిలీకి దూరంగా.. బీసీసీఐ నిబంధనపై కోహ్లీ అసహనం!

టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ తీసుకున్న కుటుంబ పరిమితి నిబంధనలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బీసీసీఐ…

1 hour ago

లాంఛనం పూర్తి… రాజధానికి రూ.11 వేల కోట్లు

నిజమే… నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సెలవు రోజైన ఆదివారం రూ.11 వేల కోట్ల రుణం అందింది. కేంద్ర…

2 hours ago

అక్క బదులు తమ్ముడు… మరో వివాదంలో భూమా

టీడీపీలో భూమా ఫ్యామిలీకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు... ఒకేసారి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా కొనసాగారు. అయితే…

2 hours ago

ఎల్2….సినిమాని తలదన్నే బిజినెస్ డ్రామా

మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ వచ్చే వారం మార్చి 27 విడుదల కానుంది. ఇది ఎప్పుడో ప్రకటించారు. అయితే నిర్మాణ…

3 hours ago

కోర్ట్ – టాలీవుడ్ కొత్త ట్రెండ్ సెట్టర్

ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా, పరిచయం లేని జంటను తీసుకుని, విలన్ ని హైలైట్ చేస్తూ ఒక చిన్న బడ్జెట్…

3 hours ago