జేమ్స్ కామెరూన్ ‘అవతార్-2’ మీద విడుదలకు ముందు అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. ఐతే ఈ చిత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయిందన్నది వాస్తవం. కానీ కామెరూన్ అండ్ టీం దశాబ్దం పైగా కష్టపడి ప్రేక్షకులను ఒక అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్లి విజువల్ ట్రీట్ అందించిందని.. ఇలాంటి సినిమాను విమర్శించడం అంటే వాళ్ల కష్టాన్ని తక్కువ చేయడమే అని.. కథ పరంగా కొంచెం వీక్ అయినప్పటికీ.
మనం పెట్టిన టికెట్ డబ్బులను మించి విజువల్ ట్రీట్ అందించిందని చాలామంది అభిప్రాయపడ్డారు. సామాన్య ప్రేక్షకుల సంగతెలా ఉన్నా.. ఈ సినిమాను సినీ ప్రముఖులెవరూ విమర్శించే సాహసం చేయలేదు.
కానీ టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ మాత్రం ‘అవతార్-2’ మీద సెటైర్లు వేశాడు.అవతార్-2 ఒక డాక్యుమెంటరీ లాంటి సినిమా అని.. కామెరూన్ తీశాడు కాబట్టి ఈ సినిమాను విజువల్ ట్రీట్, మాస్టర్ పీస్ అనలాల్సిందే అని నాగవంశీ పెట్టిన ట్వీట్ చర్చనీయాంశం అయింది.
ఇలాంటి భారీ చిత్రాలు తీయడంలో ఉన్న కష్టం, తపన తెలిసి కూడా ఒక నిర్మాత అయి ఉండి ఇలాంటి పంచులు వేయడం ఏంటి అంటూ ఆయన మీద నెటిజన్లు కౌంటర్లు వేశారు. నాగవంశీ గతంలో వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలకు ముడిపెడితూ ఆయనకు యాటిట్యూడ్ ఎక్కువ అని విమర్శించారు.
ఐతే ‘అవతార్-2’ మీద తన ట్వీట్పై నాగవంశీ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. తనకు అవతార్-2 సినిమా నచ్చలేదని, తనకు ఏమనిపించిందో అది బయటికి చెప్పడం కూడా తప్పా అని నాగవంశీ ప్రశ్నించాడు.
త్రీడీలో అంతసేపు సినిమా చూస్తుంటే తనకు కళ్లు నొప్పి పుట్టాయని నాగవంశీ తన ప్రొడక్షన్లో తెరకెక్కిన ‘బుట్టబొమ్మ’ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. దీనికి ప్రతిగా యాంకర్ సుమ స్పందిస్తూ.. ఆ సినిమా చాలామందికి విజువల్ ట్రీట్ లాగా అనిపించిందని అంటే.. రెండు గంటలో మూడు గంటలో అయితే ఓకే కానీ.. మూడు గంటలకు పైగా విజువల్ ట్రీట్ అంటే ఎలా అని నాగవంశీ ప్రశ్నించాడు.
This post was last modified on January 17, 2023 8:55 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…