సోషల్ మీడియా జనాలు వాదించుకోవడానికి, నిందలేసుకోవడానికి ఎప్పుడూ ఏదో ఒక టాపిక్ ఉండాల్సిందే. తాజాగా మెగా, నందమూరి అభిమానుల మధ్య ఒక గొడవ నడుస్తోంది. 1993లో తెలుగు సినీ తారలు ప్రయాణిస్తున్న విమానంలో ఇబ్బంది తలెత్తి, తిరుపతి సమీపంలోని పొలాల్లో అది దిగిపోవడం అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
ఒక దశలో తమ ప్రాణాలు మిగలవన్న భయంతో సినీ తారలు తీవ్ర ఆందోళనకు గురైన సందర్భంలో ఎవరెలా స్పందించారనే విషయంలో రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కొందరేమో చిరంజీవి అప్పుడు హీరోలా వ్యవహరించాడంటే.. ఇంకొందరేమో బాలయ్య హీరోయిజం చూపించాడంటున్నారు. ఈ సందర్భంగా వాదోపవాదాలు నడుస్తున్నాయి.
బాలయ్య ఫ్యాన్స్ ఏమో.. నాలుగేళ్ల కిందట లేపాక్షి ఉత్సవాల సందర్భంగా ఆ రోజు బాలయ్య విమానంలో ఎంత వీరోచితంగా వ్యవహరించాడో సీనియర్ నటి శారద చెబుతున్న వీడియోను షేర్ చేశారు. మరోవైపు చిరు అభిమానులు.. ఆయన గురించి ఈ మధ్య సుహాసిని గొప్పగా మాట్లాడిన వీడియోను తీసుకొచ్చారు. చిరుతో వీడియో కాల్ మాట్లాడుతూ.. సుహాసిని ఒక సినిమా షూటింగ్ కోసం కేరళకు వెళ్లినపుడు తమకు ఎదురైన భయానక అనుభవం గురించి వెల్లడించింది.
కొందరు ఆకతాయిలు రోడ్డు మీద తప్ప తాగి తాము ప్రయాణిస్తున్న కారు మీదికి బీర్ బాటిళ్లు విసిరారని.. అప్పుడు చిరు కారు ఆపి తన దగ్గరున్న లైసెన్స్డ్ రివాల్వర్ తీసి వాళ్లకు గురి పెట్టాడని.. దీంతో వాళ్లు భయపడి పారిపోయారని.. చిరు స్క్రీన్ మీదే కాదు.. బయట కూడా హీరోనే అనడానికి ఇది రుజువని సుహాసిని చెప్పిందా వీడియోలో. ఇప్పుడు సందర్భం ఏదైనప్పటికీ.. చిరు నిజ జీవితంలో గన్ను పట్టిన ఈ ఉదంతం గురించి మెగా అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
This post was last modified on July 20, 2020 4:08 pm
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…