సోషల్ మీడియా జనాలు వాదించుకోవడానికి, నిందలేసుకోవడానికి ఎప్పుడూ ఏదో ఒక టాపిక్ ఉండాల్సిందే. తాజాగా మెగా, నందమూరి అభిమానుల మధ్య ఒక గొడవ నడుస్తోంది. 1993లో తెలుగు సినీ తారలు ప్రయాణిస్తున్న విమానంలో ఇబ్బంది తలెత్తి, తిరుపతి సమీపంలోని పొలాల్లో అది దిగిపోవడం అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
ఒక దశలో తమ ప్రాణాలు మిగలవన్న భయంతో సినీ తారలు తీవ్ర ఆందోళనకు గురైన సందర్భంలో ఎవరెలా స్పందించారనే విషయంలో రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కొందరేమో చిరంజీవి అప్పుడు హీరోలా వ్యవహరించాడంటే.. ఇంకొందరేమో బాలయ్య హీరోయిజం చూపించాడంటున్నారు. ఈ సందర్భంగా వాదోపవాదాలు నడుస్తున్నాయి.
బాలయ్య ఫ్యాన్స్ ఏమో.. నాలుగేళ్ల కిందట లేపాక్షి ఉత్సవాల సందర్భంగా ఆ రోజు బాలయ్య విమానంలో ఎంత వీరోచితంగా వ్యవహరించాడో సీనియర్ నటి శారద చెబుతున్న వీడియోను షేర్ చేశారు. మరోవైపు చిరు అభిమానులు.. ఆయన గురించి ఈ మధ్య సుహాసిని గొప్పగా మాట్లాడిన వీడియోను తీసుకొచ్చారు. చిరుతో వీడియో కాల్ మాట్లాడుతూ.. సుహాసిని ఒక సినిమా షూటింగ్ కోసం కేరళకు వెళ్లినపుడు తమకు ఎదురైన భయానక అనుభవం గురించి వెల్లడించింది.
కొందరు ఆకతాయిలు రోడ్డు మీద తప్ప తాగి తాము ప్రయాణిస్తున్న కారు మీదికి బీర్ బాటిళ్లు విసిరారని.. అప్పుడు చిరు కారు ఆపి తన దగ్గరున్న లైసెన్స్డ్ రివాల్వర్ తీసి వాళ్లకు గురి పెట్టాడని.. దీంతో వాళ్లు భయపడి పారిపోయారని.. చిరు స్క్రీన్ మీదే కాదు.. బయట కూడా హీరోనే అనడానికి ఇది రుజువని సుహాసిని చెప్పిందా వీడియోలో. ఇప్పుడు సందర్భం ఏదైనప్పటికీ.. చిరు నిజ జీవితంలో గన్ను పట్టిన ఈ ఉదంతం గురించి మెగా అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
This post was last modified on July 20, 2020 4:08 pm
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడంతో సమావేశాలు…
వృత్తి నిపుణులు, దేశంలో నైపుణ్య కేంద్రాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. కేంద్రంలో మోడీ సర్కారు ఏర్పడిన తర్వాత నైపుణ్య కేంద్రాలకు…
పవన్ కళ్యాణ్ వారసుడిగా స్క్రీన్ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్న అకీరానందన్ ఇంకా ఇండస్ట్రీకి రాకముందే హాట్ టాపిక్…
గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్టీ కార్యకర్తలు, నాయకుల కోసం శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ…
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ షర్మిల.. రాజ్యసభకు వెళ్తారంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. 2024…
టాలీవుడ్ లోనే కాదు అటు బాలీవుడ్ లోనూ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న స్పిరిట్ మీద పుకార్ల ప్రహసనం మాములుగా…