మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్లుండి లుక్ మార్చేశారు. మీసం తీసేసి గత కొన్నేళ్లలో ఎన్నడూ చూడని లుక్లోకి మారారు. కొన్ని నెలలుగా షూటింగులు లేక ఖాళీగా ఉన్న చిరు.. సినిమాలతో బాగానే కాలక్షేపం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సత్యదేవ్ హీరోగా నటించిన ‘బ్లఫ్ మాస్టర్’ సినిమా చూసి.. ఆ చిత్ర దర్శకుడు గోపీ గణేష్ను ఇంటికి పిలిపించుకుని మరీ అభినందించారు చిరు. ఈ సందర్భంగా చిరు ఫొటో చూసి అభిమానులు షాకయ్యారు. ఆయన మీసం తీసేయడమే అందుక్కారణం. చిరు ఇలా ఎందుకు లుక్ మార్చుకున్నారని అభిమానులు చర్చించుకోవడం మొదలుపెట్టారు.
కొందరేమో ‘ఆచార్య’ షూటింగ్ ఇప్పుడిప్పుడే మొదలయ్యే అవకాశం లేకపోవడంతో చిరు మీసం తీసేసి మామూలుగా ఉంటుండొచ్చని అభిప్రాయపడగా.. ఇంకొందరేమో ఆ సినిమా కోసమే లుక్ మార్చుకుని ఉండొచ్చని.. ఇందులో చిరు భిన్న పార్శ్యాలున్న పాత్రను చేస్తున్నారని.. అందుకే లుక్ మార్చున్నారని అంటున్నారు. ఇదే నిజమైతే ఓకే కానీ.. ఇప్పుడిప్పుడే షూటింగ్ ఉండదన్న ఉద్దేశంతో చిరు మీసం తీసేసి ఉంటే మాత్రం.. ఇది ఇండస్ట్రీ జనాలకు నిరాశ కలిగించే విషయమే. ఐదు నెలలుగా ఉపాధి లేక సినీ కార్మికులు అల్లాడి పోతున్నారు. షూటింగ్స్ ఎప్పుడెప్పుడు మొదలవుతాయా అని చూస్తున్నారు.
గత నెలలో ప్రభుత్వం షూటింగ్లకు అనుమతులిచ్చినపుడు హమ్మయ్య కష్టాలు తీరబోతున్నాయని సంతోషించారు. ఈ విషయంలో చిరునే ఎంతో చొరవ తీసుకున్నారు. ముందుగా తన సినిమానే పున:ప్రారంభించి ఇండస్ట్రీకి ఆయన మార్గనిర్దేశం చేస్తారనుకున్నారు. కానీ హైదరాబాద్లో కరోనా తీవ్రత పెరిగిపోతుండటంతో అందరిలాగే చిరు కూడా భయపడ్డారు. కనీసం ఆగస్టులో అయినా షూటింగ్లు మొదలవుతాయని అనుకుంటే.. అలాంటి సంకేతాలు కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో చిరు ఇలా లుక్ మార్చి కనిపించేసరికి ఇండస్ట్రీ వర్గాల్లో ఆందోళన పెరిగిపోతోంది.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…