మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్లుండి లుక్ మార్చేశారు. మీసం తీసేసి గత కొన్నేళ్లలో ఎన్నడూ చూడని లుక్లోకి మారారు. కొన్ని నెలలుగా షూటింగులు లేక ఖాళీగా ఉన్న చిరు.. సినిమాలతో బాగానే కాలక్షేపం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సత్యదేవ్ హీరోగా నటించిన ‘బ్లఫ్ మాస్టర్’ సినిమా చూసి.. ఆ చిత్ర దర్శకుడు గోపీ గణేష్ను ఇంటికి పిలిపించుకుని మరీ అభినందించారు చిరు. ఈ సందర్భంగా చిరు ఫొటో చూసి అభిమానులు షాకయ్యారు. ఆయన మీసం తీసేయడమే అందుక్కారణం. చిరు ఇలా ఎందుకు లుక్ మార్చుకున్నారని అభిమానులు చర్చించుకోవడం మొదలుపెట్టారు.
కొందరేమో ‘ఆచార్య’ షూటింగ్ ఇప్పుడిప్పుడే మొదలయ్యే అవకాశం లేకపోవడంతో చిరు మీసం తీసేసి మామూలుగా ఉంటుండొచ్చని అభిప్రాయపడగా.. ఇంకొందరేమో ఆ సినిమా కోసమే లుక్ మార్చుకుని ఉండొచ్చని.. ఇందులో చిరు భిన్న పార్శ్యాలున్న పాత్రను చేస్తున్నారని.. అందుకే లుక్ మార్చున్నారని అంటున్నారు. ఇదే నిజమైతే ఓకే కానీ.. ఇప్పుడిప్పుడే షూటింగ్ ఉండదన్న ఉద్దేశంతో చిరు మీసం తీసేసి ఉంటే మాత్రం.. ఇది ఇండస్ట్రీ జనాలకు నిరాశ కలిగించే విషయమే. ఐదు నెలలుగా ఉపాధి లేక సినీ కార్మికులు అల్లాడి పోతున్నారు. షూటింగ్స్ ఎప్పుడెప్పుడు మొదలవుతాయా అని చూస్తున్నారు.
గత నెలలో ప్రభుత్వం షూటింగ్లకు అనుమతులిచ్చినపుడు హమ్మయ్య కష్టాలు తీరబోతున్నాయని సంతోషించారు. ఈ విషయంలో చిరునే ఎంతో చొరవ తీసుకున్నారు. ముందుగా తన సినిమానే పున:ప్రారంభించి ఇండస్ట్రీకి ఆయన మార్గనిర్దేశం చేస్తారనుకున్నారు. కానీ హైదరాబాద్లో కరోనా తీవ్రత పెరిగిపోతుండటంతో అందరిలాగే చిరు కూడా భయపడ్డారు. కనీసం ఆగస్టులో అయినా షూటింగ్లు మొదలవుతాయని అనుకుంటే.. అలాంటి సంకేతాలు కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో చిరు ఇలా లుక్ మార్చి కనిపించేసరికి ఇండస్ట్రీ వర్గాల్లో ఆందోళన పెరిగిపోతోంది.
This post was last modified on July 21, 2020 7:46 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…