Movie News

ఏపీ గవర్మెంట్ పై బాలయ్య డైరెక్ట్ పంచ్

బాలయ్య సంక్రాంతి సినిమా ‘వీర సింహా రెడ్డి’ ట్రైలర్ వచ్చేసింది. బాలయ్య ఫ్యాన్స్ తో పాటు అందరూ ఎదురుచూసిన ఈ ట్రైలర్ పవర్ ఫుల్ డైలాగ్స్ మెప్పించి మంచి మార్కులే స్కోర్ చేసింది. బాలయ్య నుండి ఫ్యాన్స్ , సినీ అభిమానులు ఏం ఊహించి థియేటర్స్ కి వెళ్తారో అవన్నీ పక్కగా ప్లాన్ చేసుకున్నాడు గోపీచంద్ మాలినేని. ట్రైలర్ చూస్తే కథ రొటీన్ అయినా సంక్రాంతి సీజన్ లో కాసులు తెచ్చే కళ కనిపిస్తుంది.

ఇక ‘వీర సింహా రెడ్డి’ ట్రైలర్ లో బాలయ్య ఏపీ సర్కారు పై , ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై పరోక్షంగా వేసిన పంచ్ లు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ మధ్య జగన్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఉన్నట్టుండి పేరు మార్చి మాజీ ముఖ్యమంత్రి దివంగత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం దానికి టీడీపీ కౌంటర్ ఇవ్వడం దర్నాలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రైలర్ లో బాలయ్య “సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో , కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారాదు ,మార్చలేరు.” అనే డైలాగ్ తో పరోక్షంగానే పంచ్ వేశాడు , అలాగే ట్రైలర్ చివర్లో “పదవి చూసుకొని మీకు పొగరేమో బై బర్త్ నా డిఎన్ఏ కే పొగరెక్కువ” అంటూ నేరుగా తన పొగరు గురించి చెప్పి ట్రైలర్ ని పవర్ ఫుల్ డైలాగ్ తో ఎండ్ చేశాడు.

మరి ‘వీరసింహా రెడ్డి’ లో బాలయ్యే ఈ డైలాగులు పెట్టించుకున్నాడా ? లేదా దర్శకుడు గోపీచంద్ మాలినేని , రైటర్ సాయి మాధవ బుర్రా ఫ్యాన్స్ కోసం బాలయ్యతో ఈ డైలాగులు చెప్పించారా ? ఏదేమైనా బాలయ్య పంచ్ డైలాగులు ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

This post was last modified on January 6, 2023 10:04 pm

Share
Show comments

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

4 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago