0సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా డాక్టర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ షూటింగ్ సగానికి పైగానే పూర్తయ్యింది. ఆ మధ్య తలైవా పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న టీజర్ వదిలారు కానీ దానికేమంత ఆశించిన స్థాయి రెస్పాన్స్ రాలేదు. వీటితో సంబంధం లేకుండా ఇప్పటికీ తమిళనాట తిరుగులేని స్టార్ డం కొనసాగిస్తున్న రజని తాజా చిత్రం కావడంతో జైలర్ మీద అభిమానులకు బోలెడు ఆశలున్నాయి. పెద్దన్న మరీ దారుణంగా డిజాస్టర్ కావడంతో బయట రాష్ట్రాల్లో మార్కెట్ బాగా డౌన్ అయ్యింది. దాన్ని ఇది రికవర్ చేస్తుందని ఎంతో నమ్మకం పెట్టుకున్నారు.
ఇదిలా ఉండగా జైలర్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన లీక్స్ చెన్నై వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అందులో మొదటిది ఈ కథ మొత్తం కేవలం ఒక్క రాత్రిలో ఉంటుందట. పగటికి సంబంధించిన షాట్స్ చాలా తక్కువగా ఉంటాయని అవి కూడా కొన్ని నిమిషాలకే పరిమితమవుతాయని సమాచారం. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కి భిన్నంగా థ్రిల్లర్ తరహాలో సూపర్ స్టార్ మ్యానరిజంస్ ని వాడుకుంటూనే దిలీప్ తెరకెక్కించారని తెలిసింది. ఒకరకంగా చెప్పాలంటే కార్తీ ఖైదీ తరహాలో ఉంటుందన్న మాట. గతంలో ఈ టైపు సబ్జెక్టులు ఎప్పుడు చేయలేదు కాబట్టి రజనికి కొత్తగా ఉంటుంది.
ఇందులో కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే మలయాళం కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ఓ చిన్న క్యామియో చేసేందుకు అంగీకారం తెలిపారు. పాత్ర పరిధి వివరాలు ఇంకా బయటికి చెప్పలేదు కానీ ఒక కీలకమైన ట్విస్టుకు సంబంధించి ఆయన ఎంట్రీ ఉంటుందట. విక్రమ్ తర్వాత సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ నుంచి మరో బ్లాస్టింగ్ స్కోర్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతానికి ఏప్రిల్ 14 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు కానీ చివరి నిమిషంలో ఏమైనా మార్పులు ఉంటే తప్ప ఆ తేదీకి రావడం కన్ఫర్మ్ చేసుకోవచ్చు.
This post was last modified on January 6, 2023 12:33 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…