కెజిఎఫ్ తో వచ్చిన ప్యాన్ ఇండియా ఫేమ్ ని కాపాడుకునేందుకు హీరో యష్ పడుతున్న తంటాలు అన్ని ఇన్ని కావు. ఇంకో మూడు నెలల్లో తనకు గ్యాప్ వచ్చి ఏడాది పూర్తవుతుంది. ఇప్పటిదాకా కొత్త సినిమా మొదలుపెట్టనే లేదు. ఆ మధ్య గన్ షూటింగ్ కి సంబంధించి ఏదో ట్రైనింగ్ వీడియో హల్చల్ చేసింది కానీ అది దేనికోసమో క్లారిటీ రాలేదు. సరే జనవరి 8న తన పుట్టినరోజు కాబట్టి ఏదైనా అనౌన్స్ మెంట్ ఉంటుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ నిన్న సాయంత్రం అలాంటిదేమీ లేదని కొంత సమయం ఇస్తే మీ అంచనాలకు తగ్గట్టు మంచి ప్రకటనతో వస్తానని చావు కబురు చల్లగా చెప్పేశాడు.
అంతేకాదు ఈసారి బెంగళూరులో అందుబాటులో ఉండట్లేదని ప్రత్యక్షంగా కలుసుకోవాలని ప్లాన్ చేసుకున్న ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు. నిజానికి యష్ ముందున్న అతి పెద్ద సమస్య డైరెక్టర్ ని ఎంచుకోవడం. తన ఇమేజ్ కి తగ్గ కథను వెతుక్కోవడం. ఈ రెండు సవాల్ గా మారాయి. ;లైగర్ షూటింగ్ జరుగుతున్న టైంలో పూరి జగన్నాధ్ తో ఒకదఫా చర్చలు జరిపినట్టు ఆ మధ్య లీక్ వచ్చింది. తీరా దాని ఫలితం చూశాక సైలెంట్ అయిపోయాడు. కన్నడ బ్లాక్ బస్టర్ మఫ్టీ తీసిన నర్తన్ ఎప్పటి నుంచో కథ పట్టుకుని తిరుగుతున్నాడు. కానీ ఎందుకో కాంబో సెట్ కావడం లేదు.
ఇప్పుడా నర్తనే విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ లను టార్గెట్ గా పెట్టుకుని ఆల్రెడీ కలుసుకున్నాడు. ఫైనల్ గా ఎవరికి లాక్ అవుతాడనేది చెప్పలేని పరిస్థితి. యష్ కు మరో సమస్య అందరు స్టార్ డైరెక్టర్లు కనీసం ఇంకో ఏడాది దొరకలేనంత బిజీగా ఉన్నారు. పోనీ కెజిఎఫ్ 3 తీద్దామా అంటే ప్రశాంత్ నీల్ డైరీ 2025 దాకా ఫుల్ అయిపోయింది. అందుకే తొందరపడకుండా ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు బర్త్ డే అని చెప్పి ఎవరిని కలిసినా నెక్స్ట్ ప్రాజెక్టు గురించే అడుగుతారు కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళిపోయాడు. మరీ అతి జాగ్రత్త కూడా రిస్కే .
This post was last modified on January 6, 2023 10:52 am
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…