కెజిఎఫ్ తో వచ్చిన ప్యాన్ ఇండియా ఫేమ్ ని కాపాడుకునేందుకు హీరో యష్ పడుతున్న తంటాలు అన్ని ఇన్ని కావు. ఇంకో మూడు నెలల్లో తనకు గ్యాప్ వచ్చి ఏడాది పూర్తవుతుంది. ఇప్పటిదాకా కొత్త సినిమా మొదలుపెట్టనే లేదు. ఆ మధ్య గన్ షూటింగ్ కి సంబంధించి ఏదో ట్రైనింగ్ వీడియో హల్చల్ చేసింది కానీ అది దేనికోసమో క్లారిటీ రాలేదు. సరే జనవరి 8న తన పుట్టినరోజు కాబట్టి ఏదైనా అనౌన్స్ మెంట్ ఉంటుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ నిన్న సాయంత్రం అలాంటిదేమీ లేదని కొంత సమయం ఇస్తే మీ అంచనాలకు తగ్గట్టు మంచి ప్రకటనతో వస్తానని చావు కబురు చల్లగా చెప్పేశాడు.
అంతేకాదు ఈసారి బెంగళూరులో అందుబాటులో ఉండట్లేదని ప్రత్యక్షంగా కలుసుకోవాలని ప్లాన్ చేసుకున్న ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు. నిజానికి యష్ ముందున్న అతి పెద్ద సమస్య డైరెక్టర్ ని ఎంచుకోవడం. తన ఇమేజ్ కి తగ్గ కథను వెతుక్కోవడం. ఈ రెండు సవాల్ గా మారాయి. ;లైగర్ షూటింగ్ జరుగుతున్న టైంలో పూరి జగన్నాధ్ తో ఒకదఫా చర్చలు జరిపినట్టు ఆ మధ్య లీక్ వచ్చింది. తీరా దాని ఫలితం చూశాక సైలెంట్ అయిపోయాడు. కన్నడ బ్లాక్ బస్టర్ మఫ్టీ తీసిన నర్తన్ ఎప్పటి నుంచో కథ పట్టుకుని తిరుగుతున్నాడు. కానీ ఎందుకో కాంబో సెట్ కావడం లేదు.
ఇప్పుడా నర్తనే విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ లను టార్గెట్ గా పెట్టుకుని ఆల్రెడీ కలుసుకున్నాడు. ఫైనల్ గా ఎవరికి లాక్ అవుతాడనేది చెప్పలేని పరిస్థితి. యష్ కు మరో సమస్య అందరు స్టార్ డైరెక్టర్లు కనీసం ఇంకో ఏడాది దొరకలేనంత బిజీగా ఉన్నారు. పోనీ కెజిఎఫ్ 3 తీద్దామా అంటే ప్రశాంత్ నీల్ డైరీ 2025 దాకా ఫుల్ అయిపోయింది. అందుకే తొందరపడకుండా ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు బర్త్ డే అని చెప్పి ఎవరిని కలిసినా నెక్స్ట్ ప్రాజెక్టు గురించే అడుగుతారు కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళిపోయాడు. మరీ అతి జాగ్రత్త కూడా రిస్కే .
This post was last modified on January 6, 2023 10:52 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…