పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఖుషి, గుడుంబా శంకర్, బాలు, తీన్ మార్ లాంటి అదిరిపోయే ఆడియోలు ఇచ్చిన సంగీత దర్శకుడు మణిశర్మ. ఖుషి మినహా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆడకపోయి ఉండొచ్చు కానీ.. వాటి ఆడియోలను మాత్రం తక్కువ చేయలేం. ఐతే ఈ సినిమాల ఆడియోలు అంత బాగా రావడానికి పవన్ కూడా ఒక కారణమని అంటున్నాడు మణిశర్మ.
తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పవన్తో తన అనుబంధం.. పవన్తో మ్యూజిక్ సిట్టింగ్స్ అనుభవం గురించి మాట్లాడాడు. తాను పని చేసిన వాళ్లలో పవన్ అంత మ్యూజిక్ సెన్స్ ఉన్న, అంతలా సంగీత చర్చల్లో ఇన్వాల్వ్ అయ్యే హీరో మరొకరు కనిపించలేదని మణిశర్మ పేర్కొనడం విశేషం.
పవన్, తన కాంబినేషన్ అనగానే అందరికీ ఖుషి సినిమానే గుర్తుకొస్తుందని.. కానీ గుడుంబా శంకర్ ఆడియో ఖుషిని మించి ఉంటుందని.. అందులో రకరకాల పాటలుంటాయని.. అన్నీ చాలా బాగుంటాయని మణిశర్మ అన్నాడు.
ఈ సినిమాకు ట్యూన్స్ కంపోజ్ చేసేటపుడు పవన్ తనతోనే ఉన్నాడని.. తాను ట్యూన్స్ చేసుకుంటుంటే.. పక్కనే నేల మీద కార్పెట్ వేసుకుని పడుకునేవాడని.. ఏదో పుస్తకం చదువుకుంటూ ఉండేవాడని.. తాను ఏదైనా ట్యూన్ వినిపిస్తే అది నచ్చగానే ఎగిరి గంతేసినంత పని చేసేవాడని.. పవన్కు పది కోట్ల చెక్కు చేతికిస్తే ఏ ఎమోషన్ లేకుండా మామూలుగా ఉంటాడని.. కానీ మంచి ట్యూన్ వస్తే మాత్రం చిన్నపిల్లాడిలా ఎగిరి గంతులేస్తాడని.. అదీ ఆయన వ్యక్తిత్వం అని మణిశర్మ అన్నాడు.మళ్లీ పవన్తో పని చేయాలని ఉందని.. కానీ అది తన చేతుల్లో లేదని.. అది నిర్ణయించాల్సింది పవన్ అని మణిశర్మ అన్నాడు.
ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ…
అక్కినేని కుటుంబం, అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆ కుటుంబం నుంచి కొత్త తరంలో చాలా పెద్ద స్టార్ అయిపోతాడు…
ఒక ఫ్యాన్ అసోసియేషన్ వ్యక్తిగతంగా తమ హీరో పేరు మీద సేవా కార్యక్రమాలు తలపెడితే, దానికి రాజకీయ రంగప్రవేశానికి ముడిపెట్టి…
పెద్దగా అంచనాలు లేకుండా గత ఏడాది డిసెంబర్ లో దురంధర్ విడుదలైనప్పుడు ఎవరూ దాని సునామిని ఊహించలేదు. వంద కోట్లు…
అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…