పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఖుషి, గుడుంబా శంకర్, బాలు, తీన్ మార్ లాంటి అదిరిపోయే ఆడియోలు ఇచ్చిన సంగీత దర్శకుడు మణిశర్మ. ఖుషి మినహా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆడకపోయి ఉండొచ్చు కానీ.. వాటి ఆడియోలను మాత్రం తక్కువ చేయలేం. ఐతే ఈ సినిమాల ఆడియోలు అంత బాగా రావడానికి పవన్ కూడా ఒక కారణమని అంటున్నాడు మణిశర్మ.
తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పవన్తో తన అనుబంధం.. పవన్తో మ్యూజిక్ సిట్టింగ్స్ అనుభవం గురించి మాట్లాడాడు. తాను పని చేసిన వాళ్లలో పవన్ అంత మ్యూజిక్ సెన్స్ ఉన్న, అంతలా సంగీత చర్చల్లో ఇన్వాల్వ్ అయ్యే హీరో మరొకరు కనిపించలేదని మణిశర్మ పేర్కొనడం విశేషం.
పవన్, తన కాంబినేషన్ అనగానే అందరికీ ఖుషి సినిమానే గుర్తుకొస్తుందని.. కానీ గుడుంబా శంకర్ ఆడియో ఖుషిని మించి ఉంటుందని.. అందులో రకరకాల పాటలుంటాయని.. అన్నీ చాలా బాగుంటాయని మణిశర్మ అన్నాడు.
ఈ సినిమాకు ట్యూన్స్ కంపోజ్ చేసేటపుడు పవన్ తనతోనే ఉన్నాడని.. తాను ట్యూన్స్ చేసుకుంటుంటే.. పక్కనే నేల మీద కార్పెట్ వేసుకుని పడుకునేవాడని.. ఏదో పుస్తకం చదువుకుంటూ ఉండేవాడని.. తాను ఏదైనా ట్యూన్ వినిపిస్తే అది నచ్చగానే ఎగిరి గంతేసినంత పని చేసేవాడని.. పవన్కు పది కోట్ల చెక్కు చేతికిస్తే ఏ ఎమోషన్ లేకుండా మామూలుగా ఉంటాడని.. కానీ మంచి ట్యూన్ వస్తే మాత్రం చిన్నపిల్లాడిలా ఎగిరి గంతులేస్తాడని.. అదీ ఆయన వ్యక్తిత్వం అని మణిశర్మ అన్నాడు.మళ్లీ పవన్తో పని చేయాలని ఉందని.. కానీ అది తన చేతుల్లో లేదని.. అది నిర్ణయించాల్సింది పవన్ అని మణిశర్మ అన్నాడు.
This post was last modified on July 20, 2020 11:18 am
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…
టీనేజీలోనే తన ప్రతిభను చాటుకుని చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగాడు దేవిశ్రీ ప్రసాద్. ఎంత ఎదిగినా ఒదిగి…