Movie News

మ‌ణిశ‌ర్మ కంపోజ్ చేస్తుంటే.. ప‌వ‌న్ కింద ప‌డుకుని

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఖుషి, గుడుంబా శంక‌ర్, బాలు, తీన్ మార్ లాంటి అదిరిపోయే ఆడియోలు ఇచ్చిన సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశ‌ర్మ‌. ఖుషి మిన‌హా సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆడ‌క‌పోయి ఉండొచ్చు కానీ.. వాటి ఆడియోల‌ను మాత్రం త‌క్కువ చేయ‌లేం. ఐతే ఈ సినిమాల ఆడియోలు అంత బాగా రావ‌డానికి ప‌వ‌న్ కూడా ఒక కార‌ణ‌మ‌ని అంటున్నాడు మ‌ణిశ‌ర్మ‌.

తాజాగా ఆయ‌న ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్‌తో త‌న అనుబంధం.. ప‌వ‌న్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ అనుభ‌వం గురించి మాట్లాడాడు. తాను ప‌ని చేసిన వాళ్ల‌లో ప‌వ‌న్ అంత మ్యూజిక్ సెన్స్ ఉన్న‌, అంత‌లా సంగీత చ‌ర్చ‌ల్లో ఇన్వాల్వ్ అయ్యే హీరో మ‌రొక‌రు క‌నిపించ‌లేద‌ని మ‌ణిశ‌ర్మ పేర్కొన‌డం విశేషం.

ప‌వ‌న్, త‌న కాంబినేష‌న్ అన‌గానే అంద‌రికీ ఖుషి సినిమానే గుర్తుకొస్తుంద‌ని.. కానీ గుడుంబా శంక‌ర్ ఆడియో ఖుషిని మించి ఉంటుంద‌ని.. అందులో ర‌క‌ర‌కాల పాట‌లుంటాయ‌ని.. అన్నీ చాలా బాగుంటాయ‌ని మ‌ణిశ‌ర్మ అన్నాడు.

ఈ సినిమాకు ట్యూన్స్ కంపోజ్ చేసేట‌పుడు ప‌వ‌న్ త‌న‌తోనే ఉన్నాడ‌ని.. తాను ట్యూన్స్ చేసుకుంటుంటే.. ప‌క్క‌నే నేల మీద కార్పెట్ వేసుకుని ప‌డుకునేవాడ‌ని.. ఏదో పుస్త‌కం చ‌దువుకుంటూ ఉండేవాడ‌ని.. తాను ఏదైనా ట్యూన్ వినిపిస్తే అది నచ్చ‌గానే ఎగిరి గంతేసినంత ప‌ని చేసేవాడ‌ని.. ప‌వ‌న్‌కు ప‌ది కోట్ల చెక్కు చేతికిస్తే ఏ ఎమోష‌న్ లేకుండా మామూలుగా ఉంటాడ‌ని.. కానీ మంచి ట్యూన్ వ‌స్తే మాత్రం చిన్న‌పిల్లాడిలా ఎగిరి గంతులేస్తాడ‌ని.. అదీ ఆయ‌న వ్య‌క్తిత్వం అని మ‌ణిశ‌ర్మ అన్నాడు.మ‌ళ్లీ ప‌వ‌న్‌తో ప‌ని చేయాల‌ని ఉంద‌ని.. కానీ అది త‌న చేతుల్లో లేద‌ని.. అది నిర్ణ‌యించాల్సింది ప‌వ‌న్ అని మ‌ణిశ‌ర్మ అన్నాడు.

This post was last modified on July 20, 2020 11:18 am

Share

Recent Posts

మ‌ళ్లీ తాప్సి మీద ప‌డ్డ కంగ‌న‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కంగ‌నా ర‌నౌత్‌.. ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థాయి అందుకున్న ద‌గ్గ‌ర్నుంచి తాను ప‌ని చేసే ఇండ‌స్ట్రీలోనే…

57 minutes ago

అర్థరహిత సర్వేలతో లాభం లేదు జగన్

రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…

2 hours ago

ఇది మన ఇరుముడి – చదుకోవాల్సిన కేస్ స్టడీ

ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…

2 hours ago

స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..…

4 hours ago

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…

5 hours ago

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

14 hours ago