టాలీవుడ్లో చాలామంది టాప్ స్టార్లతో సినిమాలు చేశాడు దిల్ రాజు. చిరంజీవి, బాలకృష్ణలను మినహాయిస్తే దాదాపుగా అందరు స్టార్లూ ఆయనతో సినిమాలు చేశారు. ఆ ఇద్దరు కూడా ఏదో ఒక రోజు రాజుతో జట్టు కట్టకపోరన్న అంచనాలున్నాయి. పవన్ కళ్యాణ్తో సినిమా చేయాలన్న తన కలను కూడా ‘వకీల్ సాబ్’తో నెరవేర్చుకున్నాడు రాజు. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ లాంటి టాప్ స్టార్తో శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతోంది.
ఇదే టైంలో రాజు టైం వేరే భాషల వైపు మళ్లింది. హిందీలో ఏడాది వ్యవధిలో రెండు సినిమాల నిర్మాణంలో పాలుపంచుకున్నాడు. తమిళంలో విజయ్ లాంటి టాప్ స్టార్తో ‘వారసుడు’ చేశాడు. ఇప్పుడాయన దృష్టి ఓ కన్నడ స్టార్ మీద పడ్డట్లు సమాచారం.
‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన యశ్తో ఓ సినిమా చేయడానికి దిల్ రాజు గట్టిగా ప్రయత్నిస్తున్నాడట. ‘కేజీఎఫ్: చాప్టర్-1’ తర్వాత గ్యాప్ వచ్చినా.. పక్క చూపులు చూడకుండా ‘కేజీఎఫ్-2’తోనే ప్రేక్షకులను పలకరించాడు యశ్. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవడంతో అతడి రేంజే మారిపోయింది. ఐతే దీని తర్వాత తన ఇమేజ్ను మ్యాచ్ చేసే కథ, దర్శకుడి కోసం అతడి వేట సాగుతోంది. ఇదిగో అదిగో అంటున్నారే తప్ప యశ్ కొత్త సినిమా ఎంతకీ ఒక కొలిక్కి రావడం లేదు. ప్రశాంత్ నీల్ లాగా తన ఇమేజ్ను మ్యాచ్ చేసే, పెంచే మరో దర్శకుడు కన్నడలో లేక యశ్ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.
ఐతే యశ్ తన తర్వాతి సినిమా విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటాడో కానీ.. దిల్ రాజు అయితే అతడికి అడ్వాన్స్ ఇచ్చి ఒక పాన్ ఇండియా సినిమా చేయడానికి కమిట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం. యశ్ కోసం కథ, దర్శకుడి వేటలో రాజు బిజీగా ఉన్నాడట. మామూలుగా రాజు కథ రెడీ చేసుకున్నాకే హీరోలను కలుస్తుంటాడు. కానీ యశ్ విషయంలో మాత్రం ముందు అడ్వాన్స్ ఇచ్చి కమిట్మెంట్ తీసుకుని.. తర్వాత కథ, దర్శకుడి మీద దృష్టిపెట్టినట్లు సమాచారం.
This post was last modified on January 4, 2023 2:32 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…