మామూలుగా ఫిబ్రవరి అంటే చాలా డల్ సీజన్ అనే అభిప్రాయం ఉండేది ఒకప్పుడు. ఆ టైంలో చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజయ్యేవి కావు. సంక్రాంతి తర్వాత ఫిబ్రవరిలో డల్గా మారే బాక్సాఫీస్.. మళ్లీ మార్చి నెలాఖర్లో కానీ ఊపందుకోదు. సినిమాలకు మహ రాజ పోషకులైన యువతలో చాలామంది ఈ టైంలో పరీక్షలతో బిజీగా ఉంటారు. కాలేజీ స్టూడెంట్స్ అంతా పరీక్షలకు సిద్ధమవుతుంటారు కాబట్టి సినిమాలకు వసూళ్లు ఉండవు. ముఖ్యంగా ఫిబ్రవరి సగం నుంచి మార్చి మూడో వారం వరకు డ్రై రన్ అన్నట్లే. అందుకే ఆ టైంలో పేరున్న, పెద్ద సినిమాలు విడుదల చేయరు. చాలా వరకు చిన్నా చితకా సినిమాలకు క్లియరెన్స్ టైం లాగా ఉపయోగపడుతుంటుంది ఈ ఈ సీజన్.
కానీ కరోనా టైం నుంచి చదువులు, పరీక్షల షెడ్యూళ్లు తేడా కొట్టేయడంతో సినిమాల వ్యవహారం కూడా మారిపోయింది. 2021, 2022లో ఫిబ్రవరిలోనే పేరున్న సినిమాలు రిలీజయ్యాయి. మంచి వసూళ్లు కూడా సాధించాయి.
ఇప్పుడు కరోనా ప్రభావం లేదు. పరీక్షలు యధావిధిగా జరుగుతున్నాయి. అయినా సరే ఫిబ్రవరిలో మ్యాడ్ రష్ కనిపిస్తోంది. నవంబరు-డిసెంబరు నెలల్లో రిలీజ్ కావాల్సిన సినిమాలను కూడా వాయిదా వేసి మరీ ఫిబ్రవరి విడుదలకు ఫిక్స్ చేయడం విశేషం. ఇప్పటికే శివరాత్రి వీకెండ్లో ధనుష్ ద్విభాషా చిత్రం ‘సార్’.. విశ్వక్సేన్ మూవీ ‘ధమ్కీ’.. కిరణ్ అబ్బవరం సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోగా.. కొత్తగా సమంత సినిమా ‘శాకుంతలం’ను అదే వీకెండ్కు ఖరారు చేశఆరు. ఇక నెల ఆరంభంలోనే నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా ‘అమిగోస్’ రాబోతోంది.
సంక్రాంతికి అనుకుని మళ్లీ వాయిదా పడ్డ ‘ఏజెంట్’ సినిమా కూడా ఫిబ్రవరిలోనే ప్రేక్షకులను పలకరిస్తుందని అంటున్నారు. తాజాగా మరో చిత్రం ఫిబ్రవరి రేసులోకి వచ్చింది. డిసెంబరు నెలాఖరులో రావాల్సి ఉండి, వాయిదా పడ్డ సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ ‘మైకేల్’ను ఫిబ్రవరి 3కు ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి తొలి, మూడో వారాలకు ప్యాక్ అయిపోగా.. మిగతా రెండు వారాల్లోనూ మూణ్నాలుగు పేరున్న సినిమాలే షెడ్యూల్ కావడం ఖాయం.
సినిమాల సక్సెస్ రేట్ పడిపోతోందని.. ఒకప్పట్లా జనం థియేటర్లకు రావట్లేదని ఈ మధ్య మన ఇండస్ట్రీలో తరచుగా ఆవేదన స్వరం…
గత వారం రోజులుగా ఓజి 2 గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఈ ఏడాదే షూటింగ్ ప్రారంభమవుతుందని,…
టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్… తనను తాను జనసేన అధినేత,…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. తెలంగాణలోని హనుమకొండలో పర్యటించారు. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్కు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం తన పొరుగు రాష్ట్రం తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని హన్మకొండ…
వయసు ఒక నంబర్ మాత్రమే అనే నానుడిని రుజువు చేస్తూ 94 ఏళ్ల వయసులో ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిం…