బ్లాక్ బస్టర్ ఫస్ట్ సిరీస్ తర్వాత సెకండ్ సీజన్ తొలుత కొంచెం డల్ గా అనిపించినా ప్రభాస్ రాకతో అన్ స్టాపబుల్ షోకి ఎక్కడలేని ఊపొచ్చింది. ఏకంగా ఆహా యాప్ గంటల తరబడి క్రాష్ అయ్యే రేంజ్ లో బాలయ్య టాక్ షో అదరగొట్టేసింది. ఇంకా అసలైన రెండో భాగం ఈ శుక్రవారం స్ట్రీమింగ్ కానుండగా దాని మీదా అంచనాలు అంతకు మించి అనేలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో దీనికి బ్రేక్ ఇవ్వబోతున్నారని ఆల్రెడీ టాక్ ఉండగా దాన్ని ఈ నెలాఖరుకు విడుదల చేసే ప్రణాళిక ఉన్నట్టు ఆహా టీమ్ ప్రకటించేసింది. ఇక్కడితో కథ అయిపోలేదు. మరో సర్ప్రైజ్ గెస్ట్ రాబోతున్నారని లేటెస్ట్ అప్ డేట్.
ఈ నెల 13 విడుదల కాబోతున్న వీరసింహారెడ్డి కోసం ఒక స్పెషల్ ప్రోగ్రాంని అన్ స్టాపబుల్ టీమ్ ప్లాన్ చేసింది. దానికి దర్శకుడు గోపీచంద్ మలినేని, తమన్ హాజరు కాబోతున్నారు. హీరోయిన్ శృతి హాసన్ రావడంలో ఆశ్చర్యం లేదు కానీ ఆమెతో పాటు తండ్రి లోకనాయకుడు కమల్ హాసన్ కూడా గెస్ట్ గా స్వీట్ షాక్ ఇవ్వొచ్చని వినికిడి. ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ ఆ దిశగా నాన్నను ఒప్పించేందుకు శృతి బాధ్యత తీసుకున్నట్టుగా తెలిసింది. ఎలాగూ కమల్ కు బిగ్ బాస్ షో హోస్ట్ చేయడం ద్వారా ఇలాంటివి కొత్తేమి కాదు. పైగా కూతురి సినిమా కాబట్టి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు.
బాలయ్య కమల్ లకు ముందు నుంచి అనుబంధం ఉంది. ఆదిత్య 369కి సింగీతం శ్రీనివాసరావు ముందు కమల్ హాసన్ నే అనుకున్నారు. కానీ అప్పుడా టైంలో క్షత్రియ పుత్రుడు పనుల్లో బిజీగా ఉండటంతో ఇద్దరూ కలిసి బాలకృష్ణనే బెస్ట్ ఛాయస్ గా ఫీలయ్యారు. ఒకవేళ కమల్ కనక ఆ సినిమాని ఒప్పుకుని ఉంటే కృష్ణదేవరాయల భాగంలో మాత్రమే నందమూరి హీరో కనిపించేవారు. ఇలాంటి ఎన్నో అరుదైన సంఘటనలు పంచుకునే అవకాశం దక్కుతుంది. మరి ఈ అరుదైన కలయిక కూడా నిజమైతే ప్రభాస్, పవన్ ల తర్వాత ఆ రేంజ్ బ్లాస్టింగ్ దీనికే ఉంటుంది. షూటింగ్ ఇంకో వారంలోనే చేయనున్నారు.
This post was last modified on January 3, 2023 10:40 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…