బ్లాక్ బస్టర్ ఫస్ట్ సిరీస్ తర్వాత సెకండ్ సీజన్ తొలుత కొంచెం డల్ గా అనిపించినా ప్రభాస్ రాకతో అన్ స్టాపబుల్ షోకి ఎక్కడలేని ఊపొచ్చింది. ఏకంగా ఆహా యాప్ గంటల తరబడి క్రాష్ అయ్యే రేంజ్ లో బాలయ్య టాక్ షో అదరగొట్టేసింది. ఇంకా అసలైన రెండో భాగం ఈ శుక్రవారం స్ట్రీమింగ్ కానుండగా దాని మీదా అంచనాలు అంతకు మించి అనేలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో దీనికి బ్రేక్ ఇవ్వబోతున్నారని ఆల్రెడీ టాక్ ఉండగా దాన్ని ఈ నెలాఖరుకు విడుదల చేసే ప్రణాళిక ఉన్నట్టు ఆహా టీమ్ ప్రకటించేసింది. ఇక్కడితో కథ అయిపోలేదు. మరో సర్ప్రైజ్ గెస్ట్ రాబోతున్నారని లేటెస్ట్ అప్ డేట్.
ఈ నెల 13 విడుదల కాబోతున్న వీరసింహారెడ్డి కోసం ఒక స్పెషల్ ప్రోగ్రాంని అన్ స్టాపబుల్ టీమ్ ప్లాన్ చేసింది. దానికి దర్శకుడు గోపీచంద్ మలినేని, తమన్ హాజరు కాబోతున్నారు. హీరోయిన్ శృతి హాసన్ రావడంలో ఆశ్చర్యం లేదు కానీ ఆమెతో పాటు తండ్రి లోకనాయకుడు కమల్ హాసన్ కూడా గెస్ట్ గా స్వీట్ షాక్ ఇవ్వొచ్చని వినికిడి. ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ ఆ దిశగా నాన్నను ఒప్పించేందుకు శృతి బాధ్యత తీసుకున్నట్టుగా తెలిసింది. ఎలాగూ కమల్ కు బిగ్ బాస్ షో హోస్ట్ చేయడం ద్వారా ఇలాంటివి కొత్తేమి కాదు. పైగా కూతురి సినిమా కాబట్టి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు.
బాలయ్య కమల్ లకు ముందు నుంచి అనుబంధం ఉంది. ఆదిత్య 369కి సింగీతం శ్రీనివాసరావు ముందు కమల్ హాసన్ నే అనుకున్నారు. కానీ అప్పుడా టైంలో క్షత్రియ పుత్రుడు పనుల్లో బిజీగా ఉండటంతో ఇద్దరూ కలిసి బాలకృష్ణనే బెస్ట్ ఛాయస్ గా ఫీలయ్యారు. ఒకవేళ కమల్ కనక ఆ సినిమాని ఒప్పుకుని ఉంటే కృష్ణదేవరాయల భాగంలో మాత్రమే నందమూరి హీరో కనిపించేవారు. ఇలాంటి ఎన్నో అరుదైన సంఘటనలు పంచుకునే అవకాశం దక్కుతుంది. మరి ఈ అరుదైన కలయిక కూడా నిజమైతే ప్రభాస్, పవన్ ల తర్వాత ఆ రేంజ్ బ్లాస్టింగ్ దీనికే ఉంటుంది. షూటింగ్ ఇంకో వారంలోనే చేయనున్నారు.
This post was last modified on January 3, 2023 10:40 pm
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…