బ్లాక్ బస్టర్ ఫస్ట్ సిరీస్ తర్వాత సెకండ్ సీజన్ తొలుత కొంచెం డల్ గా అనిపించినా ప్రభాస్ రాకతో అన్ స్టాపబుల్ షోకి ఎక్కడలేని ఊపొచ్చింది. ఏకంగా ఆహా యాప్ గంటల తరబడి క్రాష్ అయ్యే రేంజ్ లో బాలయ్య టాక్ షో అదరగొట్టేసింది. ఇంకా అసలైన రెండో భాగం ఈ శుక్రవారం స్ట్రీమింగ్ కానుండగా దాని మీదా అంచనాలు అంతకు మించి అనేలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో దీనికి బ్రేక్ ఇవ్వబోతున్నారని ఆల్రెడీ టాక్ ఉండగా దాన్ని ఈ నెలాఖరుకు విడుదల చేసే ప్రణాళిక ఉన్నట్టు ఆహా టీమ్ ప్రకటించేసింది. ఇక్కడితో కథ అయిపోలేదు. మరో సర్ప్రైజ్ గెస్ట్ రాబోతున్నారని లేటెస్ట్ అప్ డేట్.
ఈ నెల 13 విడుదల కాబోతున్న వీరసింహారెడ్డి కోసం ఒక స్పెషల్ ప్రోగ్రాంని అన్ స్టాపబుల్ టీమ్ ప్లాన్ చేసింది. దానికి దర్శకుడు గోపీచంద్ మలినేని, తమన్ హాజరు కాబోతున్నారు. హీరోయిన్ శృతి హాసన్ రావడంలో ఆశ్చర్యం లేదు కానీ ఆమెతో పాటు తండ్రి లోకనాయకుడు కమల్ హాసన్ కూడా గెస్ట్ గా స్వీట్ షాక్ ఇవ్వొచ్చని వినికిడి. ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ ఆ దిశగా నాన్నను ఒప్పించేందుకు శృతి బాధ్యత తీసుకున్నట్టుగా తెలిసింది. ఎలాగూ కమల్ కు బిగ్ బాస్ షో హోస్ట్ చేయడం ద్వారా ఇలాంటివి కొత్తేమి కాదు. పైగా కూతురి సినిమా కాబట్టి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు.
బాలయ్య కమల్ లకు ముందు నుంచి అనుబంధం ఉంది. ఆదిత్య 369కి సింగీతం శ్రీనివాసరావు ముందు కమల్ హాసన్ నే అనుకున్నారు. కానీ అప్పుడా టైంలో క్షత్రియ పుత్రుడు పనుల్లో బిజీగా ఉండటంతో ఇద్దరూ కలిసి బాలకృష్ణనే బెస్ట్ ఛాయస్ గా ఫీలయ్యారు. ఒకవేళ కమల్ కనక ఆ సినిమాని ఒప్పుకుని ఉంటే కృష్ణదేవరాయల భాగంలో మాత్రమే నందమూరి హీరో కనిపించేవారు. ఇలాంటి ఎన్నో అరుదైన సంఘటనలు పంచుకునే అవకాశం దక్కుతుంది. మరి ఈ అరుదైన కలయిక కూడా నిజమైతే ప్రభాస్, పవన్ ల తర్వాత ఆ రేంజ్ బ్లాస్టింగ్ దీనికే ఉంటుంది. షూటింగ్ ఇంకో వారంలోనే చేయనున్నారు.
This post was last modified on January 3, 2023 10:40 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…