ఒకప్పుడు స్టార్లందరూ ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేసేవారు. కృష్ణ లాంటి హీరోలైతే ఒకే ఏడాది రెండంకెల సంఖ్యలో సినిమాలు రిలీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కాల క్రమంలో పరిస్థితులు మారిపోయాయి. స్టార్ల నుంచి ఏడాదికి ఒక్క సినిమా రావడం కూడా గగనం అయిపోతోంది. రాజమౌళి లాంటి దర్శకులతో హీరోలు జట్టు కట్టారంటే ఏళ్లకు ఏళ్లు వారి సినిమా కోసం ఎదురు చూడాల్సింది.
ఈ మధ్య పాన్ ఇండియా ట్రెండు ఊపందుకోవడంతో వేరే దర్శకులతో పెద్ద సినిమాలు చేసినా.. బాగా టైం పట్టేస్తోంది. 2022లో నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్ లాంటి స్టార్ల సినిమాలు లేకుండానే గడిచిపోయింది. ఈ ఏడాది టాప్ స్టార్లలో రిలీజ్ లేని హీరోలు వీళ్లిద్దరే. 2023లో ముగ్గురు హీరోలు తమ అభిమానులకు నిరాశ మిగిల్చేలా కనిపిస్తున్నారు.
2022లో ‘ఆర్ఆర్ఆర్’తో మురిపించిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్లిద్దరూ 2023లో మళ్లీ థియేటర్లలో ప్రేక్షకులను పలకరించే అవకాశాలు కనిపించడం లేదు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ ఆలస్యం చేయకుండా శంకర్తో సినిమాను లైన్లో పెట్టినప్పటికీ.. మధ్యలో శంకర్ ‘ఇండియన్-2’ చేయాల్సి రావడంతో ఈ చిత్రం ఆలస్యం అవుతోంది. 2023 సంక్రాంతికే అనుకున్న సినిమా కాస్తా బాగా వెనక్కి వెళ్తోంది. 2023 అంతటా కూడా ఈ సినిమా రిలీజ్ కాదట. 2024 సంక్రాంతికే అంటున్నారు.
మరోవైపు కొరటాల శివతో తారక్ చేయాల్సిన సినిమా సెట్స్ మీదికి వెళ్లడంలోనే చాలా ఆలస్యం జరిగింది. చివరికి ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుపెట్టి 2024 వేసవిలో సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కాబట్టి తారక్ అభిమానులకు కూడా 2023లో నిరాశ తప్పదు. ఇక అల్లు అర్జున్ సైతం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావడం సందేహమే. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ చేస్తున్న ‘పుష్ప-2’ షూటింగ్ ఆలస్యంగా మొదలైంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో భారీ స్థాయిలో్ రిలీజ్ కావాల్సి ఉండడంతో మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కానున్నాయి. కాబట్టి ఆ చిత్రం కూడా 2023లో రిలీజ్ కాదు. కాబట్గి ఈ ముగ్గరు టాప్ స్టార్ల అభిమానులకు నిరాశ తప్పదు.
This post was last modified on January 2, 2023 2:27 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…