ఒకప్పుడు స్టార్లందరూ ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేసేవారు. కృష్ణ లాంటి హీరోలైతే ఒకే ఏడాది రెండంకెల సంఖ్యలో సినిమాలు రిలీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కాల క్రమంలో పరిస్థితులు మారిపోయాయి. స్టార్ల నుంచి ఏడాదికి ఒక్క సినిమా రావడం కూడా గగనం అయిపోతోంది. రాజమౌళి లాంటి దర్శకులతో హీరోలు జట్టు కట్టారంటే ఏళ్లకు ఏళ్లు వారి సినిమా కోసం ఎదురు చూడాల్సింది.
ఈ మధ్య పాన్ ఇండియా ట్రెండు ఊపందుకోవడంతో వేరే దర్శకులతో పెద్ద సినిమాలు చేసినా.. బాగా టైం పట్టేస్తోంది. 2022లో నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్ లాంటి స్టార్ల సినిమాలు లేకుండానే గడిచిపోయింది. ఈ ఏడాది టాప్ స్టార్లలో రిలీజ్ లేని హీరోలు వీళ్లిద్దరే. 2023లో ముగ్గురు హీరోలు తమ అభిమానులకు నిరాశ మిగిల్చేలా కనిపిస్తున్నారు.
2022లో ‘ఆర్ఆర్ఆర్’తో మురిపించిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్లిద్దరూ 2023లో మళ్లీ థియేటర్లలో ప్రేక్షకులను పలకరించే అవకాశాలు కనిపించడం లేదు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ ఆలస్యం చేయకుండా శంకర్తో సినిమాను లైన్లో పెట్టినప్పటికీ.. మధ్యలో శంకర్ ‘ఇండియన్-2’ చేయాల్సి రావడంతో ఈ చిత్రం ఆలస్యం అవుతోంది. 2023 సంక్రాంతికే అనుకున్న సినిమా కాస్తా బాగా వెనక్కి వెళ్తోంది. 2023 అంతటా కూడా ఈ సినిమా రిలీజ్ కాదట. 2024 సంక్రాంతికే అంటున్నారు.
మరోవైపు కొరటాల శివతో తారక్ చేయాల్సిన సినిమా సెట్స్ మీదికి వెళ్లడంలోనే చాలా ఆలస్యం జరిగింది. చివరికి ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుపెట్టి 2024 వేసవిలో సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కాబట్టి తారక్ అభిమానులకు కూడా 2023లో నిరాశ తప్పదు. ఇక అల్లు అర్జున్ సైతం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావడం సందేహమే. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ చేస్తున్న ‘పుష్ప-2’ షూటింగ్ ఆలస్యంగా మొదలైంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో భారీ స్థాయిలో్ రిలీజ్ కావాల్సి ఉండడంతో మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కానున్నాయి. కాబట్టి ఆ చిత్రం కూడా 2023లో రిలీజ్ కాదు. కాబట్గి ఈ ముగ్గరు టాప్ స్టార్ల అభిమానులకు నిరాశ తప్పదు.
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…