Prabhas ప్రస్తుతం చేస్తున్న ప్యాన్ ఇండియా సినిమాల్లోకెల్లా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్రాజెక్ట్ కె రిలీజ్ కు ఇంకా బోలెడు టైం ఉన్నప్పటికీ దర్శకుడు నాగ అశ్విన్ టీమ్ న్యూ ఇయర్ కానుకగా చిన్న వీడియో అప్ డేట్ ఇచ్చింది. అయితే ఇందులో హీరో హీరోయిన్లు ఎవరూ లేకుండా కేవలం స్క్రాచ్ నుంచి తమ సినిమా ఎలా మొదలయ్యిందన్న హింట్లు ఇస్తూ కట్ చేశారు. ముఖ్యంగా ఒక పెద్ద లారీ చక్రాన్ని డిజైన్ చేయడానికి పదుల సంఖ్యలో సభ్యులు కష్టపడటం, ఈ మాత్రం షాపులో దొరుకుతుంది కదా ఇంత పని ఎందుకని ఓ వర్కర్ తో అనిపించడం వేటికవే కొంచెం డిఫరెంట్ గా అనిపించాయి.
కొంచెం లోతుగా గమనిస్తే ఇందులో కొన్ని విషయాలు అర్థం చేసుకోవచ్చు. Project K ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్టు టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. అశ్విన్ స్టోరీ లైన్ ఎక్కడా చెప్పలేదు కానీ అప్పుడెప్పుడో వచ్చిన ఆదిత్య 369 రిఫరెన్స్ ల కోసం సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారిని సలహాదారుగా పెట్టుకోవడం దీనికి లింక్ అవుతోంది. అంత పెద్ద చక్రం ఏ కారణం లేకుండా సింపుల్ సీన్ కోసం తయారు చేసి ఉండరు. సో దాన్ని ఏదైనా వాహనానికి బిగించడం ద్వారానో లేదా అది ఉన్న చోట కాలం వెనక్కు ముందుకు వెళ్లడమో జరిగేలా ట్విస్టు పెట్టుంటారు.
ఇదంతా నిజమని కాదు కానీ జాగ్రత్తగా డీ కోడింగ్ చేస్తే ఇవి సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికి కేవలం కొంత భాగం మాత్రమే షూట్ పూర్తి చేసుకున్న ప్రాజెక్ట్ కె కోసం 2023లో భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారు. వైజయంతి సంస్థ దీని విడుదలని ఇంకా ఖరారు చేయలేదు కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం ఎంత సమయం పడుతుందనే దాని మీద రిలీజ్ డేట్ ఆధారపడి ఉంటుంది. దీపికా పదుకునే ప్రాజెక్ట్ కెతో ఇంకా పూర్తి స్థాయిలో జాయిన్ కాలేదు. చిత్రీకరణకు మొత్తం సిద్ధం చేశాక తనతో సహా అమితాబ్, అనుపమ్ ఖేర్ తదితరుల డేట్లను తీసుకోబోతున్నారు. ప్రభాస్ కాబట్టి చిన్న వీడియో అయినా సరే ఇంత చర్చ జరుగుతోంది.
This post was last modified on December 31, 2022 11:51 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…