Prabhas ప్రస్తుతం చేస్తున్న ప్యాన్ ఇండియా సినిమాల్లోకెల్లా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్రాజెక్ట్ కె రిలీజ్ కు ఇంకా బోలెడు టైం ఉన్నప్పటికీ దర్శకుడు నాగ అశ్విన్ టీమ్ న్యూ ఇయర్ కానుకగా చిన్న వీడియో అప్ డేట్ ఇచ్చింది. అయితే ఇందులో హీరో హీరోయిన్లు ఎవరూ లేకుండా కేవలం స్క్రాచ్ నుంచి తమ సినిమా ఎలా మొదలయ్యిందన్న హింట్లు ఇస్తూ కట్ చేశారు. ముఖ్యంగా ఒక పెద్ద లారీ చక్రాన్ని డిజైన్ చేయడానికి పదుల సంఖ్యలో సభ్యులు కష్టపడటం, ఈ మాత్రం షాపులో దొరుకుతుంది కదా ఇంత పని ఎందుకని ఓ వర్కర్ తో అనిపించడం వేటికవే కొంచెం డిఫరెంట్ గా అనిపించాయి.
కొంచెం లోతుగా గమనిస్తే ఇందులో కొన్ని విషయాలు అర్థం చేసుకోవచ్చు. Project K ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్టు టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. అశ్విన్ స్టోరీ లైన్ ఎక్కడా చెప్పలేదు కానీ అప్పుడెప్పుడో వచ్చిన ఆదిత్య 369 రిఫరెన్స్ ల కోసం సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారిని సలహాదారుగా పెట్టుకోవడం దీనికి లింక్ అవుతోంది. అంత పెద్ద చక్రం ఏ కారణం లేకుండా సింపుల్ సీన్ కోసం తయారు చేసి ఉండరు. సో దాన్ని ఏదైనా వాహనానికి బిగించడం ద్వారానో లేదా అది ఉన్న చోట కాలం వెనక్కు ముందుకు వెళ్లడమో జరిగేలా ట్విస్టు పెట్టుంటారు.
ఇదంతా నిజమని కాదు కానీ జాగ్రత్తగా డీ కోడింగ్ చేస్తే ఇవి సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికి కేవలం కొంత భాగం మాత్రమే షూట్ పూర్తి చేసుకున్న ప్రాజెక్ట్ కె కోసం 2023లో భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారు. వైజయంతి సంస్థ దీని విడుదలని ఇంకా ఖరారు చేయలేదు కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం ఎంత సమయం పడుతుందనే దాని మీద రిలీజ్ డేట్ ఆధారపడి ఉంటుంది. దీపికా పదుకునే ప్రాజెక్ట్ కెతో ఇంకా పూర్తి స్థాయిలో జాయిన్ కాలేదు. చిత్రీకరణకు మొత్తం సిద్ధం చేశాక తనతో సహా అమితాబ్, అనుపమ్ ఖేర్ తదితరుల డేట్లను తీసుకోబోతున్నారు. ప్రభాస్ కాబట్టి చిన్న వీడియో అయినా సరే ఇంత చర్చ జరుగుతోంది.
This post was last modified on December 31, 2022 11:51 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…