Prabhas ప్రస్తుతం చేస్తున్న ప్యాన్ ఇండియా సినిమాల్లోకెల్లా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్రాజెక్ట్ కె రిలీజ్ కు ఇంకా బోలెడు టైం ఉన్నప్పటికీ దర్శకుడు నాగ అశ్విన్ టీమ్ న్యూ ఇయర్ కానుకగా చిన్న వీడియో అప్ డేట్ ఇచ్చింది. అయితే ఇందులో హీరో హీరోయిన్లు ఎవరూ లేకుండా కేవలం స్క్రాచ్ నుంచి తమ సినిమా ఎలా మొదలయ్యిందన్న హింట్లు ఇస్తూ కట్ చేశారు. ముఖ్యంగా ఒక పెద్ద లారీ చక్రాన్ని డిజైన్ చేయడానికి పదుల సంఖ్యలో సభ్యులు కష్టపడటం, ఈ మాత్రం షాపులో దొరుకుతుంది కదా ఇంత పని ఎందుకని ఓ వర్కర్ తో అనిపించడం వేటికవే కొంచెం డిఫరెంట్ గా అనిపించాయి.
కొంచెం లోతుగా గమనిస్తే ఇందులో కొన్ని విషయాలు అర్థం చేసుకోవచ్చు. Project K ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్టు టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. అశ్విన్ స్టోరీ లైన్ ఎక్కడా చెప్పలేదు కానీ అప్పుడెప్పుడో వచ్చిన ఆదిత్య 369 రిఫరెన్స్ ల కోసం సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారిని సలహాదారుగా పెట్టుకోవడం దీనికి లింక్ అవుతోంది. అంత పెద్ద చక్రం ఏ కారణం లేకుండా సింపుల్ సీన్ కోసం తయారు చేసి ఉండరు. సో దాన్ని ఏదైనా వాహనానికి బిగించడం ద్వారానో లేదా అది ఉన్న చోట కాలం వెనక్కు ముందుకు వెళ్లడమో జరిగేలా ట్విస్టు పెట్టుంటారు.
ఇదంతా నిజమని కాదు కానీ జాగ్రత్తగా డీ కోడింగ్ చేస్తే ఇవి సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికి కేవలం కొంత భాగం మాత్రమే షూట్ పూర్తి చేసుకున్న ప్రాజెక్ట్ కె కోసం 2023లో భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారు. వైజయంతి సంస్థ దీని విడుదలని ఇంకా ఖరారు చేయలేదు కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం ఎంత సమయం పడుతుందనే దాని మీద రిలీజ్ డేట్ ఆధారపడి ఉంటుంది. దీపికా పదుకునే ప్రాజెక్ట్ కెతో ఇంకా పూర్తి స్థాయిలో జాయిన్ కాలేదు. చిత్రీకరణకు మొత్తం సిద్ధం చేశాక తనతో సహా అమితాబ్, అనుపమ్ ఖేర్ తదితరుల డేట్లను తీసుకోబోతున్నారు. ప్రభాస్ కాబట్టి చిన్న వీడియో అయినా సరే ఇంత చర్చ జరుగుతోంది.
This post was last modified on December 31, 2022 11:51 am
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…