ఇప్పుడేదో పైకి సంక్రాంతికి భారీ చిత్రాల పోటీ కనిపిస్తోంది దానికే మాత్రం తీసిపోని రీతిలో 2023 ఏప్రిల్ నెల అంతకు మించి అనే స్థాయిలో భారీ క్లాష్ లకు సిద్ధమవుతోంది. ఒకటి రెండు కాదు ఏకంగా ఏడు మోస్ట్ వాంటెడ్ సినిమాలు నువ్వా నేనా అనే రేంజ్ లో తలపడనున్నాయి. ముందుగా 7న వచ్చేది ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో రవితేజ కొంచెం నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడని ఇప్పటికే టాక్ ఉంది. సుశాంత్ మెయిన్ విలనని వినికిడి. సరిగ్గా వారం తర్వాత 14న చిరంజీవి ‘భోళా శంకర్’ రంగంలోకి దిగుతుంది. వాల్తేరు వీరయ్య రిలీజ్ తర్వాత బ్యాలన్స్ షూట్ వేగంగా పూర్తి చేస్తారు
అదే రోజు సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ రావడం లాంఛనమే. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆల్మోస్ట్ లాక్ అయినట్టే. ‘రుద్రుడు’ కూడా అదే డేట్ కి షెడ్యూల్ చేశారు. అయితే తన ప్రాణంగా అభిమానించే తలైవాతో ఢీ కొట్టేందుకు లారెన్స్ ఏ మేరకు ఇష్టపడతాడనేది వేచి చూడాలి. అఫీషియల్ గా అయితే చెప్పేశారు. 21న సుప్రీమ్ హీరో సాయి ధరమ్ ‘విరూపాక్ష’ని రంగంలోకి దించుతారు. టీజర్ వచ్చాక దీని మీద అంచనాలు పెరిగాయి. సల్మాన్ ఖాన్ వెంకటేష్ కాంబోలో రూపొందుతున్న ‘కిసీకా భాయ్ కిసీకా జాన్’ పలు వాయిదాల తర్వాత ఆ డేట్ నే తీసుకుంది. తెలుగు వెర్షన్ రిలీజ్ భారీగానే ఉంటుంది
చివరి వారంలో 28న ‘పొన్నియన్ సెల్వన్ 2’ వస్తుంది. మణితర్నం దర్శకత్వంలో రూపొందిన ఈ విజువల్ గ్రాండియర్ రెండో భాగంలోనే అసలు కథ ఉంటుందని యూనిట్ చెబుతోంది. తమిళంలో మినహాయించి బయట అంతగా ఆకట్టుకోలేకపోయిన పీఎస్ 2లో స్టార్ క్యాస్టింగ్ ఎంత ఉన్నా ఆర్ఆర్ఆర్ రేంజ్ లో జనాల్ని మెప్పించలేకపోయింది. మరి సీక్వెల్ అయినా ఏమైనా మేజిక్ చేస్తుందేమో చూడాలి. ఈ లెక్కన ఏప్రిల్ చాలా టైట్ గా మారిపోయింది. అందుకే నాగచైతన్య కస్టడీని మే 12కి షిఫ్ట్ చేసి నిర్మాతలు మంచి నిర్ణయం తీసుకున్నారు. పైన చెప్పిన వాటిలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.
This post was last modified on December 30, 2022 10:29 am
నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…