బాలీవుడ్లో విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ఆర్.బాల్కి. ఆయన అసలు పేరు ఆర్.బాలకృష్ణన్. దాన్ని బాల్కిగా కుదించుకున్నారు. అసలు పేరు చూస్తే ఆయన సౌత్ ఇండియన్ అనే విషయం అర్థమైపోతుంది. ఎక్కువగా తన సినిమాలకు సౌత్ ఇండియన్ లెజెండ్ ఇళయరాజాతోనే మ్యూజిక్ చేయించుకున్నారాయన.
పా, షమితాబ్, ప్యాడ్ మ్యాన్ లాంటి సినిమాలతో గుర్తింపుతో పాటు గౌరవం కూడా సంపాదించుకున్న బాల్కి.. బాలీవుడ్లో నెపోటిజం గురించి జరుగుతున్న పెద్ద చర్చలోకి తాను కూడా వచ్చాడు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు చాలామందికి ఆశ్చర్యం కలిగించాయి. ఆగ్రహం కూడా తెప్పించాయి.
నెపోటిజం ఏ రంగంలో లేదంటూ ప్రశ్నించిన బాల్కి.. ధీరూబాయి అంబానీ తర్వాత ముకేష్ అంబాని కాకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్ను బయటి వ్యక్తి ఎవరైనా నడిపిస్తున్నారా అని ప్రశ్నించారు. ఇలాగే ప్రతి రంగంలోనూ ఉంటుందని.. ప్రతి తండ్రీ తానేం చేస్తుంటే దాన్ని పిల్లలకు వారసత్వంగా ఇస్తాడని.. సినీ రంగంలోనూ అంతే అని.. నెపోటిజం తన దృష్టిలో తప్పే కాదని అన్నాడు బాల్కి. టాలెంట్ లేకుండా ఎవ్వరూ ఇక్కడ నిలదొక్కుకోలేరని.. వారసత్వం తొలి సినిమా వరకే పని చేస్తుందని బాల్కి అన్నాడు.
కాకపోతే సినీ కుటుంబం నుంచి వచ్చిన వాళ్లకు అరంగేట్రం తేలిక అని.. బయటి వాళ్లకు అది కష్టమని అన్నాడు. ఇంత వరకు బాగానే ఉంది కానీ.. వారసత్వ నటులైన రణబీర్ కపూర్, ఆలియా భట్ల కంటే ప్రతిభ ఉన్న వాళ్లెవరైనా ఉంటే చూపించండి.. అప్పుడు నేను ఈ విషయంలో వాదించడానికి సిద్ధం అంటూ ఆయన ఒక సవాల్ విసిరారు. ఇది అందరి ఆగ్రహం తెప్పిస్తోంది.బాల్కి లాంటి ఆలోచనాపరుడైన దర్శకుడు ఇలాంటి వ్యాఖ్య చేసి ఉండాల్సింది కాదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
This post was last modified on July 19, 2020 11:25 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…