పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. టాలీవుడ్లో కొన్నేళ్ల నుంచి చురుగ్గా సినిమాలు నిర్మిస్తున్న సంస్థ. సినిమాల ఎంపికలో మంచి అభిరుచినే చూపిస్తున్నప్పటికీ.. ఆ సంస్థకు ఒక దశ వరకు భారీ విజయాలు దక్కలేదు. గూఢచారి, ఓ బేబీ లాంటి హిట్లు ఉన్నప్పటికీ.. తేడా కొట్టిన సినిమాల లిస్టు పెద్దదే. ఒక దశ వరకు చిన్న పెట్టుబడులు పెడుతూ.. వేరే సంస్థ భాగస్వామ్యంలో సినిమాలు నిర్మిస్తూ వచ్చిన ఈ సంస్థ.. ఈ మధ్య జోరు పెంచింది. కొంచెం పెద్ద స్థాయిలో సోలోగా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తోంది. వాళ్లు చేస్తున్న సాహసాలకు మంచి ఫలితాలే దక్కుతున్నాయి.
ముఖ్యంగా 2022వ సంవత్సరం పీపుల్స్ మీడియా బేనర్కు మరపు రానిదే. పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్బస్టర్ అయిన ‘కార్తికేయ-2’తో ఆ సంస్థ పేరు మార్మోగింది. ఇప్పటిదాకా ఆ సంస్థలో వచ్చిన ఫెయిల్యూర్ సినిమాల నష్టాలన్నింటినీ ఈ ఒక్క చిత్రం కవర్ చేసేసిందంటే అతిశయోక్తి కాదు.
అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్స్ మీడియా నుంచి తాజాగా ‘Dhamaka’ సినిమా వచ్చింది. ఈ సినిమాకు విడుదల ముంగిట పెద్దగా హైప్ కనిపించలేదు. టాక్ కూడా కొంచెం అటు ఇటుగానే వచ్చింది. కానీ ఈ ప్రభావం ఏమీ సినిమా పెర్ఫామెన్స్ మీద ప్రభావం చూపలేదు. తొలి రోజు నుంచి వసూళ్ల మోత మోగిస్తూ సాగుతున్న ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే 30 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది. బయ్యర్లందరూ సేఫ్ జోన్కు దగ్గరగా ఉన్నారు. ఈ వీకెండ్లో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు కాబట్టి రెండో వారంలోనూ ‘ధమాకా’ జోరు కొనసాగించడం ఖాయం.
సినిమా మంచి లాభాలు అందుకుని బ్లాక్ బస్టర్ రేంజ్ అందుకున్నా ఆశ్చర్యం లేదు. ఐదు నెలల వ్యవధిలో రెండు బ్లాక్బస్టర్లు కొట్టడం అంటే ఏ సంస్థకైనా పెద్ద విషయమే. ఈ ఊపులో Pawan kalyanతో అనుకుంటున్న సినిమా కనుక ఓకే అయితే పీపుల్స్ మీడియా వారి పంట పండినట్లే.
This post was last modified on December 27, 2022 7:12 pm
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. సత్తా చాటుకున్నారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు.. ఎవరూ ఊహించని…
నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…
నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…