పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. టాలీవుడ్లో కొన్నేళ్ల నుంచి చురుగ్గా సినిమాలు నిర్మిస్తున్న సంస్థ. సినిమాల ఎంపికలో మంచి అభిరుచినే చూపిస్తున్నప్పటికీ.. ఆ సంస్థకు ఒక దశ వరకు భారీ విజయాలు దక్కలేదు. గూఢచారి, ఓ బేబీ లాంటి హిట్లు ఉన్నప్పటికీ.. తేడా కొట్టిన సినిమాల లిస్టు పెద్దదే. ఒక దశ వరకు చిన్న పెట్టుబడులు పెడుతూ.. వేరే సంస్థ భాగస్వామ్యంలో సినిమాలు నిర్మిస్తూ వచ్చిన ఈ సంస్థ.. ఈ మధ్య జోరు పెంచింది. కొంచెం పెద్ద స్థాయిలో సోలోగా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తోంది. వాళ్లు చేస్తున్న సాహసాలకు మంచి ఫలితాలే దక్కుతున్నాయి.
ముఖ్యంగా 2022వ సంవత్సరం పీపుల్స్ మీడియా బేనర్కు మరపు రానిదే. పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్బస్టర్ అయిన ‘కార్తికేయ-2’తో ఆ సంస్థ పేరు మార్మోగింది. ఇప్పటిదాకా ఆ సంస్థలో వచ్చిన ఫెయిల్యూర్ సినిమాల నష్టాలన్నింటినీ ఈ ఒక్క చిత్రం కవర్ చేసేసిందంటే అతిశయోక్తి కాదు.
అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్స్ మీడియా నుంచి తాజాగా ‘Dhamaka’ సినిమా వచ్చింది. ఈ సినిమాకు విడుదల ముంగిట పెద్దగా హైప్ కనిపించలేదు. టాక్ కూడా కొంచెం అటు ఇటుగానే వచ్చింది. కానీ ఈ ప్రభావం ఏమీ సినిమా పెర్ఫామెన్స్ మీద ప్రభావం చూపలేదు. తొలి రోజు నుంచి వసూళ్ల మోత మోగిస్తూ సాగుతున్న ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే 30 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది. బయ్యర్లందరూ సేఫ్ జోన్కు దగ్గరగా ఉన్నారు. ఈ వీకెండ్లో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు కాబట్టి రెండో వారంలోనూ ‘ధమాకా’ జోరు కొనసాగించడం ఖాయం.
సినిమా మంచి లాభాలు అందుకుని బ్లాక్ బస్టర్ రేంజ్ అందుకున్నా ఆశ్చర్యం లేదు. ఐదు నెలల వ్యవధిలో రెండు బ్లాక్బస్టర్లు కొట్టడం అంటే ఏ సంస్థకైనా పెద్ద విషయమే. ఈ ఊపులో Pawan kalyanతో అనుకుంటున్న సినిమా కనుక ఓకే అయితే పీపుల్స్ మీడియా వారి పంట పండినట్లే.
This post was last modified on December 27, 2022 7:12 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…