ఊహించని స్థాయిలో ధమాకా బాక్సాఫీస్ ని ఊపేయడంతో మాస్ మహారాజా Raviteja ఫ్యాన్స్ ఆనందం మాటల్లో చెప్పేది కాదు. ప్రస్తుతానికి వీక్ డేస్ డ్రాప్ కనిపిస్తున్నప్పటికీ మొదటి మూడు రోజుల వసూళ్లు మాత్రం ఓ రేంజ్ లో వచ్చేశాయి. బ్రేక్ ఈవెన్ దాటేయడంతో ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ చేసిన గాయాలు పూర్తిగా మాసిపోయాయి. కనీసం ఇంకో వారం స్ట్రాంగ్ రన్ ఖాయంగా కనిపిస్తోంది. ఫైనల్ ఫిగర్ ఎక్కడ ఆగుతుందో ఇప్పుడే చెప్పలేం కానీ మాస్ రాజా టాప్ త్రీలో ఉండటం కన్ఫర్మ్ అయ్యింది. మాస్ సెంటర్స్ లో మంచి రెవిన్యూ కొనసాగడం ఖాయమని ట్రేడ్ నమ్మకంగా చెబుతోంది
ఇప్పుడీ ప్రభావం వాల్తేరు వీరయ్యకు ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ Dhamaka ఏ మాత్రం అటుఇటు అయినా చిరంజీవి సినిమాలో చేసింది స్పెషల్ రోల్ కాబట్టి రవి ఫ్యాన్స్ ఈ రేంజ్ లో జోష్ చూపించేవారు కాదు. కానీ ఇప్పుడది హిట్టయ్యింది కనక రెట్టింపు ఉత్సాహంతో ఓపెనింగ్స్ కి తోడ్పడతారు. పైగా రవితేజ ఇవాళ్టి నుంచి మెగాస్టార్ తో కలిసి ప్రమోషన్లలో పాలుపంచుకోబోతున్నాడు. అందులో భాగంగానే సాయంత్రం అయిదు గంటలకు ప్రెస్ మీట్ పెట్టారు. ఇద్దరు హీరోలు వస్తారనే సమాచారం ఉంది. విడివిడిగా టీజర్లైతే వచ్చాయి కానీ కాంబో సాంగ్ ప్లస్ ఇద్దరూ కలిసి డాన్స్ చేసిన అసలైన పాట రావాల్సి ఉంది.
సంక్రాంతికి తీవ్రమైన పోటీ ఉండటంతో పాటు వీరసింహారెడ్డి నిర్మాతలూ మైత్రి వాళ్లే కావడం వల్ల పబ్లిసిటీ విషయంలో మెగా కాంపౌండ్ సైతం ఓ చేయి వేయక తప్పేలా లేదు. మొన్న వ్యక్తిగతంగా పెట్టుకున్న ఫ్యాన్స్ మీటింగ్ కారణం ఇదే. ఇప్పటిదాకా వచ్చిన మూడు పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఇకపై వచ్చే ఏ ప్రమోషన్ కంటెంట్ అయినా సరే సోషల్ మీడియాలో బలంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అఖండ సక్సెస్, అన్ స్టాపబుల్ షోకు వచ్చిన రెస్పాన్స్ తో బాలయ్య ఫుల్ ఎనర్జీతో ఉండగా ఆచార్య డిజాస్టర్, గాడ్ ఫాదర్ యావరేజ్ ఫలితంతో Chiru ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసిమీద ఉన్నారు.
This post was last modified on December 27, 2022 7:18 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…