ఊహించని స్థాయిలో ధమాకా బాక్సాఫీస్ ని ఊపేయడంతో మాస్ మహారాజా Raviteja ఫ్యాన్స్ ఆనందం మాటల్లో చెప్పేది కాదు. ప్రస్తుతానికి వీక్ డేస్ డ్రాప్ కనిపిస్తున్నప్పటికీ మొదటి మూడు రోజుల వసూళ్లు మాత్రం ఓ రేంజ్ లో వచ్చేశాయి. బ్రేక్ ఈవెన్ దాటేయడంతో ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ చేసిన గాయాలు పూర్తిగా మాసిపోయాయి. కనీసం ఇంకో వారం స్ట్రాంగ్ రన్ ఖాయంగా కనిపిస్తోంది. ఫైనల్ ఫిగర్ ఎక్కడ ఆగుతుందో ఇప్పుడే చెప్పలేం కానీ మాస్ రాజా టాప్ త్రీలో ఉండటం కన్ఫర్మ్ అయ్యింది. మాస్ సెంటర్స్ లో మంచి రెవిన్యూ కొనసాగడం ఖాయమని ట్రేడ్ నమ్మకంగా చెబుతోంది
ఇప్పుడీ ప్రభావం వాల్తేరు వీరయ్యకు ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ Dhamaka ఏ మాత్రం అటుఇటు అయినా చిరంజీవి సినిమాలో చేసింది స్పెషల్ రోల్ కాబట్టి రవి ఫ్యాన్స్ ఈ రేంజ్ లో జోష్ చూపించేవారు కాదు. కానీ ఇప్పుడది హిట్టయ్యింది కనక రెట్టింపు ఉత్సాహంతో ఓపెనింగ్స్ కి తోడ్పడతారు. పైగా రవితేజ ఇవాళ్టి నుంచి మెగాస్టార్ తో కలిసి ప్రమోషన్లలో పాలుపంచుకోబోతున్నాడు. అందులో భాగంగానే సాయంత్రం అయిదు గంటలకు ప్రెస్ మీట్ పెట్టారు. ఇద్దరు హీరోలు వస్తారనే సమాచారం ఉంది. విడివిడిగా టీజర్లైతే వచ్చాయి కానీ కాంబో సాంగ్ ప్లస్ ఇద్దరూ కలిసి డాన్స్ చేసిన అసలైన పాట రావాల్సి ఉంది.
సంక్రాంతికి తీవ్రమైన పోటీ ఉండటంతో పాటు వీరసింహారెడ్డి నిర్మాతలూ మైత్రి వాళ్లే కావడం వల్ల పబ్లిసిటీ విషయంలో మెగా కాంపౌండ్ సైతం ఓ చేయి వేయక తప్పేలా లేదు. మొన్న వ్యక్తిగతంగా పెట్టుకున్న ఫ్యాన్స్ మీటింగ్ కారణం ఇదే. ఇప్పటిదాకా వచ్చిన మూడు పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఇకపై వచ్చే ఏ ప్రమోషన్ కంటెంట్ అయినా సరే సోషల్ మీడియాలో బలంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అఖండ సక్సెస్, అన్ స్టాపబుల్ షోకు వచ్చిన రెస్పాన్స్ తో బాలయ్య ఫుల్ ఎనర్జీతో ఉండగా ఆచార్య డిజాస్టర్, గాడ్ ఫాదర్ యావరేజ్ ఫలితంతో Chiru ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసిమీద ఉన్నారు.
This post was last modified on December 27, 2022 7:18 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…