బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్తో హిందీ సినిమా తీయాలన్న లక్ష్యంతో చాలామంది బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఉన్నారు. ప్రభాస్ కూడా ఆసక్తితోనే ఉన్నట్లు కనిపిస్తున్నాడు కానీ.. ఆల్రెడీ చేతిలో ఉన్న టాలీవుడ్ కమిట్మెంట్లను పూర్తి చేస్తే తప్ప అతను బాలీవుడ్కు వెళ్లే పరిస్థితి లేదు. అయితే హృతిక్తో కలిసి ప్రభాస్ ఓ మల్టీస్టారర్ చేయబోతున్నాడంటూ ప్రభాస్ గురించి ఓ కబురు వినిపిస్తోంది కొన్ని రోజులుగా. అది నిజమయ్యే రోజు దగ్గర పడినట్లుగా ఇప్పుడు బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ చేసిన తాజా ప్రకటన ఈ దిశగా చర్చకు అవకాశమిస్తోంది.
యశ్ రాజ్ ఫిలిమ్స్ 50వ వార్షికోత్సవం పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఇండియాలో అతి పెద్ద స్టార్లయిన ఇద్దరు హీరోలతో కలిసి ఓ మెగా మల్టీస్టారర్ను అనౌన్స్ చేయబోతున్నట్లు మీడియాకు సమాచారం అందింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఎవరా ఇద్దరు సూపర్ స్టార్లు అనే విషయంలో చర్చ నడుస్తోంది. ప్రభాస్, హృతిక్లే ఆ ఇద్దరు అని బలంగా ప్రచారం జరుగుతోంది. వీళ్లిద్దరి కలయికలో ధూమ్-4 రావచ్చని కూడా కొందరు అంటున్నారు. దీనిపై అంతకంతకూ ఉత్కంఠ పెరిగిపోతోంది. ఒకట్రెండు రోజుల్లో యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య రాయ్ కపూర్ ఈ ప్రాజెక్టు విషయమై స్వయంగా ప్రకటన చేసే అవకాశాలున్నాయి.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…