బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్తో హిందీ సినిమా తీయాలన్న లక్ష్యంతో చాలామంది బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఉన్నారు. ప్రభాస్ కూడా ఆసక్తితోనే ఉన్నట్లు కనిపిస్తున్నాడు కానీ.. ఆల్రెడీ చేతిలో ఉన్న టాలీవుడ్ కమిట్మెంట్లను పూర్తి చేస్తే తప్ప అతను బాలీవుడ్కు వెళ్లే పరిస్థితి లేదు. అయితే హృతిక్తో కలిసి ప్రభాస్ ఓ మల్టీస్టారర్ చేయబోతున్నాడంటూ ప్రభాస్ గురించి ఓ కబురు వినిపిస్తోంది కొన్ని రోజులుగా. అది నిజమయ్యే రోజు దగ్గర పడినట్లుగా ఇప్పుడు బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ చేసిన తాజా ప్రకటన ఈ దిశగా చర్చకు అవకాశమిస్తోంది.
యశ్ రాజ్ ఫిలిమ్స్ 50వ వార్షికోత్సవం పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఇండియాలో అతి పెద్ద స్టార్లయిన ఇద్దరు హీరోలతో కలిసి ఓ మెగా మల్టీస్టారర్ను అనౌన్స్ చేయబోతున్నట్లు మీడియాకు సమాచారం అందింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఎవరా ఇద్దరు సూపర్ స్టార్లు అనే విషయంలో చర్చ నడుస్తోంది. ప్రభాస్, హృతిక్లే ఆ ఇద్దరు అని బలంగా ప్రచారం జరుగుతోంది. వీళ్లిద్దరి కలయికలో ధూమ్-4 రావచ్చని కూడా కొందరు అంటున్నారు. దీనిపై అంతకంతకూ ఉత్కంఠ పెరిగిపోతోంది. ఒకట్రెండు రోజుల్లో యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య రాయ్ కపూర్ ఈ ప్రాజెక్టు విషయమై స్వయంగా ప్రకటన చేసే అవకాశాలున్నాయి.
This post was last modified on July 18, 2020 11:47 pm
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…