బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్తో హిందీ సినిమా తీయాలన్న లక్ష్యంతో చాలామంది బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఉన్నారు. ప్రభాస్ కూడా ఆసక్తితోనే ఉన్నట్లు కనిపిస్తున్నాడు కానీ.. ఆల్రెడీ చేతిలో ఉన్న టాలీవుడ్ కమిట్మెంట్లను పూర్తి చేస్తే తప్ప అతను బాలీవుడ్కు వెళ్లే పరిస్థితి లేదు. అయితే హృతిక్తో కలిసి ప్రభాస్ ఓ మల్టీస్టారర్ చేయబోతున్నాడంటూ ప్రభాస్ గురించి ఓ కబురు వినిపిస్తోంది కొన్ని రోజులుగా. అది నిజమయ్యే రోజు దగ్గర పడినట్లుగా ఇప్పుడు బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ చేసిన తాజా ప్రకటన ఈ దిశగా చర్చకు అవకాశమిస్తోంది.
యశ్ రాజ్ ఫిలిమ్స్ 50వ వార్షికోత్సవం పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఇండియాలో అతి పెద్ద స్టార్లయిన ఇద్దరు హీరోలతో కలిసి ఓ మెగా మల్టీస్టారర్ను అనౌన్స్ చేయబోతున్నట్లు మీడియాకు సమాచారం అందింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఎవరా ఇద్దరు సూపర్ స్టార్లు అనే విషయంలో చర్చ నడుస్తోంది. ప్రభాస్, హృతిక్లే ఆ ఇద్దరు అని బలంగా ప్రచారం జరుగుతోంది. వీళ్లిద్దరి కలయికలో ధూమ్-4 రావచ్చని కూడా కొందరు అంటున్నారు. దీనిపై అంతకంతకూ ఉత్కంఠ పెరిగిపోతోంది. ఒకట్రెండు రోజుల్లో యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య రాయ్ కపూర్ ఈ ప్రాజెక్టు విషయమై స్వయంగా ప్రకటన చేసే అవకాశాలున్నాయి.
This post was last modified on July 18, 2020 11:47 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…