Movie News

ఫ్లాష్ బ్యాక్ : ‘ఖుషి’ లండన్ లో మొదటి రిలీజ్

Pawan Kalyan క్రేజీ మూవీ ‘ఖుషి’ ఇప్పటికీ ఫ్యాన్స్ బెస్ట్ మూవీస్ లిస్టులో టాప్ ప్లేన్ ఉంటుంది. అప్పట్లో ఈ కాలేజీ లవ్ స్టోరీతో కొత్త రికార్డులు క్రియేట్ చేశాడు పవన్. అందుకే రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న ఈ టైంలో నిర్మాత ఏ ఎం రత్నం మళ్ళీ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ కొత్త ట్రైలర్ , రిలీజ్ పోస్టర్స్ తో సోషల్ మీడియాలో హంగామా మొదలెట్టేశారు. తాజాగా నిర్మాత ఖుషి గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు బయట పెట్టారు.

ఖుషి లండన్ లో రిలీజైన మొదటి తెలుగు సినిమా అని తాజాగా నిర్మాత రత్నం వెల్లడించారు. అలాగే తమిళ్ లో అదే రోజు రిలీజ్ చేశామని తెలిపాడు. “అప్పట్లో తెలుగు సినిమాలను తమిళనాడులో విడుదల చేయడంలో కొంత జాప్యం జరుగుతుండగా.. ఖుషి మాత్రం ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఒకే రోజు విడుదలైంది. మణిరత్నంతో సహా తమిళనాడులోని పలువురు ప్రముఖులు ఈ చిత్రాన్ని థియేటర్లలో వీక్షించారు. లండన్‌లో విడుదలైన తొలి తెలుగు సినిమా కూడా ‘ఖుషి’నే. నా కుమారుడు అదే సమయంలో లండన్‌లో చదువుతున్నాడు. దాంతో ఖుషిని అక్కడ విడుదల చేయడానికి అతడి స్నేహితుడి సహాయం తీసుకున్నాం. ” అంటూ ఖుషి రిలీజ్ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు నిర్మాత.

అలాగే ఖుషి క్లైమాక్స్ గురించి కూడా కొన్ని సంగతులు పెంచుకున్నారు ” తమిళ వెర్షన్ క్లైమాక్స్‌లో జంట కవలలకు జన్మనిచ్చినట్లు చూపించాలి అనుకున్నాము. అయితే అప్పటికే మేము మరో వెర్షన్ కి చిత్రీకరించాము. కొన్ని కారణాల వల్ల దానిని మార్చలేకపోయాం. తెలుగు వెర్షన్ కోసం మాత్రం దానిని అమలు చేసాము. తెలుగు క్లైమాక్స్ పట్ల నేను చాలా సంతోషించాను. 10 ఏళ్లలోపులో చాలా మంది పిల్లలకు జన్మనివ్వడం చాలా సరదాగా అనిపించింది. ” అంటూ ఖుషి క్లైమాక్స్ వెనుక జరిగిన విషయాలను తెలియజేస్తూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళారు ఏ ఎం రత్నం.

This post was last modified on December 26, 2022 8:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

59 minutes ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

1 hour ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

2 hours ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

3 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

3 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago