Pawan Kalyan క్రేజీ మూవీ ‘ఖుషి’ ఇప్పటికీ ఫ్యాన్స్ బెస్ట్ మూవీస్ లిస్టులో టాప్ ప్లేన్ ఉంటుంది. అప్పట్లో ఈ కాలేజీ లవ్ స్టోరీతో కొత్త రికార్డులు క్రియేట్ చేశాడు పవన్. అందుకే రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న ఈ టైంలో నిర్మాత ఏ ఎం రత్నం మళ్ళీ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ కొత్త ట్రైలర్ , రిలీజ్ పోస్టర్స్ తో సోషల్ మీడియాలో హంగామా మొదలెట్టేశారు. తాజాగా నిర్మాత ఖుషి గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు బయట పెట్టారు.
ఖుషి లండన్ లో రిలీజైన మొదటి తెలుగు సినిమా అని తాజాగా నిర్మాత రత్నం వెల్లడించారు. అలాగే తమిళ్ లో అదే రోజు రిలీజ్ చేశామని తెలిపాడు. “అప్పట్లో తెలుగు సినిమాలను తమిళనాడులో విడుదల చేయడంలో కొంత జాప్యం జరుగుతుండగా.. ఖుషి మాత్రం ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఒకే రోజు విడుదలైంది. మణిరత్నంతో సహా తమిళనాడులోని పలువురు ప్రముఖులు ఈ చిత్రాన్ని థియేటర్లలో వీక్షించారు. లండన్లో విడుదలైన తొలి తెలుగు సినిమా కూడా ‘ఖుషి’నే. నా కుమారుడు అదే సమయంలో లండన్లో చదువుతున్నాడు. దాంతో ఖుషిని అక్కడ విడుదల చేయడానికి అతడి స్నేహితుడి సహాయం తీసుకున్నాం. ” అంటూ ఖుషి రిలీజ్ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు నిర్మాత.
అలాగే ఖుషి క్లైమాక్స్ గురించి కూడా కొన్ని సంగతులు పెంచుకున్నారు ” తమిళ వెర్షన్ క్లైమాక్స్లో జంట కవలలకు జన్మనిచ్చినట్లు చూపించాలి అనుకున్నాము. అయితే అప్పటికే మేము మరో వెర్షన్ కి చిత్రీకరించాము. కొన్ని కారణాల వల్ల దానిని మార్చలేకపోయాం. తెలుగు వెర్షన్ కోసం మాత్రం దానిని అమలు చేసాము. తెలుగు క్లైమాక్స్ పట్ల నేను చాలా సంతోషించాను. 10 ఏళ్లలోపులో చాలా మంది పిల్లలకు జన్మనివ్వడం చాలా సరదాగా అనిపించింది. ” అంటూ ఖుషి క్లైమాక్స్ వెనుక జరిగిన విషయాలను తెలియజేస్తూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళారు ఏ ఎం రత్నం.
This post was last modified on December 26, 2022 8:29 pm
లోక్సభలో ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, ఏపీ ప్రయోజనాల గురించి ప్రశ్నించిన నేతగా టీడీపీ ఎంపీ…
రెబల్ స్టార్, దివంగత కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి అనూహ్యంగా ఎన్నికల ప్రచారం చివరి రోజు రాజకీయ ప్రచారం…
సంక్రాంతి, దసరా సెలవులు వచ్చాయి అంటే మొదట మీడియాలో వినిపించే పేరు పంతంగి. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి…
"మీ శ్రేయోభిలాషి.." అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన మరుక్షణం…
ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యేందుకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. కానీ.. ఇంతలోనే ఏపీలో ఏదో జరుగుతోందనే…
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాడు. రెండు రోజుల కిందటే…