సంక్రాంతి సినిమాల మీద హైప్ ఏ రేంజ్ లో ఉందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వీటికి సంబంధించిన ఏ విషయమైనా సరే ఫ్యాన్స్ లో విపరీతమైన ఎగ్జైట్ మెంట్ కు కారణమవుతోంది. చిరంజీవి బాలకృష్ణలు అయిదేళ్ల తర్వాత తలపడుతుండటంతో ఈసారి ఫీవర్ ఇంకాస్త ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్ లో జరిగిన మెగా ఫ్యాన్స్ సమావేశానికి వాల్తేర్ వీరయ్య నిర్మాతతో పాటు దర్శకుడు బాబీ, తెలుగు రాష్ట్రాల అభిమాన సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. పూర్తిగా ప్రైవేట్ వ్యవహారంగా నడిచిన ఈ మీటింగ్ లో చాలా అంశాలే చర్చకొచ్చాయి. ముఖ్యంగా థియేటర్లు, బెనిఫిట్ షోల గురించి డిస్కస్ చేసుకున్నారు.
దర్శకుడు బాబీ తన ప్రసంగంలో కీలకమైన చిరు ఇంట్రో గురించి లీక్ ఇచ్చేశారు. పది రోజుల పాటు భారీ వర్షంలో బోటు మీద చిరంజీవి పరిచయ సన్నివేశాన్ని చిత్రీకరించామని, అందరూ చలికి వణుకుతుండగా ఆయన మాత్రం అలాగే పాల్గొని డూప్ అవసరం లేకుండా నటించారని ఫుల్ ఎలివేషన్లు ఇచ్చేశాడు. ఇలాంటి సీన్లు క్రమం తప్పకుండా వస్తూనే ఉంటాయని, ఒక చిరు అభిమాని ఎలాగైతే మెగాస్టార్ ని చూడాలి అనుకుంటారో దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా చూపిస్తానని హామీ ఇచ్చేశాడు. సరే రిలీజ్ కు ముందు ఇలాంటి ఉత్సాహం ఇచ్చే మాటలు చెప్పడం సహజమే కాబట్టి తరచి చూడాల్సిన అవసరం లేదు.
బాబీకి వాల్తేరు వీరయ్య సక్సెస్ చాలా కీలకం. ఎందుకంటే జై లవకుశ, వెంకీ మామలు కమర్షియల్ గా ఏ స్కేల్ లో వర్కౌట్ అయినా ఆ హీరోల ఎనర్జీని పూర్తి స్థాయిలో వాడుకునేలా సరైన స్క్రిప్ట్ లు రాసుకోలేదనే కామెంట్స్ లేకపోలేదు. అందుకే ఆచార్య డిజాస్టర్, గాడ్ ఫాదర్ యావరేజ్ ఫలితంతో డీలా పడిన అభిమానులకు కనక అంచనాలకు తగ్గట్టు సినిమా ఇస్తే ఆపై స్టార్ హీరోల నుంచి ఆఫర్లు క్యూ కడతాయి. పైగా రవితేజకో పవర్ ఫుల్ పాత్ర ఇవ్వడం, దేవిశ్రీప్రసాద్ కు పాటలకు మంచి రీచ్ రావడం ఇవన్నీ సానుకూల అంశాలే. మరి బాబీ అన్నట్టు నిజంగా వీరయ్య అంత సత్తా చూపిస్తాడా వేచి చూడాలి
This post was last modified on December 26, 2022 11:40 am
బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేటస్ సంపాదించాక, తెలుగులో…
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…