ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్లో బాగానే ఆధిపత్యం చూపించాయి. KGF-2, Brahmastra, Kantara, Love Today లాంటి చిత్రాలు మన దగ్గర బాగా ఆడాయి. ముఖ్యంగా కేజీఎఫ్-2, కాంతార అయితే టాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేశాయి. ఐతే ముగింపులో మాత్రం డబ్బింగ్ బొమ్మలకు ఘోర పరాభవం తప్పలేదు.
క్రిస్మస్ కానుకగా తెలుగులో రెండు పేరున్న చిత్రాలు షెడ్యూల్ అయినప్పటికీ.. తమిళ అనువాదాలైన ‘లాఠీ’, ‘కనెక్ట్’ చిత్రాలను తెలుగులో కొంచెం పెద్ద స్థాయిలోనే రిలీజ్ చేశారు. ఇవి రెండూ ఒక రోజు ముందే రావడంతో కోరుకున్న దాని కంటే ఎక్కువ థియేటర్లే కేటాయించారు.
కానీ ఆ ఒక్క రోజును కూడా ‘Laththi’, ‘Connect’ ఉపయోగించుకోలేకపోయాయి. ఈ సినిమాలకు మార్నింగ్ షోల నుంచే తిరస్కారం మొదలైంది. ఆ తర్వాత అవి ఏ దశలోనూ పైకి లేవలేకపోయాయి.
శుక్రవారం రిలీజైన ‘Dhamaka’, ‘18 Pages’ చిత్రాలు రెండూ యావరేజ్ టాకే తెచ్చుకున్నప్పటికీ వాటికి మంచి వసూళ్లే వచ్చాయి. ముఖ్యంగా ‘ధమాకా’ అంచనాలను మించి వసూళ్లతో అదరగొడుతోంది. వీకెండ్ అంతా సందడి ఆ చిత్రానిదే. ‘18 పేజెస్’కు సిటీల్లో, ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో ఆదరణ బాగుంది.
లాఠీ, కనెక్ట్ చిత్రాలకు మినిమం కలెక్షన్లు లేవు. ఆ చిత్రాలకు కేటాయించిన స్క్రీన్లను ముందే రెండో రోజు నుంచి చాలా వరకు తీసేసే ఆలోచన ఉంది. కానీ టాక్ బాగుంటే ఓ మోస్తరుగా అయినా స్క్రీన్లు కొనసాగించేవారు.
కానీ తొలి రోజే చతికిలపడడంతో చాలా స్క్రీన్లను లేపేశారు. గత వారం వచ్చిన ‘అవతార్-2’ మల్టీప్లెక్సుల్లో కొత్త సినిమాలకు దీటుగా స్క్రీన్లు, షోలతో నడుస్తుండగా.. ధమాకా, 18 పేజెస్ చిత్రాలకు స్పందన బాగుండడంతో తమిళ అనువాదాల పని క్లోజ్ అయిపోయింది. వీకెండ్లోనూ ప్రభావం చూపలేక అవి డిజాస్టర్లుగా మిగిలాయి.
This post was last modified on December 25, 2022 6:20 pm
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…