జ్యోతిలక్ష్మీ.. లోఫర్.. ఇజం.. రోగ్.. పైసా వసూల్.. మెహబూబా.. పూరి జగన్నాథ్ ‘టెంపర్’ తర్వాత తీసిన సినిమాలివి. వీటిలో ఏ సినిమా కూడా ఓ మోస్తరు విజయాన్నందుకోలేదు. అన్నీ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లయిన చిత్రాలే. తన గురువు రామ్ గోపాల్ వర్మ బాటలోనే పూరి కూడా పయనిస్తున్నాడని.. ఆయన పనైపోయిందని అందరూ ఓ నిర్ణయానికి వచ్చేసిన సమయం అది. అలాంటి తరుణంలో యువ కథానాయకుడు రామ్.. పూరితో పని చేయడానికి ముందుకొస్తే అతడికేమైనా పిచ్చా అన్నట్లుగా చూశారంతా. వీళ్ల కలయికలో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే టైటిల్తో కొత్త సినిమా అనౌన్స్ చేస్తే.. ఏముంది ఇందులో అన్నట్లుగా చూశారు జనాలు.
ఫస్ట్ లుక్.. టీజర్.. ట్రైలర్.. ఆడియో.. ఒకదాని తర్వాత ఒకటి రిలీజయ్యాయి. ఏవి కూడా మరీ ఎగ్జైటింగ్గా అనిపించలేదు. పూరి ఖాతాలో మరో ఫ్లాప్ ఖాయం అన్నట్లుగానే ఉన్నాయి కొన్ని రోజుల ముందు వరకు అంచనాలు. కానీ విడుదల దగ్గర పడేసరికి పరిస్థితి మారిపోయింది. ‘ఇస్మార్ట్ శంకర్’ బుకింగ్స్ చూసి అంతా షాకైపోయారు. ఏంటి క్రేజ్ అనుకున్నారు. అయినా సినిమా ఆడుతుందన్న నమ్మకం చాలామందిలో లేదు. సినిమా రిలీజైతే అంతా చల్లబడిపోతుందిలే అంటూ కౌంటర్లు వేశారు. కానీ బొమ్మ పడింది. థియేటర్లు దద్దరిల్లాయి. రివ్యూలు యావరేజ్గా వచ్చినా సరే.. అవేమీ పట్టించుకోకుండా మాస్ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని కట్టబెట్టారు.
ఒక స్టార్ హీరో సినిమా స్థాయిలో ఈ చిత్రం బాక్సాఫీసై దగ్గర వసూళ్ల మోత మోగించింది. రూ.50 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసింది. 2019 సంవత్సరానికి బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. రామ్కు ఇది కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాతో పూరి మళ్లీ తన సత్తా చూపించి.. ఇండస్ట్రీ అంతా మళ్లీ తన వైపు తిరిగి చూసేలా చేశాడు. విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ స్టార్తో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు. ఈ సంచలన విజయానికి ఈ రోజు (జులై 18)తో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా పూరి, రామ్, ఛార్మి సహా యూనిట్ సభ్యులందరూ తమ ఉద్వేగాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
మొన్నటిదాకా రాయలసీమ అంటే కరువు సీమ కిందే లెక్క. ఏ రాజకీయ పార్టీ అదికారంలోకి వచ్చినా… రాయలసీమ ఓట్లను గంపగుత్తగా…
గోదావరి జిల్లాల రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తీర్పు ఇస్తే రాష్ట్రంలో…
ఒక సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ అంటే సాధారణంగా క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. అందుకే పుష్ప 2, కెజిఎఫ్ 2,…
తెలంగాణలో జనసేన అధినేత పవన్కల్యాణ్.. ఈ నెల 2న నిర్వహించ తలపెట్టిన తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి…
దర్శకుడు సురేందర్ రెడ్డి పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. కారణం పవన్ కళ్యాణ్ అంగీకారం వస్తే సినిమా మొదలుపెట్టాలి. ఈ…
ఏపీలో ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు)గా ఉన్న వైసీపీ రెండేళ్ల కాలంలో ఏం చేసింది? ఏం సాధించింది? అనేది ఆసక్తికరం. శుక్రవారం(జూన్…